-
ఆడుకుంటూ సజీవ దహనమయ్యారు
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : పూరి గుడిసెలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అడ్డాకుల రాకేష్(4) అనే చిన్నారి తమ పొలం వద్ద వేసిన పూరి గుడిసెలో తన మామయ్య కొడుకు రోహిత్(3)తో కలిసి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు సమీపంలోని వరికుప్పలకు నిప్పు అంటుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
యువతి బలవన్మరణం
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : నిద్ర మాత్ర లు మింగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం చీమలగూడలో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన సంధ్య(18) చదువు మధ్యలోనే వదిలేసి ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
గుమ్మలక్ష్మిపురం: మండలంలోని దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇమరిక ఆనంద్(14) అనే విద్యార్థి అనారోగ్యానికి గురై దుడ్డుకల్లు పీహెచ్సీలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆనంద్ మరణించాడని అతని కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద పాఠశాల సిబ్బందిని గట్టిగా నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం పెదమరిక పంచాయతీ పరిధి కొత్తూరుకు చెందిన ఆనంద్ ఆరవ తరగతి నుంచి ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆనంద్కు జ్వరం రావటంతో వార్డెన్ తాకేటి బాలయ్య స్థానిక పీహెచ్సీలో వైద్యం చేయించారు. శనివారం ఉదయం ఆనంద్కు ఫిట్స్ రావడంతో దుడ్డుకల్లు పీహెచ్సికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో అక్కడ వైద్యాధికారి రమేష్ లేరు. స్టాఫ్నర్స్ వైద్యాధికారికి ఫోన్ చేసి ఆయన సలహా మేరకు బీపీ చూసి సెలైన్ ఎక్కించారు. కానీ ప్రయోజనం దక్కలేదు. ఆనంద్ మృతిచెందిన సంగతి తెలుసుకున్న తల్లి కమల, తమ్ముడు మన్మధరావు, ఇతర కుటుంబ సభ్యులు, కొత్తూరు గ్రామస్తులు దుడ్డుకల్లు పీహెచ్సికి చేరుకుని బోరున విలపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్లను గట్టిగా నిలదీశారు. సమయానికి వైద్యాధికారి రమేష్ ఆస్పత్రిలో లేకపోవటం వల్లే ఘోరం జరిగిందని వాపోయారు. ఐటీడీఏ పీవో, ఆర్డీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఇతర ఉన్నతాధికారులు వచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని భీష్మించారు. విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాల మేరకు పార్వతీపురం ఆర్డీవో ఆర్ గోవిందరావు పీహెచ్సీకీ చేరుకుని ఆనంద్ మృతదేహాన్ని పరిశీలించారు. అందించిన చికిత్స గురించి వైద్యసిబ్బందిని, ఆనంద్ ఆరోగ్యం గూర్చి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మృతుని బంధువులతో మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆనంద్ కుటుంబానికి జీవనోపాధి కల్పించడంతోపాటు ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ డీడీ ప్రభాకరరావు, డిప్యూటీ ఈవో రమణనాయుడు తదితరులు పీహెచ్సీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆనంద్ తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారని కొత్తూరు గ్రామస్తులు చెప్పారు. ఇంతలోనే ఘోరం జరగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి
గుమ్మలక్ష్మీపురం/కురుపాం: కురుపాం మండలం పల్లంబారిడి గ్రామ సమీపంలోని మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం ఓ ట్రాక్టర్ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. కురుపాం మండలం మరిపల్లి గ్రామానికి చెందిన 16 మంది గిరిజనులు గుజ్జువాయి పంచాయితీ గోర్జిపాడు గ్రామానికి ఎగువన ఉన్న ఊటమానుగూడలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగనున్న క్రైస్తవ పండగల కోసం ఈత కొమ్మలను తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరిక సుబ్బారావు (16) అనే యువకుడు అక్కడి కక్కడే మృతిచెందాడు. సుబ్బారావు ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 7.8 గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతలోనే అతడు మరణించటంతో తల్లిదండ్రులు తులసి, యేసోన్, బంధువులు బోరున విలపించారు. ప్రమాదం గురించి తెలియగానే పల్లంబారిడి గ్రామస్తులు వచ్చి ట్రాక్టరు తొట్టెను లేపి దానికింద ఉన్న క్షతగాత్రులను మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడినవారిలో ఆరిక అనూష, ఆరిక శ్రీను, బిడ్డిక ఎల్లంగు, ఆరిక తీజన్కుమార్, ఆరిక బెనితో, బిడ్డిక నవీన్కుమార్, ఎ.