breaking news
gym trainer kills
-
ఢిల్లీలో దారుణ హత్య.. జిమ్ ట్రైనర్ ముఖంపై 21 సార్లు దాడి చేసి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. భజన్పురా ప్రాంతంలో 28 ఏళ్ల జిమ్ యజమానికి కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్గా గుర్తించారు. బుధవారం అర్థరాత్రి గమ్రీ ఎక్స్టెన్షన్లోని అతని ఇంటి వెలుపల ఈ దాడి జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని జేపీసీ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.బాధితుడు సుమిత్ జిమ్తోపాటు టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారం చేస్తున్నాడని, ఇటీవల హత్యాయత్నం కేసులో దోషిగా తేలి బెయిల్పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి చౌదరి తన ఇంటి బయట కూర్చున్నప్పుడు మరో ను ముగ్గురు, నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి గొడవ పడినట్లు పేర్కొన్నారు. సుమిత్పై కత్తితో దాడి చేసి ముఖం, మెడ, ఛాతీ, పొత్తికడుపుపై పలుమార్లు పొడిచారని, ముఖంపై 21కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. చౌదరికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు చెప్పారు. -
ఫోను కోసం.. గొంతుకోసి చంపేశాడు!
ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్ చేసి.. దానికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో డెలివరీ బోయ్ని చంపేశాడో వ్యక్తి. ఫ్లిప్కార్ట్ డెలివరీ బోయ్గా పనిచేస్తున్న నంజుండస్వామి (29)ని కె. వరుణ్కుమార్ (22) అనే జిమ్ ట్రైనర్ గొంతు కోసి హతమార్చాడు. బెంగళూరులోని విజయనగర్ ప్రాంతంలో గల ఓ భవనం లిఫ్టు షాఫ్టులో అతడి మృతదేహం పడి ఉంది. పది రోజుల క్రితమే జిమ్లో చేరిన వరుణ్ వద్ద అప్పటి వరకు ఫోన్ లేదు. కానీ అతడి స్నేహితులు, క్లయింట్లు అందరివద్ద మంచి ఫోన్లున్నాయి. మెకానిక్గా పనిచేసే తన తండ్రిని అతడు డబ్బులు కావాలని అడిగినా, తనవద్ద అంత లేదని ఇవ్వలేదు. అప్పుడే ఉద్యోగంలో చేరడంతో వరుణ్ వద్ద కూడా డబ్బులు లేవు. ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత తనను డబ్బులు అడగడం సరికాదని అతడి తండ్రి చెప్పారు. చేతిలో డబ్బులు లేకపోయినా, రెడ్మి నోట్ 3 ఫోన్ కోసం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి, తన జిమ్ ల్యాండ్లైన్ నంబరు ఇచ్చాడు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నంజుండ స్వామి డెలివరీ తీసుకుని రాగా, అతడిని సెకండ్ ఫ్లోర్లోకి వరుణ్ పిలిచాడు. అతడి వద్ద నుంచి ఫోన్ లాక్కోడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఎలాగోలా తప్పించుకుని బయటకు పారిపోయాడు. దాంతో వరుణ్ వెనక నుంచి ఒక ఫ్లవర్ వాజ్తో అతడి తలమీద కొట్టగా, స్వామి స్పృహతప్పి పడిపోయాడు. దాంతో అతడి గొంతును ఓ కత్తితో కోసేశాడు. దాదాపు పదిగంటల పాటు శవాన్ని అలాగే వదిలేసి, తర్వాత లిప్టు షాఫ్ట్లో పారేశాడు. అతడి వద్ద ఉన్న రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు పదివేల రూపాయల నగదు, డెలివరీ కోసం తెచ్చిన ఇతర వస్తువులు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వాటిలో రెడ్మి ఫోన్ను తాను వాడుతూ, రూ. 24వేల విలువైన హెచ్టీసీ ఫోన్ను మరో స్నేహితుడికి ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత స్వామి తండ్రి తన కొడుకు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయానికి పోలీసులు స్వామి మృతదేహాన్ని కనుగొన్నా.. అది అతడిదని తొలుత తెలియలేదు. తర్వాత ఫ్లిప్కార్ట్ వారిని సంప్రదించగా, జిమ్లో డెలివరీకి వెళ్లిన తర్వాత నుంచి అతడి ఆచూకీ లేదని చెప్పారు. వరుణ్ జిమ్ తీయడం లేదని తెలిసింది. దాంతో అతడిని అరెస్టు చేసి విచారించగా మొత్తం విషయం బయటపడింది.