-
IPL 2024: కండల వీరుడిని ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి అర్దంతరంగా వైదొలిగిన మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్, కండల వీరుడు గుల్బదిన్ నైబ్ను ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన నైబ్ను డీసీ మేనేజ్మెంట్ 50 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. త్వరలో నైబ్ జట్టుతో చేరతాడని డీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నైబ్కు ఇది తొలి ఐపీఎల్.ఆఫ్ఘనిస్తాన్ తరఫున 82 వన్డేలు, 62 టీ20లు ఆడిన నైబ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 99 వికెట్లు పడగొట్టి, 2038 పరుగులు చేశాడు. నైబ్ ఖాతాలో ఓ ఐదు వికెట్ల ఘనత, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల నైబ్ 2019లో ఆఫ్ఘన్ వన్డే జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో నైబ్ విశేషంగా రాణించాడు. ఈ సిరీస్లో బంతితో పర్వాలేదనిపించిన నైబ్.. బ్యాటింగ్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.మార్ష్ విషయానికొస్తే.. ఈ ఐపీఎల్ సీజన్లో మార్ష్ తొలి నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత అతను గాయపడటంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్లో మార్ష్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. డీసీ యాజమాన్యం మార్ష్ను ఈ ఏడాది వేలంలో 6.5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.ఢిల్లీ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు..ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. గత నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు మరో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఇందులో తప్పక గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఢిల్లీ ఏప్రిల్ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 26) కేకేఆర్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగనుంది. -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్లో అఫ్గన్పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది. -
ఏషియన్ గేమ్స్ 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
చైనాలోని హాంగ్ఝౌ వేదికగా ఈనెల 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడలు 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ ఆల్రౌండర్ గుల్బదిన్ నైబ్ నాయకత్వం వహించనున్నాడు. ఆఫ్ఘన్ సెలెక్టర్లు ఈ జట్టుకు ఆఫ్ఘన్అబ్దల్యన్ అని పేరు పెట్టారు. ఈ జట్టులో మొహమ్మద్ షెహజాద్, కరీమ్ జన్నత్, సెదీఖుల్లా అటల్, ఫరీద్ అహ్మద్ మలిక్, ఖైస్ అహ్మద్, అఫ్సర్ జజాయ్ లాంటి జాతీయ జట్టు ప్లేయర్లు ఉన్నారు. ఆసియా క్రీడల రూల్స్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అక్టోబర్ 3 లేదా 4వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్లో నేరుగా ఆడుతుంది. క్వార్టర్స్ అనంతరం అక్టోబర్ 6న సెమీఫైనల్, 7న ఫైనల్ జరుగుతుంది. ఈ క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్తో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించాయి. కాగా, ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పురుషుల క్రికెట్తో పాటు మహిళల క్రికెట్కు చోటు దక్కింది. తొలిసారి జరుగుతున్న పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా భారత్ రెండు విభాగాల్లో పోటీపడుతుంది. ఈ క్రీడల కోసం బీసీసీఐ పటిష్టమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా.. అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్ 1) ఆడుతుంది. టీమిండియా క్వార్టర్స్లో గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సెమీస్లో గెలిస్తే అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో స్వర్ణం కోసం పోటీపడుతుంది. భారత్ ఆడే క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు.. గుల్బదిన్ నైబ్, మొహమ్మద్ షెహజాద్, సెదీఖుల్లా అటల్, జుబ్దైద్ అక్బరీ, నూర్ అలీ జద్రాన్, షహీదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, వఫీవుల్లా తరాఖిల్, కరీం జన్నత్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్, నిజత్ మసౌద్,సయ్యద్ అహ్మద్ షిర్జాద్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్ ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు.. రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ -
T20 World Cup 2022: శ్రీలంకతో మ్యాచ్.. ఆఫ్గాన్కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ ముందు ఆఫ్గానిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ జట్టు విధ్వంసకర ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ పొత్తికడుపు కండరాల గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు స్థానంలో రిజార్వ్ జాబితాలో ఉన్న గుల్బాదిన్ నైబ్ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎంపిక చేసింది. నైబ్ ఎంపికను టీ20 ప్రపంచకప్ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమెదించింది. కాగా ఈ టోర్నీలో ఆటగాడి స్తానాన్ని భర్తీ చేసే ముందు ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తప్పనిసరి. కాగా సూపర్-12లో భాగంగా మంగళవారం గబ్బా వేదికగా శ్రీలంకతో ఆఫ్గాన్ తలపడనుంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్లో ఆఫ్గాన్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆఫ్గాన్ పోరాడి ఓడింది. అనంతరం వరుసగా న్యూజిలాండ్, ఐర్లాండ్తో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. గ్రూప్-2 నుంచి పాయింట్ల పట్టికలో ఆఫ్గానిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. ఇక నైబ్ విషయానికి వస్తే.. అతడు బ్యాట్, బాల్తో రాణించగలడు. నైబ్ చివరి సారిగా 2021లో న్యూజిలాండ్పై టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: T20 World Cup 2022: చెలరేగిన ఫించ్.. ఐర్లాండ్పై ఆసీస్ ఘన విజయం -
‘మీ బాగోతం బయటపెడతా.. స్టే ట్యూన్డ్’
కాబూల్: అఫ్గానిస్తాన్ క్రికెట్లో ఇప్పుడు పెద్ద దుమారమే రేపాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ గుల్బదీన్ నైబ్. అఫ్గాన్ క్రికెట్ బోర్డులో ఎంతటి రాజకీయాలు నడుస్తున్నాయో, అంతే స్థాయిలో అవినీతి కూడా జరుగుతుందంటూ నైబ్ ఒక్కసారిగా కలకలం సృష్టించాడు. దీనిలో భాగంగా వరుస ట్వీట్లు చేస్తూ బోర్డులోని పెద్దల్ని కలవరపాటుకు గురి చేశాడు. ‘ డియర్ అఫ్గాన్ ఫ్యాన్స్. నేను నేను బయటకు రావడానికి కారణం ఏ ఒక్కరి మీదో వ్యక్తిగత కక్ష కాదు. అదే సమయంలో క్రికెట్ బోర్డుపై కూడా నాకు ద్వేషం లేదు. అఫ్గాన్ బోర్డులోని పెద్దలు అవినీతిలో కూరుకుపోయారు. యాక్షన్ తీసుకుంటానంటే చెప్పండి.. వారి పేర్లు బయటపెడతా. పలువురు క్రికెటర్లు, బోర్డులోని ప్రముఖులు అవినీతికి పెద్ద పీట వేస్తున్నారు’ అంటూ అలజడి రేపాడు. ఇలా వరుస పెట్టి ట్వీట్లు చేస్తూ కొత్త వివాదానికి తెరలేపాడు. ‘ఇప్పటివరకూ నేషనల్ లీగల్ ఏజెన్సీ అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏమైనా యాక్షన్ తీసుకుంది. ఒకవేళ దానిపై సదరు అథారిటీ ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతే నేను వారి పేర్లు బయటకు పెడతా. అప్పుడు చాలా సిగ్గుగా ఉంటుంది. గవర్నమెంట్ అధికారులు దగ్గర్నుంచీ బోర్డు సభ్యులు, ఆటగాళ్లు, మాజీ బోర్డు మెంబర్లు, మేనేజ్మెంట్ సభ్యుల పేర్లు వారి కరప్షన్ను బయటపెడతా. నన్ను ప్రేమించే అభిమానులు స్టే ట్యూన్డ్’ అని నైబ్ ఒక ట్వీట్లో పేర్కొన్నాడు. 2019 వరల్డ్కప్కు నైబ్ అఫ్గాన్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లలో ఒకడైన నైబ్ను వరల్డ్కప్కు అఫ్గాన్ జట్టు వెళ్లే చివరి నిమిషంలో కెప్టెన్గా నియమించారు. అస్గార్ అఫ్గాన్ను తప్పించి నైబ్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే ఆ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పోయింది. దాంతో ఆ తర్వాత రషీద్ ఖాన్ను అన్ని ఫార్మాట్లకు అఫ్గాన్ సారథిగా ఎంపిక చేసింది. అయినప్పటికీ అఫ్గాన్ తలరాత మారకపోవడంతో తిరిగి అస్గార్ అఫ్గాన్ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా నియమిస్తూ అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) నిర్ణయం తీసుకుంది. My dear Afghans, the main reason why i went public is not because i have personal grudge against player or the board. I am going to reveal every persons identity involved in corruption and other misconducts and betrayals against our Nation cricket and its ppl. — Gulbadin Naib (@GbNaib) December 11, 2019 I know most of you may ask why have i not spoken publicly against these ppl/mafia circle before. I have been sidelined and promised, by the authorities and other stakeholders that they will sort the mess in the cricket team and promised immediate changes & banning of this circle — Gulbadin Naib (@GbNaib) December 11, 2019 Has anything been done about such betrayal? For public interest, if D authorities don’t take appropriate actions, i will publicly name & shame every single one from gov officials to board members, players and ex board and management members. Stay tuned... long life my beloved 🇦🇫 — Gulbadin Naib (@GbNaib) December 11, 2019
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement