breaking news
Group -4 Tests
-
గ్రూప్ 4 పరీక్ష: వాళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరీక్షలను నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఈ క్రమంలో జూలై 8 రెండో శనివారం రోజును వర్కింగ్ డే ప్రకటించింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి జులై 1న పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష మొత్తం 9 లక్షల 50 వేలమంది రాయనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. చదవండి: గ్రూప్-4 పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే.. -
గ్రూప్–4 పరీక్షకు విస్తృత ఏర్పాట్లు
సుభాష్నగర్: టీఎస్పీఎస్సీ ద్వారా జూలై 1న జరగనున్న గ్రూప్–4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రూప్–4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శా ఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వ హించారు. పరీక్ష ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై అదనపు కలెక్టర్ వివరించారు. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో 39,183 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరి కోసం 125 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే అత్యధిక మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం 15 నిమిషాలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. సమయం దాటితే లోనికి అనుమతి ఉండదని స్పష్టంచేశారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్టాండ్లలో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైజనింగ్ ఆఫీసర్, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్రావు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, డీఐఈవో రఘురాజ్, డీఈవో దుర్గాప్రసాద్, డీటీసీ వెంకటరమణ, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గ్రూప్–4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జులై 1న గ్రూప్–4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు ప్రక్రియపై పోలీసు శాఖ అధికారుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అదనపుకలెక్టర్ మధుసూదన్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 94 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 27,803 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సి విభాగం పర్యవేక్షకులు సంతోష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
నిఘా నీడలో గ్రూప్-4
రాష్ట్రంలో ఆదివారం నిఘా నీడలో గ్రూప్ -4 పరీక్షలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు కారణం ఐదు వేల పోస్టులకు పన్నెండు లక్షల మంది హాజరు కావడమే. ఇక, గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం ఈనెల తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ కానున్నట్టు టీఎన్పీఎస్సీ చైర్మన్ కే అరుల్మొళి ప్రకటించారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి పోటీ పరీక్షల నిర్వహణలో టీఎన్పీఎస్సీ పరుగులు తీస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువే కావడంతో ఈ పరీక్షలకు పోటీ పడి హాజరయ్యే పట్టభద్రుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నది. ఆ దిశగా తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎన్పీఎస్సీ)నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు ఇటీవల కాలంగా వందల్లో ఉన్న పోస్టులకు సైతం లక్షల్లో దరఖాస్తులు చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకునే నిరుద్యోగులు ఎక్కువే. ఆఫీసు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, ప్లానింగ్, సర్వేయర్లు, షార్ట్ హ్యాండ్ టైపిస్టులు తదితర 5,451 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఇటీవల టీఎన్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈ పోస్టులకు లక్షల్లో అభ్యర్థులు కదిలారు. నిఘా నీడలో పరీక్ష: పదిహేనులక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో ఎలాంటి లీక్లకు, కాపీయింగ్కు ఆస్కారం లేని విధంగా నిఘానీడలో పరీక్షలకు టీఎన్పీఎస్సీ చర్యలు తీసుకుంది. చైర్మన్ అరుల్మొళి పర్యవేక్షణలో రాష్ట్రంలో 5,296 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం పది గంటలకు పరీక్ష కావడంతో ఎనిమిదిన్నర గంటల కంతా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.తొమ్మిదిన్నర గంటలకు అభ్యర్థులను లోనికి అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీల అనంతరం కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య లోనికి పంపించారు. ఆయా కేంద్రాల్లో పరీక్షలు రాయడానికి చంటి బిడ్డల తల్లులు తరలి రావడంతో, వారికి సాయంగా వచ్చిన వాళ్లు చెట్ల కింద, ఆ పరిసరాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్షలు జరిగాయి. విల్లుపురంలోని ఓ కేంద్రంలో నవవధువు అఖిలాండేశ్వరి పరీక్షకు హాజరైంది. తాళికట్టిన చేతులతో తన భార్యను వరుడు ప్రదీప్ తమిళరసన్ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు. పరీక్ష ఒంటి గంటకు ముగియడంతో నవ దంపతులు మళ్లీ కల్యాణ మండపానికి చేరుకుని బంధుమిత్రులతో ఫొటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు. పదిహేను లక్షల మందికి పైగా దరఖాస్తు సుకున్నా, పరీక్షకు పన్నెండు లక్షల మంది హాజరు అయ్యారు. లీక్లకు , కాపియింగ్కు ఆస్కారం ఇవ్వని విధంగా ఐదు వందల ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడు వేల సిట్టింగ్ స్క్వాడ్ల నిఘాతో పరీక్షలు సాగాయి. తొమ్మిదిన గ్రూప్-1 నోటిఫికేషన్ : చెన్నైలో అన్నానగర్, అశోక్నగర్, ఐనావరం, ఎగ్మూర్, కీల్పాకం, కొలత్తూరు, ప్లికేన్, నుంగంబాక్కం, పెరంబూరు, పురసైవాక్కం, జార్జ్ టౌన్ , రాయపురం, తిరువొత్తియూరు, తండయార్ పేట, వాషర్మెన్ పేట, మైలాపుర్, అడయార్, టీ నగర్, వేళచ్చేరి తదితర ప్రాంతాల్లో 356 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. లక్షా పన్నెండు వేల మంది అభ్యర్థులు చెన్నైలో పరీక్షలకు హాజరు అయ్యారు. ట్రిప్లికేన్లోని పరీక్ష కేంద్రాన్ని టీఎన్పీఎస్సీ చైర్మన్ అరుల్మొళి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆరు నెలల్లోపు ఫలితాలను ప్రకటిస్తామన్నారు. పరీక్షల్లో సాధించిన అర్హతల మేరకు ఇంటర్వ్యూలు ఉంటాయని వ్యాఖ్యానించారు. పోటీ పరీక్షలకు తగ్గ సలహాలు, సూచనలు, తదితర వివరాలను సోమవారం నుంచి తమ వెబ్సైట్లో అందించనున్నామని వివరించారు. డిప్యూటీ కమిషనర్, డీఎస్పీ తదితర గ్రూప్-1 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. ఖాళీగా ఉన్న 85 పోస్టుల భర్తీకి ఈనెల తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేయనున్నామని ప్రకటించారు. లీక్ ప్రచారం : విరుదాచలంలో పేపర్ లీక్ ప్రచారం ఊపందుకోవడంతో కలవరం బయలు దేరింది. అయితే, అది ప్రచారంగానే నిర్ధారించారు. విరుదాచలం సమీపంలోని కండియకుప్పంకు చెందిన ఓ యువకుడు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో బాల మురుగన్ అనే ఓ వ్యక్తి ఫోన్ చేసి, పేపర్ లీక్ అయిందని, రూ. ఆరు లక్షలు ఇస్తే, ఆ పేపర్ ఇస్తానంటూ పేర్కొని ఉన్నాడు. దీంతో సమాచారాన్ని ఆ యువకుడు పోలీసులకు అందించారు. అయితే, విచారణలో ఎవరో ఆ యువకుడ్ని మోసం చేయడానికి ప్రయత్నించినట్టు తేలింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు ఫోన్ చేసిన ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.