-
ఆరోగ్యం వెం‘బడి’...
సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల ద్వారా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం నాంచార్పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పండిస్తున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరలతో 45 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 12 మందితో కమిటీ కూరగాయల సాగుకోసం ప్రత్యేకంగా 12 మంది విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులు ప్రతి రోజు ఉదయం 20 నిమిషాలు పాఠశాల సమయానికంటే ముందుగా రావడం, తరగతులు ముగిసిన తర్వాత మరో 15 నిమిషాల పాటు కిచెన్ గార్డెన్లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పెట్టడం.. వాటిని పరిరక్షించడం చేస్తుంటారు. దీంతో విద్యార్థులకు పంటలు ఎలా పండిస్తారనే అవగాహనతో పాటు పని పట్ల గౌరవం కలుగుతోందని ఉపాధ్యాయులు చెబతున్నారు. ఇతరులు తీసుకోకుండా.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్కు గ్రామ పంచాయతీ సహకారం కూడా అందుతోంది. కిచెన్ గార్డెన్కు సేంద్రియ ఎరువులను పంచాయతీ ఉచితంగా అందజేస్తోంది. పాఠశాలలో పండిన కూరగాయలను గ్రామస్తులు ఎవరూ కోసుకుపోవద్దని చాటింపు సైతం చేశారు. కూరగాయలు తెంచినట్లు తెలిస్తే వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. సాగు చేస్తున్న కూరగాయలు సొరకాయ, బీర, వంకాయ, కాకర, టమాటా, దోసకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండకాయ, పాలకూర, తోటకూర, సుక్క కూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఉల్లిఆకు, పచ్చిమిర్చి. నాంచార్పల్లి ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాల 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1– 7వ తరగతి వరకు 166 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ఆవరణలో 5 గుంటల స్థలంలో గత అక్టోబర్ నెలలో పలు రకాల కూరగాయల విత్తనాలు నాటారు. నవంబర్ 30 నుంచి కాత మొదలైంది. అప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పండించిన కాయగూరలనే మధ్యాహ్న భోజనంలో ఆహారంగా అందిస్తున్నారు. తాజా కాయగూరలతో రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. ఎలాంటి పురుగు మందులను వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే సాగు చేస్తుండటంతో విద్యార్థులకు మంచి పౌష్టికాçహారం అందుతోంది. సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేశాం. 45 రోజుల నుంచి బడిలో పండించిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పంచాయతీ, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. – పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు ఎంతో రుచికరం మా స్కూల్లో పండించిన కూరగాయలతో మధ్యాహ్న భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా ఉండడం, పురుగు మందుల వినియోగం లేకపోవడంతో వంటలు ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. ప్రతీ రోజు పాఠశాల సమయం కంటే ముందు వచ్చి కొద్ది సేపు వాటి రక్షణకు కేటాయిస్తాం. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరం నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. –పూజ, 7వ తరగతి -
బతుకులు బుగ్గి
♦ ‘క్వారీ కోరల్లో పచ్చని పొలాలు ♦ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు ♦ పేలుళ్లకు బీటలువారుతున్న ఇళ్లు ♦ అనారోగ్యాల పాలవుతున్న జనం ఒకప్పుడు పచ్చని పొలాలు...చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గ్రామాలు ఉండేవి. ఊట, కొండగెడ్డల నీటితో పంటలతో కళకళలాడే ఆ గ్రామాల్లో కొంతకాలంగా అలజడి మొదలైంది. క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు ఏ రాయి నెత్తిన పడుతుందోనన్న భయం...ఊటనీరురాక ఏటా ఎండిపోతున్న పొలాలు...