మాస, ఆరిక సురేష్, ఎన్.రామారావు, ఆరిక సరోజిని, కామరాజు, ఆరిక జయరాజు, కవిత ఉన్నారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరిక అనూష అనే పదమూడేళ్ల బాలిక పరిస్ధితి విషమంగా ఉంది. మొండెంఖల్లు పీహెచ్సీ నుంచి క్షతగాత్రులు ముగ్గుర్ని మాత్రమే 108 వాహనంలో పార్వతీపురం తీసుకెళ్లగా మిగిలిన వారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. అతివేగమే కారణం డ్రైవర్ రాజు ట్రాక్టర్ను అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. సంఘటన స్ధలాన్ని ఎల్విన్పేట ఎస్సై ఐ.గోపి పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అందుబాటులో లేని వైద్యులు మొండెంఖల్లు పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు పనిచేస్తున్నప్పటికీ క్షతగాత్రులు వచ్చేసరికి ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. దీంతో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైద్యుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గర్భశోకం
పార్వతీపురం: పార్వతీపురం ఏజెన్సీలో శిశు మరణ ఘోష ఆగడం లేదు. రక్తహీనతకు గురై, అనారోగ్యం బారిన పడుతున్న తల్లుల వల్ల, పుట్టిన కొన్ని రోజుల్లోనే పురిటి రక్తపు మరకలు ఆరకుండానే తల్లి పొత్తిళ్లలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు శిశువులు మృత్యువాత పడ్డారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లుంబేసుకు చెందిన మండంగి మీనాక్షి శుక్రవారం గుమ్మలక్ష్మీపురం పీహెచ్సీలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అనారోగ్యంతో ఉండడంతో పుట్టిన బాబుకూడా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో శుక్రవారం రాత్రి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆ శిశువు మృత్యువాత పడ్డాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు మీనాక్షి, పకీరు తదితర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అలాగే గరుగుబిల్లి మండలంలోని సంతోషపురానికి చెందిన మూడునెలల బాలుడు గంట అవినాష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఈ బాలుడు కూడా రక్త హీనతతో పాటు అనారోగ్యానికి గురికావడంతో మృత్యువాత పడినట్లు వైద్యులు చెబుతున్నారు. గత బుధవారం కూడా కురుపాం మండలం మొండెంఖల్కు చెందిన ఓ శిశువు అలాగే మృత్యువాత పడ్డాడు. తరచూ శిశువులు మృత్యువాత పడుతుండడంపట్ల తల్లులు గర్భశోకంతో కుమిలిపోతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం పౌష్టికాహారం అందక అవస్థలు పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వర్గాలు గర్భిణీ స్త్రీలకు చక్కని వైద్య సేవలతోపాటు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటే శిశుమరణాలు తగ్గే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు అంటున్నారు. పౌష్టికాహార లోపమే కారణం.. గర్భిణీ స్త్రీలు అధికంగా రక్తహీనతకు లోనవ్వడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపమే. గర్భిణీ స్త్రీలకు అవసరమైన పౌష్టికాహారం గిరిజనులు తీసుకోకపోవడం వలన ప్రసవ సమయానికి రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనివల్ల తల్లికి పాలు లేక, పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు పాటించక పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటి పట్ల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, తల్లీ, పిల్లల మరణాలు లేకుండా చర్యలు చేపట్టాం. - బి.ఉమా శంకర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, పార్వతీపురం. ఆహారపు అలవాట్ల వల్ల.. స్త్రీలలో సాధారణంగా 80శాతం వరకు రక్తహీనతతో ఉంటున్నారు. వీరిని దానిని నుంచి గట్టెక్కించడానికి, ముఖ్యంగా గర్భవతిగా ఉన్న ఆమెతోపాటు కడుపులో ఉన్న బిడ్డ, ఎదగడానికి పౌష్టికాహారం కావాన్న ఉద్దేశ్యంతో అమృత హస్తంలో భాగంగా ఒకపూట సంపూర్ణ భోజనంలో గుడ్డు, పాలు, అన్నం, పప్పు, కూర తదితరవి అందిస్తున్నాం. అరోగ్య తనిఖీలు చేపడుతున్నాం. నెల నెలా బరువు తూచడం తదితరవి చూస్తున్నాం. ప్రమాదకరంగా గుర్తించి, రక్తహీనత, తక్కువ బరువు, తక్కువ వయస్సుంటే, వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. తల్లీ బిడ్డలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నాం. ఆస్పత్రి డెలివరీలను పెంచాం. వారి ఆహారపు అలవాట్లు, ఆచారాల వల్ల కొంత ఇబ్బందులు తప్పడం లేదు. - కె.విజయ గౌరి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement