breaking news
guvvala
-
చిత్రకారుడు గువ్వల కెనడీ అస్తమయం
రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రముఖ చిత్రకారుడు గువ్వలకెనడీ(53) శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటుతో స్ధానిక కంబాలపేటలోని ఆయన నివాసంలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉదయం అల్పాహారాన్ని తీసుకుని, గణపతి చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతుండగా, హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన కన్ను మూసారు. కంబాలపేటలో ఆయన క్రియేటివ్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి యువతకు చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చేవారు. శిధిలమవుతున్న దామెర్ల రామారావు చిత్రాలను ఆయన తిరిగి రూపొందించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఆయన చిత్రాలు బహుమతులను గెలుచుకున్నాయి. ఆయన భార్య గువ్వల పద్మ కూడా చిత్రలేఖనంలో నిపుణురాలు. 2017 జనవరిలో నగరంలో చిత్రలేఖన ప్రదర్శన నిర్వహించడానికి ఆయన ప్రణాళికలు తయారుచేసుకుంటున్నారు. సమైక్య ఉద్యమం, హేవ్లాక్ వంతెన పరిరక్షణ తదితర ప్రజాసమస్యలను ఆయన పెయింటింగుల ద్వారా వివరించేవారు. ఆయన మృతికి నగరప్రముఖులు, కళాకారులు సంతాపాన్ని వ్యక్తంచేశారు. గువ్వల కెనడీ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. కాగా శనివారం ఉదయం పది గంటలకు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో కెనడీ అభిమానుల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించనున్నారు. -
తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
మహబూబ్నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు తదితర విషయాల్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. అదే సమయంలో పక్క రాష్ట్రం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో శనివారం సాయంత్రం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ కృష్టి చేస్తోందని చెప్పారు. ఇతర పార్టీలు ఏజెంట్లను పెట్టుకుని దొంగ సభ్యత్వాలు నమోదు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్రావు ఆర్య, సభ్యత్వాల నమోదు కార్యక్రమం జిల్లా ఇన్చార్జ్ మార్కండేయతో పాటు వెయ్యి మంది వరకు కార్యకర్తలు పాల్గొన్నారు. (అచ్చంపేట)