breaking news
graphic designer
-
ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..
ఒకప్పుడూ ఒక ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్గా కంప్యూటర్లను క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత వాటితో పనిచేసే స్థాయికి చేరుకుని..ప్రోఫెషన్ డిజైనర్గా మారాడు. ఇంతలో మహమ్మారి తన ఆశలపై చన్నీళ్లు జల్లి గ్రామంలో కూర్చొబెట్టింది. అయినా సరే ..అక్కడ నుంచి వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి..అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ డిజైన్ దిగ్గజంతో పోటీపడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరి ప్రస్థానం అయినా ఏమి తెలియని సున్నా స్థాయి నుంచి మొదలవ్వుతుంది..ఆ శూన్యం విలువని పెంచడం అనేది మన చేతిలోనే ఉంది అనేది తన చేతలతో చెప్పకనే చెప్పాడు ఈ వ్యక్తి. అతడెవరు? అతడి ప్రస్థానం ఎలా మొదలైందో సవివరంగా చూద్దామా..!.ఎక్కడో కరువు బాధిత గ్రామం నుంచి వచ్చి..జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ వ్యక్తి దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat ). ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన కీ బాత్లో అతడి గురించి ప్రస్తావించడమే కాదు మేక్ ఇన్ భారత్కు సరైన అర్థం ఇచ్చాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు. భగత్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందినవాడు. అతడి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల అతడి కుటుంబం తన విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అయినా భగత్ ఐటీఐ వరకు ఏదోలా చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత మెరుగైన భవిష్యత్తు కోసం పూణేకు వెళ్లి నెలకు 4 వేలు జీతం ఇచ్చే పనిక కుదిరాడు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఆఫీస్ బాయ్(Infosys office boy) ఉద్యోగాలు గురించి తెలుసుకుని అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ రోజువారి పనులు చేస్తూ..అందులో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడుతుండేవాడు. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ చేసి ఉండాలని చెప్పారు అక్కడి ఉద్యోగులు. పోనీ కంప్యూర్ జాబ్ కావాలంటే గ్రాఫిక్ డిజైన్ వంటి యానిమేషన్ కోర్సులు ద్వారా ఆ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అని సూచించారు భగత్కి. వాటికి క్రియేటివిటీ ముఖ్యం అని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. అలా రాత్రిళ్లు ఆఫీస్ బాయ్గా డ్యూటీ చేస్తూ.పగలు యానిమేషన్ కోర్సునేర్చుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేరే చోట ఉద్యోగం చేయడం కంటే తనకంటూ సొంత మార్గంలో వెళ్లాలనేది అతడి ఆలోచన. ఆ నేపథ్యంలోనే తొలుత డిజైనర్గా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించాడు..ఆ తర్వాత సొంత డిజైన్ కంపెనీని ప్రారంభించాడు. అయితే అతడి కలలపై నీళ్లు జల్లినట్లుగా కోవిడ్మహమ్మారి విజృంభించి తిరిగి గ్రామంలోకి వెళ్లిపోయేలా చేసింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు భగత్. గ్రామంలో బతకడం ఈజీ..కానీ తన గ్రాఫిక్ డిజైన్ కంపెనీ ప్రారంభించడం అంత సులభం కాదు. ఎందుకంటే తరుచుగా విద్యుత్ కోతలు..సరైన ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కాబట్టి దీన్ని పరిష్కరించేలా తన బృదం సాయంతో మార్గాన్ని అన్వేషించాడు. తమ ఊరిలో కొండపై ఉండే గోశాల వద్ద మొబైల్ సిగ్నల్ బేషుగ్గా ఉంది. కాబట్టి అక్కడ తన డిజైన్ టెంప్లేట్ ఆఫీస్ను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్నగా మొదలైంది అతడి కార్యాలయం. స్థానిక యువకులకు గ్రాఫిక్ డిజైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. వారికి డిజిటల్ నైపుణ్యాల అందివ్వడంలో సహాయం చేశాడు. అతడి వినూత్న స్ఫూర్తి మీడియా కంటపడి..మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆయన మన్ననలను అందుకోవడమే కాదు షార్క్ ట్యాంక్ ఇండియాకు చేరుకుంది అతడి విజయగాథ. దాంతో చిన్నగా మొదలైన డిజైన్ టెంప్లేట్ కాస్తా అంచలంచెలుగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక షార్క్ ట్యాంక్ షోలో బోట్ వ్యవస్థాపకుడు సీఎంఓ అమన్ గుప్పా ఏకంగా అతడి కంపెనీలో పదిశాతం ఈక్విటీని కోటి రూపాయలకు విక్రయించాడు. అయితే ఆ షోలో తన కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడంలో తడబడ్డానని, అప్పుడు రాధికా గుప్తా మంచినీళ్లు ఇచ్చి ఏదో ఆఫీస్ ప్రెజెంటేషన్లా కాదు..నీ ప్రస్థానాన్ని తోటి స్నేహితులకు వివరించినట్లుగా చెప్పుచాలు అని ధైర్యం ఇచ్చారని నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు భగత్. అయితే ఈ డిజైన్ టెంప్లేట్ భారతీయ వినియోగదారుల కోసం భగత్ రూపొందించిన క్రియేటివిటీ సాధనం. ఇప్పుడు ఇది అంతర్జాతీయ డిజైన్ ఫ్లాట్ఫామ్ కాన్వాతో పోటీపడే రేంజ్కి చేరుకుంది. ఆఫీస్ బాయ్ కాస్తా ప్రోఫెషనల్ డిజైనర్ స్థాయికు చేరుకుని తానే ఉద్యోగాల ఇచ్చే రేంజ్కి చేరడం అంటే..అది అలాంటి ఇలాంటి సక్సెస్ జర్నీ కాదు కదూ..! కాగా, భగత్ స్థానిక క్రియేటర్లకు సాధికరత కల్పించి..డిజిటల్ డిజైన్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నాడు భగత్. View this post on Instagram A post shared by Dadasaheb Bhagat (@dadasaheb_bhagat) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
గ్రాఫిక్ డిజైనర్తో హీరో డేటింగ్.. నాలుగేళ్లుగా!
బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్లో ఉన్నారా? దీనిపై ప్రస్తుతం బీటౌన్లో చర్చ నడుస్తోంది. ముంబయికి చెందిన గ్రాఫిక్ డిజైనర్తో నాలుగేళ్లుగా డేటింగ్ కొనసాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. గ్రాఫిక్ డిజైనర్ రాధికా కోల్గాంకర్తో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. కాగా.. ఆదర్శ్ గౌరవ్ 'ది వైట్ టైగర్'లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. అయితే ఆదర్శ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడడని తెలుస్తోంది. అయితే డేటింగ్ వార్తలను ఆదర్శ్ ఖండించలేదు. రాధికా కోల్గాంకర్తో రిలేషన్పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను తన రాబోయే ప్రాజెక్ట్లపై దృష్టి సారించినందువల్లే ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడటం లేదని తెలుస్తోంది. సినిమాల విషయాకొనిస్తే గౌరవ్ 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్తో తన నటనను ప్రారంభించాడు. రామిన్ బహ్రానీ దర్శకత్వంలో బలరామ్ హల్వాయి పాత్రను పోషించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించిన 'ఖో గయే హమ్ కహాన్'లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Adarsh Gourav (@gouravadarsh) -
1,00,000 గ్రాఫిక్ డిజైనర్లు
సాక్షి, అమరావతి : ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లోకి పలు సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యక్తిగత ప్రచారానికి, వైరి పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా గ్రాఫిక్స్తో ఫోటోలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష మందికిపైగా గ్రాఫిక్ డిజైనర్లు పనిచేస్తున్నట్టు సమాచారం. దాదాపు 1.60 కోట్ల మంది ఎలక్షన్ ట్రెండ్ను సోషల్ మీడియా ద్వారా అనుసరిస్తున్నారు. వీరి ద్వారా సమాచారం మరో 1.20 లక్షల మందికి చేరుతోంది. వీరికి ఫేస్బుక్, ట్విట్టర్లకు 1.10 కోట్ల మంది, వాట్సాప్ గ్రూపుల్లో 50 లక్షల మంది లింక్ అయినట్టు తెలుస్తోంది. గ్రూపులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి కచ్చితంగా అంచనా వేయలేమని సర్వే సంస్థ పేర్కొంది. విషయాలను తెలుసుకునేందుకు ప్రధానంగా ఫేస్బుక్కు కనెక్ట్ అవుతున్నారు. ప్రధాన పార్టీలు, నేతల మనోగతాన్ని తెలుసుకునేందుకు ట్విట్టర్ అకౌంటును క్లిక్ చేస్తున్నారు. -
ఔను...అచ్చం అలాగే!
కాపీ కళలో కాకలు తీరిన ఆర్టిస్ట్ మైక్ రోమ్. అరవై ఆరు సంవత్సరాల మైక్, బ్రిస్టల్(ఇంగ్లండ్)లోని తన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మోనాలిసాలాంటి మాస్టర్పీస్లను వేగంగా గీస్తుంటాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వందలాది కళాఖండాలను ఒంటిచేత్తో గీశాడు మిస్టర్ రోమ్. ఈయన ఒకప్పుడు గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశాడు.తన భార్య పామ్ చనిపోయిన తరువాత రోమ్ను ఒంటరితనం ఆవహించింది. దాని నుంచి బయటపడడానికి తనను తాను ఎప్పుడు బిజీగా ఉంచుకోవడానికి ఈ కళ తనకు ఉపయోగపడింది. చిత్రకళలో ఎవరి దగ్గరా ఎలాంటి శిక్షణా తీసుకోని రోమ్ ‘సాధనను మించిన అనుభవం లేదు’ అని నమ్ముతాడు. రోమ్లోని ప్రతిభ మొదటిసారి కొందరు ఇంజనీర్ల దృష్టిలో పడింది. అప్పుడు ఆయన వారి ఆఫీస్లో పనిచేసేవాడు.రోమ్ను చిత్రాలు వేయించే దిశగా ఆ ఇంజనీర్లు ఎంతగానో ప్రోత్సహించారు.తాను ఒక చిత్రాన్ని చిత్రించే ముందు దాని తాలూకు ఒరిజినల్ను గ్యాలరీకి వెళ్లి చూసి వస్తాడు. ఆ తరువాతగానీ కుంచెకు పనిచెప్పడు రోమ్. ‘‘నేను గీసేవి నకిలీ అనుకోనక్కర్లేదు. వాటికంటూ ఒక సొంత విలువ ఉంది’’ అంటాడు రోమ్. ఒక్కో పెయింటింగ్ వేయడానికి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి తీసుకుంటాడు. రోమ్ కాపీ చేసిన చిత్రాలు ఎన్నో గ్యాలరీలలో కొలువవుతుంటాయి. మంచి ధరకు అమ్ముడవుతుంటాయి. ‘‘చిత్రకళలలో నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికే మొదట ఈ పని మొదలు పెట్టాను’’ అంటున్న రోమ్ ఆ తరువాత ‘రెప్లికా’ ను ప్రధాన వృత్తిగా చేసుకున్నాడు. ప్రసిద్ధ చిత్రాలను మాత్రమే కాపీ చేయాలనే నియమమేదీ పెట్టుకోలేదు. తన మనసుకు నచ్చిన అనామక చిత్రాలను కూడా కాపీ చేస్తుంటాడు.‘‘కాపీ కళ అనగానే కొంత చిన్నచూపు ఉంటుంది. గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది’’ అంటాడు రోమ్. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ చిత్రాలను అమ్మగలనంటున్నాడు మైక్ రోమ్.


