breaking news
Groundwater increment
-
పాతాళ గంగ మరింత పైకి..
సాక్షి,ఆదిలాబాద్: పాతాళ గంగ మరింత పైకి వచ్చింది. జిల్లాలో ఈ యేడాది కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నీళ్లు అధికంగా పైకి రావడం గమనార్హం. జిల్లాలో జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో పాతాళ గంగ ఉబికి పైకొస్తోంది. జిల్లాలో సగటున 1.94 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. బజార్హత్నూర్, జైనథ్, నేరడిగొండ, తాంసి, నార్నూర్లలో మీటర్ కంటే తక్కువ లోతులోనే జలాలు లభ్యమవుతున్నాయి. జిల్లా అంతటా.. జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. అయితే ఈ జలాలు ప్రస్తుతం స్థిమితంగా ఉండవని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే కొంత దిగువకు చేరుకుంటాయని భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వర్షాకాలం ముగిసే సమయంలో అక్టోబర్లో భూగర్భ జలాలపై ఒక అంచనాకు రావచ్చని పేర్కొంటున్నారు. అయితే గతేడాది కంటే ఈయేడాది కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు భూస్థాయి నుంచి చాలా తక్కువ లోతులోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రతినెల చివరిలో జిల్లా భూగర్భ జలాల శాఖ జిల్లాలోని భూగర్భ జలాలను కొలవడం జరుగుతోంది. జిల్లాలోని 15 మండలాల్లో ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిని కొలుస్తారు. భూస్థాయి నుంచి ఎంత లోతులో ఈ నీళ్లు ఉన్నాయనే దానిపై నివేదిక తయారు చేసి నెల చివరిలో ప్రకటించడం జరుగుతుంది. జిల్లాలో ప్రధానంగా వివిధ రకాల నేలలు ఉన్నాయి. గ్రానైట్స్, బాసల్ట్సŠ, లైమ్స్టోన్, శాలెస్, ట్రాప్స్ రకాల నేలలు ఉన్నాయి. మొదట మొరంతో ఉండి ఆ తర్వాత లోపల బండరాయి కలిగి తిరిగి మట్టి వంటి నేలలు అధికంగా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాల అంచనా వేసిన దానికంటే తర్వాత రోజుల్లో గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రధానంగా నేరడిగొండ, గుడిహత్నూర్ వంటి మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఆదిలాబాద్ చుట్టుపక్కల సున్నపురాయి అధికంగా ఉంది. కొన్ని మండలాల్లో గణనీయం.. జిల్లాలో జూన్ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు మురిపించాయి. ఆ తర్వాత సుమారు 15 రోజుల పాటు ముఖం చాటేశాయి. ఆ నెల చివరి వారంలో మళ్లీ కొంత వర్షం కురువడం ఊరటనిచ్చింది. జూన్లో సాధారణ వర్షపాతం 204 మిల్లీమీటర్లు ఉండగా, 246 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది సాధారణం కంటే అధికంగానే నమోదైనప్పటికీ ఆ నెలలో డ్రైస్పెల్ అధికంగా నమోదైంది. అయితే జూలైలో మాత్రం ఏకధాటిగా వర్షాలు కురువడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రధానంగా జిల్లాలోని జలాశయాలతో పాటు చెరువులన్ని నిండిపోయాయి. ఎటుచూసినా జలకళ సంతరించుకుంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 300 మిల్లీమీటర్లు కాగా, 375 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆగస్టులో 333 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా, 598 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. 18 మండలాల్లో 15 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మిగతా 3 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. భూగర్భజలాలు స్థిమితంగా ఉండవు వర్షపాతం తగ్గినకొద్ది భూగర్భ జలాల పరిస్థితిలో మార్పు వస్తుంది. జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలకు సగటున 1.94 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. అక్టోబర్ వరకు వర్షాలు కురిసిన తర్వాత జిల్లా భూగర్భ జలాలపై ఒక అంచనాకు రావచ్చు. జిల్లాలో వివిధ రకాల నేలలు ఉన్నాయి. పైన మట్టి మధ్యలో సున్నపురాయి, ఇతర ఖనిజాలు ఉండి తిరిగి మట్టి నేలలు కలిగి ఉన్నాయి. దీంతో జలాలు దిగువకు పోయేది అంచనా వేసిన తర్వాత కూడా కొంత మార్పు వస్తుంది. – పుల్లయ్య, భూగర్భ జలాల శాఖ జిల్లా అధికారి -
‘ఇంకుడు’ దోపిడీ
ఇంకుడు గుంతలనూ వదలని తెలుగు తమ్ముళ్లు 90 శాతం గుంతలు టీడీపీ కార్యకర్తలకే రూ.18 కోట్లు అధికారపార్టీ నేతల జేబుల్లోకి? చిత్తూరు: జిల్లాలో భూగర్భజలాల పెంపు కోసం కేంద్రప్రభుత్వం చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమం టీడీపీ నేతల జేబులు నింపుతోంది. లబ్ధిదారుడికి గుంత తవ్వుకునే అవకాశం మాత్రమే ఇచ్చి.. గుంతకు కావాల్సిన సామాగ్రి మొత్తం టీడీపీ నాయకులే సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియతో గుంతలకు కేటాయిస్తున్న నిధుల్లో 90 శాతం అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలకే వెళ్తోంది. నీరుగారుతున్న లక్ష్యం.. కరువు పరిస్థితుల్లో కూడా ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడకుండా ఉండటమే ఇంకుడుగుంతల ఏర్పాటు ముఖ్య లక్ష్యం. అయితే జిల్లాలో అధికారపార్టీ నాయకుల ఆధిపత్యంతో ఈ పథకం ఉద్దేశ్యం పూర్తిగా నీరుగారుతోంది. టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ శాతం ఇంకుడు గుంతలను కేటాయించడంతో నిర్దేశిం చిన లక్ష్యం కూడా చేరలేదు. ఈ ఇంకుడుగుంత లు నింపడంలో కూడా పచ్చ కార్యకర్తలు కనీస ప్రమాణాలను పాటించడం లేదు. నిబంధనలు తుంగలో.. ప్రభుత్వం ఒక్క ఇంకుడు గుంత తవ్వుకుంటే లబ్ధిదారుడికి రూ.1670 చెల్లిస్తుంది. గుంత తవ్వుకున్నందుకు రూ.314, కంకర, ఇసుక, సిమెంట్రింగుల కోసం రూ.1,356లు చెల్లిస్తుంది. వీటిని లబ్ధిదారుడే తనకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు. అలా కానిపక్షంలో స్థానిక సర్పంచ్ను లబ్ధిదారుడు కోరితే ఆయన సరఫరా చేయవచ్చు. లేకపోతే భూగర్భ గనుల శాఖను కోరినా ఇసుక, కంకరను సరఫరా చేస్తారు. ఈ నిబంధనలు టీడీపీ నాయకులు తుంగలో తొక్కుతున్నారు. లబ్ధిదారులకు ఇష్టం లేకపోయినా తమ దగ్గరే ఇసుక, కంకర కొనుగోలు చేయాల్సిందేనని నిబంధనలు పెడుతున్నారు. కొనుగోలు చేయకుంటే ఇంకుడు గుంత మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారు. దోచుకుంటున్నారు ఇసుక, కంకర, స్టీల్ కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.1,356 తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకే వెళుతున్నాయి. స్థానికంగా ఉండే టీడీపీ నే తలే వీటిని సరఫరా చేస్తున్నారు. కంకరను 20 ఎంఎం, 40 ఎంఎం అనే రెండు రకాలు వాడాలి. అయితే వీటిబదులు ఇటుక ముక్కలు, రాళ్లు సరఫరా చేస్తున్నారు. నాసిరకం సిమెంట్ రింగులను లబ్ధిదారులకు అంటగడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.36 లక్షల ఇంకుడు గుంతలను తవ్వారు. దాదాపు వీటన్నింటికీ టీడీపీ నాయకులే మెటీరియల్ సరఫరా చేశారు. ఇంకా అందని బిల్లులు.. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న లబ్ధిదారుల కు ఇప్పటివరకు బిల్లులు అందలేదు. జిల్లా వ్యా ప్తంగా తవ్విన 1.36 లక్షల ఇంకుడు గుంతలకు సుమారు రూ.22.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిలో లబ్ధిదారులకు సుమారు రూ.4.27 కోట్లు చేరుతుంది. మిగతా రూ.18.45 కోట్లు పచ్చ బాబుల జేబుల్లోకి చేరనుంది.