breaking news
Greater budget
-
అంకెల స్వర్గం..‘మహా’ దూరం
అమలుకు నోచని గ్రేటర్ బడ్జెట్ ఈ ఏడాది కేటాయింపు రూ.5,550 కోట్లు రూ.2000 కోట్ల పనులు కూడా కాని వైనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినది రూ.629 కోట్లు ఇప్పటి వరకు వచ్చింది రూ.24 కోట్లు ఇదీ జీహెచ్ఎంసీ తీరు సిటీబ్యూరో: ఆ అంకెలు ... అభివృద్ధిని మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. మనల్ని ‘కొత్త’లోకంలోకి తీసుకుపోతాయి. కళ్లు తెరచి చూస్తే మన పరిస్థితి ‘ఎక్కడి గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉంటుంది. ఇదీ జీహెచ్ఎంసీ బడ్జెట్ మాయ. ఏటా ఈ లెక్కలు ‘భారీ’గా పెరుగుతున్నా... పనులు ఆ స్థాయిలో కనిపించడం లేదు. ‘మబ్బుల్లో నీళ్లు చూసి...ముంత ఒలకబోసుకున్నట్టు’గా... భారీ ఎత్తున నిధులు అందుతాయనే అంచనాలతో అంతే స్థాయిలో బడ్జెట్కు ఆమోదం తెలపడం.. అవి రాకపోవడం ఒక కారణమైతే... పనులు చేసేందుకు తగిన యంత్రాంగం లేకపోవడం మరో కారణం. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. రూ.5,550 కోట్లతో బడ్జెట్ను ఆమోదించినప్పటికీ... ఇప్పటి వరకు రూ.2000 కోట్ల పనులైనా చేయలేకపోయారు. దీన్ని పక్కన పెట్టేసి... వచ్చే ఏడాదికి ప్రస్తుత బడ్జెట్ కంటే మరో రూ.100 కోట్లు పెంచి ప్రభుత్వ ఆమోదానికి నివేదించినట్లు తెలుస్తోంది. కాగితాల్లోనే .. మున్నెన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) రూ.5,550 కోట్లతో బడ్జెట్ను ఆమోదించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్లు... పద్దుల కింద రావాల్సిన నిధులు దాదాపు రూ.629 కోట్లు. ఇప్పటి వరకు అందింది దాదాపు రూ.24 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి అంచనాకు... వాస్తవానికి మధ్య దూరాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం మూడు నెలలు మాత్రమే గడువుంది. ఒకవేళ మరిన్ని నిధులు అందినా... ఈ కాస్త సమయంలో ఏం చేయగలరనేది వేల కోట్ల ప్రశ్న. జీహెచ్ఎంసీ స్వయంగా సమకూర్చుకునే నిధుల నుంచి చేపట్టాల్సిన పనుల్లోనూ చాలా వరకు ప్రారంభించ లేదు. తగినంత యంత్రాంగం లేకపోవడం ఓ కారణమైతే... భారీ ఎత్తున చేపట్టాలనుకున్న ఇంజినీరింగ్ పనుల టెండర్లు పూర్తి కాకపోవడం వంటివి మరో కారణం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు.. ఇప్పటి వరకు అందినవి ఇలా ఉన్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ పాలక మండలి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాదాపు మరో రెండు నెలల పాటు కొత్త పనులు చేపట్టే అవకాశం లేదు. వచ్చే ఏడు మరింత పెద్ద బడ్జెట్.. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా... వచ్చే (2016-17) ఆర్థిక సంవత్సరానికి సైతం భారీ బడ్జెట్నే రూపొందించినట్లు తెలిసింది. దాదాపు రూ. 5,700 కోట్లతో రాబోయే బడ్జెట్ను ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ఏడాది రాకున్నా... ఈ ఆర్థిక సంవత్సరం నిధులే పూర్తిగా రాలేదు. అయినప్పటికీ రివైజ్డ్ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మరింత ఎక్కువగా పొందుపరిచారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం నుంచి వచ్చేది రూ.629 కోట్లుగా పేర్కొనగా... రివైజ్ చేసి దాన్ని రూ.1,420 కోట్లకు పెంచారు. అంటే మరో రూ.800 కోట్లు అదనంగా చేర్చారు. ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.400 కోట్లు చేర్చారు. -
గ్రేటర్ బడ్జెట్ రూ.4599 కోట్లు
కార్పొరేటర్ల ఫండ్ పెంపు కోర్ ఏరియా వారికి రూ. 1.50 కోట్లు.. శివార్లలోనివారికి రూ.2 కోట్లు కొత్త పథకాల్లో పేదలకు రూ. 5కే భోజనం సాక్షి, సిటీబ్యూరో: గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్కు జీహెచ్ఎంసీ ఆమోద ముద్ర వేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 4599 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మెజార్టీ అభిప్రాయానికనుగుణంగా బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు మేయర్ మహ్మద్ మాజిద్హుస్సేన్ ప్రకటించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. సోమవారం బడ్జెట్పై జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష టీ డీపీ, బీజేపీలు సవరణలు కోరగా.. అధికార కూటమిలోని ఎంఐఎం, కాంగ్రెస్లు భేషైన బడ్జెట్గా అభివర్ణించాయి. ఇటీవల స్టాండింగ్ కమిటీ చేసిన సూచనల కనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించారు. ప్రజలపై కొత్తగా ఎలాంటి పన్నుల భారం మోపకుండానే కొత్త పథకాలు.. పేదలకుపకరించే స్కీములకు ప్రాధాన్యమిచ్చినట్లు మేయర్ చెప్పారు. యూజర్ చార్జీలు/టాక్సులు లేకుండానే వరుసగా మూడో ఏడాదీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ముదావహంగా ఉందన్నారు. కాగా, ప్రస్తుత పాలకమండలికి ఇది చివరి బడ్జెట్. సమావేశంలో కమిషనర్ సోమేశ్కుమార్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. కార్పొరేటర్లకు కానుక.. డివిజన్లలో పనుల నిర్వహణకు కార్పొరేటర్ల బడ్జెట్ను ప్రస్తుతమున్న రూ.కోటిని పెంచారు. కోర్ ఏరియాలోని కార్పొరేటర్లకు రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల్లోని కార్పొరేటర్లకు రూ. 2 కోట్లు వంతున కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ కోటిన్నరే ఇవ్వాలని భావిం చినా.. శివారు కార్పొరేటర్ల డిమాండ్తో వారికి రూ. 2 కోట్లు కేటాయించారు. వీటిని రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించా రు. ఎన్నికల తరుణంలో, . జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియనున్నందున ఒకే దఫా మంజూరు చేయాలని ఆయా పార్టీలు కోరాయి. సిటీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా గృహనిర్మాణం, పేద రిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన, క్లీన్ అండ్ గ్రీన్ అంశాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు. 2014-15 బడ్జెట్ ముఖ్యాంశాలు.. స్వీపింగ్ యంత్రాలు: రూ.36 కోట్లు నిరుద్యోగ యువ త, మహిళల స్వయం ఉపాధి శిక్షణ: రూ.18 కోట్లు పాఠశాలల పరిసరాల్లో సదుపాయాల అభివృద్ధి: రూ.11 కోట్లు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని క్రీడాకారులు 500 మందికి స్పోర్ట్స్ ఫెలోషిప్స్ పేదలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు 400 నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్లు రోజుకు 15 వేల మంది పేదలకు సబ్సిడీ ధరపై రూ.5కే భోజనం అందించేందుకు రూ. 11 కోట్లు 18 నైట్షెల్టర్ల ఏర్పాటుకు రూ.10 కోట్లు కొత్త ఇంటి నెంబర్ల కార్యక్రమానికి రూ. 10 కోట్లు. 24 నియోజకవర్గాల్లో పేద, మధ్య తరగతి వారి కోసం ఫంక్షన్ హాళ్లకు రూ. 36 కోట్లు. వెయ్యి ప్రాంతాల్లో పబ్లిక్ యూరినల్స్/టాయ్లెట్ల ఏర్పాటుకు రూ. రూ. 25 కోట్లు పార్కుల అభివృద్ధి, కొత్త పార్కుల ఏర్పాటుకు రూ. 45 కోట్లు చెరువులు, ఖాళీ స్థలాల పరిరక్షణకు రూ.55 కోట్లు మీరాలం చెరువు అభివృద్ధికి రూ. 25 కోట్లు ఒక్కో డివిజన్కు రూ. 6 కోట్లు చొప్పున శివార్లలో సమగ్ర రహదారుల అభివృద్ధి పనులకు రూ. 300 కోట్లు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేడియం/ స్విమ్మింగ్పూల్స్కు రూ. 50 కోట్లు సర్కిల్/వార్డు కార్యాలయ భవనాల నిర్మాణానికి, కంప్యూటరీకరణ పనులకు రూ. 57 కోట్లు నగరంలోకి ప్రవేశించే ఎనిమిది మార్గాల్లో ప్రత్యేకంగా గేట్వేల ఏర్పాటుకు రూ. 8.40 కోట్లు కేటాయింపు వారసత్వ టూరిజం కారిడార్ల అభివృద్ధికి, వారసత్వ పరిరక్షణకు రూ. 50 కోట్లు కొత్త ప్రాజెక్టులకు రూ. 50 కోట్లు సీసీ, బీటీ రోడ్లు, వరదనీటి కాలువలు, డ్రైనేజీ లైన్ల పనులకు రూ.149.65 కోట్లు కూకట్పల్లి ఆర్ఓబీ వద్ద సర్వీసు రోడ్డు నిర్మాణానికి రూ. 3.20 కోట్లు ఎక్స్ప్రెస్వేగా ఇన్నర్ రింగ్రోడ్డు అభివృద్ధి, ఇతరత్రా పనులకు రూ. 41 కోట్లు రైల్నిలయం, సంగీత్, ఈస్ట్మారేడ్పల్లి వద్ద డ్రెయిన్ పునరుద్ధరణకు రూ. 6.46 కోట్లు కందికల్గేట్ వద్ద సౌత్జోన్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 12.05 కోట్లు. అభివృద్ధికి అనుగుణంగా పన్నులు పెంచే పథకం (టిఫ్)పై అన్ని పార్టీల ఫ్లోర్లలీడర్లతో సమన్వయ సమావేశం నిర్వహించాక తగు నిర్ణయం తీసుకొంటామని మేయర్ ప్రకటించారు టిఫ్ మినహా స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అన్ని అంశాలను సర్వసభ్య సమావేశం ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. 2013-14 రివైజ్డ్ బడ్జెట్కు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ ప్రసంగంలో ‘తెలంగాణ’ బడ్జెట్ సందర్భంగా తెలంగాణ అంశాన్ని మేయర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉమ్మడి రాజధాని కానున్న హైదరాబాద్ నగరం రెండు రాష్ట్రాలకు తగిన సేవలందించాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు రాష్ట్రాల వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పెద్ద బాధ్యత జీహెచ్ఎంసీపై ఉందన్నారు. ఇందుకుగాను కేంద్రం తనవంతు నిధులివ్వాలన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా గ్రాంట్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గమేర్పడంతో సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్తీకరెడ్డి, దిడ్డి రాంబాబు తదితరులు జై తెలంగాణ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీ వాటా కూడా ఉందంటూ వజీర్ ప్రకాశ్గౌడ్ తదితరులు పోటీగా నినదించారు. కుర్చీదిగితే.. వాస్తవం తెలుస్తుంది మేయర్ సీటులో కూర్చుంటే అంతా బాగానే అనిపిస్తుంది. ఇక్కడ (కార్పొరేటర్) స్థానంలో ఉంటే కానీ వాస్తవం బోధపడదు. సర్కిల్స్థాయిలో అవసరాల కనుగుణంగా బడ్జెట్ ఉండాలి. వికలాంగులకు కేటాయింపుల్ని రూ.20 కోట్లకు పెంచాలి. - బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్ బడ్జెట్ బాగుంది పన్నుపోటు లేకుండానే భారీ బడ్జెట్ను రూపొందించడం బాగుంది. ఆస్తిపన్ను ద్వారా రూ. 1395 కోట్లు, టౌన్ప్లానింగ్ ద్వారా రూ. 84 కోట్లు ఖజానాకు చేరతాయి. రోడ్లు, వీధిదీపాలు, ఫుట్పాత్లకు రూ. 900 కోట్ల కేటాయింపు, ఫంక్షన్హాళ్ల ఏర్పాటు యోచన బాగున్నాయి. - రాజ్కుమార్, డిప్యూటీ మేయర్ అంకెలు కాదు.. అమలు చేయాలి బడ్జెట్ బ్రహ్మాండం.. నిధులున్నా కానీ, అధికారులు పనులు చేయట్లేదు. వారిపై చర్యలు తీసుకోవాలి. కార్పొరేటర్ల ఫండ్ను శివార్లకు రూ. 4 కోట్లు, కోర్ ప్రాంతానికి రూ.3 కోట్లకు పెంచాలి. రూ. 5 భోజన పథకాన్ని రోజూ 50 వేలమందికి అందజేయాలి. పథకం అమలుపై చిత్తశుద్ధి చూపాలి. - దిడ్డి రాంబాబు, కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ అంకెల గారడీ ఏటా బడ్జెట్లో 40 శాతం కూడా ఖర్చు చేయట్లేదు. దిగువస్థాయి ప్రజల అవసరాల కనుగుణంగా లేదీ బడ్జెట్. సోలార్ పవర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే జీహెచ్ఎంసీకి విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. అంకెల గారడీ బడ్జెట్ను సవరించాలి. - సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ పక్ష నాయకుడు కార్పొరేటర్ల ఫండ్ ఒకేసారివ్వాలి నగర చారిత్రక ఔన్నత్యాన్ని చాటేలా స్వాగతద్వారాల ఏర్పాటు యోచన బాగుంది. కోర్ ఏరియా కార్పొరేటర్లకిచ్చే రూ. 1.50 కోట్ల ఫండ్ను రెండు విడతలుగా కాకుండా ఒకేసారి ఇవ్వాలి. పాతబస్తీ అభివృద్ధికి వైఎస్సార్ ప్రకటించిన ప్యాకేజీని అమలు చేయాలి. - నజీరుద్దీన్, ఎంఐఎం ఫ్లోర్లీడర్ బీపీ పెరిగేలా ఉంది భారీ బడ్జెట్ చూస్తే తట్టుకోలేక ఒక్కసారిగా బీపీ పెరిగే అవకాశముంది. ఫైల్ కదలాలంటేనే ఆర్నెళ్లు పడుతోంది. పన్నులు పెంచే యోచన ఉంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. కమిషనర్ తొలుత ప్రతిపాదించిన రూ. 3850 కోట్ల బడ్జెట్నే ఆమోదించాలి. - బంగారి ప్రకాశ్, బీజేపీ పక్ష నాయకుడు -
ఎన్ని ‘కల’
రూ. 4,599 కోట్ల బడ్జెట్కు ‘స్టాండింగ్’ పచ్చజెండా ! 24న సర్వసభ్య సమావేశం అక్కడ ఆమోదం లాంఛనమే సంక్షేమ పథకాలకు పెద్దపీట ఎన్నికల గాలి మొదలైంది. ఇదివరకెన్నడూ లేని విధంగా భారీ మొత్తంతో ‘గ్రేటర్’ బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రానున్న(2014-15) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 4599 కోట్ల బడ్జెట్కు బుధవారం జరిగిన స్టాండింగ్కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న జరగనున్న సర్వసభ్య సమావేశంలో మమ అనిపించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. రానున్నది ఎన్నికల సీజన్ అయినందున బడ్జెట్లో పేదలపై ప్రేమ కనబరుస్తూ సంక్షేమ పథకాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ‘గ్రేటర్’ బడ్జెట్కు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. త్వరలోనే పార్లమెంటు.. అసెంబ్లీ.. ఆ తర్వాత జీహెచ్ఎంసీ పాలకమండలికి ఎన్నికలు జరుగనున్న తరుణంలో జీహెచ్ఎంసీ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కమిషనర్ ప్రతిపాదించిన రూ.3850 కోట్ల బడ్జెట్కు మార్పులు, చేర్పులు చేసిన స్టాండింగ్ కమిటీ అదనంగా రూ. 749 కోట్లు చేర్చి, మొత్తం రూ. 4599 కోట్ల బడ్జెట్కు బుధవారం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీలో తొలిసారిగా పేదల కడుపు నింపే పథకానికి అంకురార్పణ చేయనున్నారు. రూ. 5లకే సబ్సిడీపై భోజనాన్ని అందజేసే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛమైన నీరందించే ప్లాంట్ల ఏర్పాటుకూ సిద్ధమయ్యారు. యువతను, విద్యార్థులను ఆకట్టుకునేందుకు క్రీడల్లో నైపుణ్యం కనబరిచేవారికి స్కాలర్షిప్ల కార్యక్రమాన్ని చేపడుతున్నారు. శివారు ప్రజలకు సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పనకు గతంలో హామీ ఇచ్చిన ఁటిప్*ను తిరిగి తెరపైకి తెచ్చారు. మొత్తంగా ఎవరికి వారుగా ఎంఐఎం.. కాంగ్రెస్ తామే ఈ సంక్షేమఫలాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పి రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు పాచిక వేశాయి. స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపిన బడ్జెట్.. అందులోని ముఖ్యాంశాలను మేయర్ మాజిద్హుస్సేన్, కమిషనర్ సోమేశ్కుమార్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. శి‘వార్’ గ్రేటర్లో విలీనమైన శివారు మునిసిపాలిటీలకు మౌలిక సదుపాయాల కల్పనకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా పలువురు కార్పొరేటర్లు మేయర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఒకవైపు స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుండగా మరోవైపు వీరు ఈ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే టిప్ కింద నిధులు కేటాయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుమలతా రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, సురేష్రెడ్డి, ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు. రూ.ఐదు కే 15 వేల మందికి భోజనం పేదలకు రూ. 5కే భోజనాన్ని అందించే కొత్త కార్యక్రమానికి శ్రీకారం. ‘గ్రేటర్’లో ఎంపిక చేసిన 50 ప్రాంతాల్లో... తొలుత వచ్చిన 300 మందికి భోజనం అందిస్తారు. రోజుకు 15,000 మందికి ఈ సదుపాయం. ప్రముఖ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. సబ్సిడీ వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తుంది. రోజుకు ఒక పూట మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఫెలోషిప్స్’ ఎన్నికల వేళ యువతను ఆకట్టుకునేందుకు ‘స్పోర్ట్స్ ఫెలోషిప్’ ఇవ్వనున్నారు. క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి నెలకు రూ.ఐదు వేలు, రాష్ట్రస్థాయి వారికి రూ. రెండు వేలు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి వారికి రూ. 1000, క్రీడాకారులకు రూ. 500 ఫెలోషిప్ అందించనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ. 5 కోట్లు ప్రతిపాదించారు. అవసరమైతే ఈ నిధుల్ని మరింత పెంచుతామని మేయర్ చెప్పారు. పేద లకు స్వచ్ఛమైన తాగునీరు మురికివాడల్లోని పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఇందుకు 400 నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు. ఈ కార్యక్రమ అమలుకు రూ. 20 కోట్లు కేటాయిస్తారు. నిధుల సేకరణకు టాక్స్ఫ్రీబాండ్లు జారీ చేస్తారు. వీటి ద్వారా రూ. 300 కోట్లు సేకరించాలనేది లక్ష్యం. మళ్లీ తెరపైకి ‘టిప్’ ‘టిప్’(సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పన)ను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇందుకు రూ. 300 కోట్లు ప్రతిపాదించారు. గ్రేటర్లో కలిసిన శివారు ప్రాంతాల్లో (50 డివిజన్లలో) సదుపాయల కల్పనకే ఈ నిధులు. వీటిని బ్యాంకు రుణాల ద్వారా సేకరిస్తారు. కాలనీ ప్రజల నుంచి 30 శాతం నిధులు సేకరిస్తారు.