చివరికి గ్రామాలనే ఖాళీచేసి వెళ్లిపోదామనే దుస్థితి. చోడవరం : వ్యవసాయమే ఆధారంగా ఉండే గ్రామాల్లో ఇప్పుడు మైనింగ్ మాఫియా కోరలు చాస్తోంది. కొండలు, గుట్టలు పేల్చి సొమ్ముచేసుకుంటున్న కొందరు పచ్చని పొలాలను బుగ్గిపాలు చేస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నాయకుల అండదండలతో కొండలను ఆక్రమిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి,చెరకు, అపరాలు పండించే మాడుగుల, చోడవరం, అనకాపల్లి, రావికమతం, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, నర్సీపట్నం, మాకవరంపాలెం ప్రాంతాలు ఇప్పుడు క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. మాడుగుల మండలం ఎం.కృష్ణాపురం,ఎరుకువాడ, చింతలూరు, విజెపురం, కె.కోటపాడు మండలం దాలివలస, పిండ్రంగి, రావికమతం మండలంలో మరుపాక, కొట్నాబిల్లి, అనకాపల్లి మండలంలో మార్టూరు, బవులవాడ, దర్జీనగర్, శంకరం, మామిడిపాలెం గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. క్వారీల వల్ల గ్రామాల్లో ప్రజలు వ్యవసాయం కోల్పోయి, ఊరులోకి ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని బండరాళ్ల మధ్య, దుమ్ముదూళి మింగేస్తూ అనుక్షణం ఆందోళనతో జీవిస్తున్నారు. ఒకప్పుడు ఈ గ్రామాలు నిత్యం పంటలతో కళకళలాడుతూ ఉండేవి. క్వారీలు పెరిగిపోవడంతో కొండ ఊటగెడ్డలన్నీ మూసుకుపోయాయి. ఇలా నీటి సౌకర్యం లేక ఈ ప్రాంతాల్లో 20శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మాడుగుల మండలం కృష్ణాపురం కొండ నుంచి ఊటగెడ్డల్లో నిత్యం నీరు పారేది. పంటలు బాగా పండేవి. అటువంటి ఈ గ్రామం ఇప్పుడు పంటలు నాశనమై, క్షణక్షణం భయం గుప్పెట్లో బతకాల్సిన దుస్థితి. ఈ గ్రామం సమీప కొండలో నల్లరాయి ఉండటంతో ఒకే అనుమతితో ఇక్కడ పదుల సంఖ్యలో క్వారీలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో రాజులకాలం నుంచి ఉన్న తాగునీటి కోనేరును సైతం క్వారీ యజమానులు కప్పేశారు. కొండ నుంచి పంట కాలువలకు వచ్చే నాలుగు ఊటగెడ్డలనూ కప్పేయడంతో సుమారు 200ఎకరాలకు సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. వీరవిల్లి అగ్రహారం శివారు ఎరుకువాడపై గ్రానైట్ క్వారీ ఉంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేస్తున్నారు. ఆ సమయంలో పెద్దపెద్ద రాళ్లు పచ్చని పొలాల్లోకి పడి పంటలు నాశమైపోతున్నాయి. కె.కోటపాడులో క్వార్జ్ రాయి క్వారీలు, మరుపాక, కొట్నాబిల్లి గ్రామాల్లో నల్లరాయి మెటర్ క్వారీల్లో అక్రమ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి. గంధవరం సమీపంలో కొండపై అక్రమ బ్లాస్టింగ్లు చేస్తున్నారు. ఇక చోడవరం-అనకాపల్లి రోడ్డులో అయితే చెప్పనక్కరలేదు. ఈ రోడ్డులో గంథవరం నుంచి తుమ్మపాల వెళ్లేవరకు దారిపొడవునా ధన్..ధన్ అంటూ కొండలు నిత్యం పేలుతూనే ఉంటాయి. నిత్యం రాయి క్రషింగ్తో బుగ్గి ఆయా గ్రామాలను, పంటలను ఆవరిస్తోంది. వాతావరణం పూర్తిగా కలుషితమై పంటలు నాశనమవుతున్నాయి. వరి,చెరకు, కంది, ఆపరాల పంటలతోపాటు మామిడి, జీడి తోటలు ఈ బూడిదపడి ఎర్రగా మారిపోయి దిగుబడి తగ్గిపోతోంది. క్రషర్బుగ్గితో చిన్నారులు, వృద్ధులు తరుచూ ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా కిడ్నీల వ్యాధులకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ఐదేళ్లలో సుమారు 100 మంది వరకు కిడ్నీల వ్యాధికి గురయ్యారంటే కమ్ముకున్న ఈ కాలుష్యం ప్రజాఆరోగ్యాన్ని ఎలా క బళిస్తోందో అర్ధమవుతుంది. పేలుళ్ల శబ్ధాలకు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. ఎం. కృష్ణాపురం, మార్టూరు, బవులవాడ గ్రామ ప్రజలైతే ఒక దశలో గ్రామాలనే వదిలిపోవాలా... అంటూ ఆందోళనలు సైతం చేపట్టిన సంఘటనలు ఉన్నాయి.అక్రమ బ్లాస్టింగ్లకు ఐదేళ్లల్లో 18మంది వరకు మృతిచెందారు. అనేక మంది శరీర అవయవాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ బ్లాస్టిం గ్లు నిరువరించడంతోపాటు క్రషర్ల నుంచి దు మ్ము బయటికి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఉన్న క్వారీల లీజను రద్దుచేయడంతోపాటు కొత్తక్వారీలకు అనుమతి ఇవ్వకుండా చూడాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement