breaking news
Grand Prix Award
-
ఛాయాచిత్రం
హైస్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాల్లో ఛాయా కదమ్ నటప్రతిభను మెచ్చుతూ ‘నువ్వు సినిమాల్లోకి వెళితే ఇక తిరుగు లేదు’ అన్నారు చాలామంది. కట్ చేస్తే... ‘అసలు నీకు నటన వచ్చా’ అని తిట్టాడు ఒక డైరెక్టర్. ఒక డైరెక్టర్ అయితే అసహనంతో కుర్చీని నేలకేసి కొట్టాడు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అయితే ఏరోజూ వెనకడుగు వేయలేదు.కట్ చేస్తే... ‘ఒక్క సీన్ అయినా ఫరవాలేదు’ అనుకునే స్థాయి నుంచి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’లో నటించే స్థాయికి చేరింది. ఈ చిత్రం కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్లో ‘గ్రాండ్ ప్రి’ అవార్డ్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ‘పార్వతి’ పాత్రలో నటనకు ప్రశంసలే కాదు అంతర్జాతీయ వేదికపై స్టాండింగ్ వొవేషన్ స్వీకరించింది ఛాయా కదమ్.ముంబై శివారులోని కలీనాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఛాయ. తండ్రి ఓ మిల్లులో కార్మికుడు. స్కూలు రోజుల్లో కబడ్డీ బాగా ఆడేది. స్టేట్, నేషనల్ లెవెల్లో కూడా ఆడింది. ఆటలతో పాటు నటించడం అంటే కూడా ఇష్టం. హైస్కూల్, కాలేజీలో ఎన్నో నాటకాల్లో నటించింది. ఇంటర్మీడియెట్ ఫెయిల్ కావడంతో ‘ఫెయిల్యూర్’ అనేది తొలిసారిగా పరిచయం అయింది. ‘జయాపజయాలు జీవితంలో భాగం. ఫెయిల్యూర్ ఎదురైనా కుంగి΄ోనక్కర్లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది అనే విషయం ఎప్పుడూ మరచి΄ోవద్దు’ అనే మాట ఛాయను ముందుకు నడిపించింది.‘టెక్స్టైల్ డిజైన్’ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపింది. అయితే సినిమాల్లో అవకాశం రావడం నాటకాల్లో నటించినంత వీజీ కాదనే విషయాన్ని ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. స్ట్రగుల్స్ తర్వాత... రాక రాక ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు! ‘సినిమాల్లో నటించాలనుకునేవారికి నటప్రతిభతో పాటు బోలెడు ఓపిక ఉండాలి’ అనే మాటను మాత్రం ఎప్పుడూ మరచి΄ోలేదు ఛాయ.తొలి రోజుల్లో ‘వన్ సీన్’ పాత్రలలోనూ నటించింది. ఆ ఒక్క సీన్ కోసం లొకేషన్లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. ‘ఒక్క సీన్ ఉంది. ఫలానా చోట షూటింగ్’ అని చెప్పేవారు. ΄÷ద్దున్నే లేచి ఆ ్రపాంతం చేరడానికి ్రపాణం మీదికి వచ్చేది. తీరా అక్కడికి వెళ్లాక... ‘ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్’ అనే మాటను కూడా ఎన్నో సార్లు విన్నది. కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు వచ్చినప్పటికీ డైరెక్టర్ల అహం భరించలేని స్థాయిలో ఉండేది. దుఃఖం ఆగేది కాదు. దుఃఖంలోనే ఉంటే ఆ సాగరంలో ‘నటన’ కొట్టుకు΄ోతుంది. అందుకని ఎంత బాధ అనిపించినా అప్పటికప్పుడు ఆ బాధ నుంచి బయట పడి డైరెక్టర్కు నచ్చేంత వరకూ నటిస్తూనే ఉండేది. ఆమె ఓపిక, కష్టం వృథా ΄ోలేదు. మరాఠీ, హిందీ సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కాన్స్ రూపంలో అంతర్జాతీయ వేదికపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.శ్రామిక వర్గ బలంశ్రామిక వర్గ నేపథ్యం నుంచి వచ్చాను. నాన్న మిల్లు కార్మికుడు. అలా అని నేను ఎప్పుడూ ఎవరి నుంచి సానుభూతి ఆశించలేదు. అయితే నా నేపథ్యం నేను చేసిన అట్టడుగు, శ్రామిక వర్గ పాత్రలకు బలాన్ని ఇచ్చింది. నా పాత్రలకు అవసరమైన మెటీరియల్ను ఇచ్చింది.– ఛాయా కదమ్ -
ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు: దర్శకురాలు పాయల్ కపాడియా
కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం చరిత్రలో చెప్పుకునేలా సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘భారతీయ సినిమా’ కాన్స్లో మెరిసింది. తొలి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును మన దేశ దర్శకురాలు పాయల్ కపాడియా తెచ్చారు. ప్రతిష్టాత్మక పియరీ ఏంజెనీ అవార్డును అందుకున్న తొలి ఏషియన్గా ఛాయాగ్రాహకుడు–దర్శక–నిర్మాత సంతోష్ శివన్ సగర్వంగా దేశానికి తిరిగొచ్చారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో అనసూయ సేన్ గుప్తా ‘ది షేమ్లెస్’ చిత్రానికిగాను ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు.ఇదే విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి దర్శకత్వంలో రూపొందిన ‘సంతోష్’ ప్రదర్శితమైంది. కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇక చిదానంద ఎస్. నాయక్ దర్శకత్వం వహించిన కన్నడ లఘు చిత్రం ‘సన్ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ ‘లా సినిఫ్’ విభాగంలో మొదటి బహుమతి పొందింది. అలాగే ‘బన్నీ హుడ్’ అనే మరో భారతీయ యానిమేటెడ్ మూవీ మూడో బహుమతి సాధించింది. ఇలా ఈసారి 77వ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం హవా కనిపించింది. మే 14న ఆరంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. దర్శకురాలు పాయల్ కపాడియా అందుకున్న అవార్డు విశేషాలతో పాటు మరిన్ని విషయాలు ఈ విధంగా... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ సినిమా సత్తా చాటింది.గ్రాండ్ ప్రిక్ విభాగంలో అవార్డు సాధించింది. కాన్స్ చిత్రోత్సవాల్లోని ఈ ప్రధాన విభాగంలో అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక విభాగమైన పామ్ డి ఓర్ అవార్డుకు కూడా ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం పోటీలో నిలిచినప్పటికీ, అవార్డును అందుకోలేకపోయింది. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విభాగంలో ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ రూపంలో ఓ భారతీయ చిత్రం పోటీలో నిలవడం ప్రశంసించదగ్గ విషయం. ఇక పామ్ డి ఓర్ విభాగంలో దాదాపు ఇరవై సినిమాలను వెనక్కి నెట్టి, సీన్ బేకర్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘అనోరా’ అవార్డును ఎగరేసుకుపోయింది.‘గ్రాండ్ టూర్’ సినిమాకు గాను మిగ్యుల్ గోమ్స్ ఉత్తమ దర్శకుడిగా, ‘కైండ్స్ ఆఫ్ కైండ్నెస్’ సినిమాలోని నటనకు గాను జెస్సీ ప్లేమోన్స్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఎమిలియా పరేజ్’లో నటించిన అడ్రియానా పాజ్, కర్లా సోఫియా, సెలెనా గోమేజ్, జో సల్దానాలు ఉత్తమ నటీమణులుగా నిలిచారు. జాక్వెస్ డియార్డ్ నటించిన ఈ సినిమాకే జ్యూరీ ప్రైజ్ దక్కడం విశేషం. చిత్రోత్సవాల తొలి రోజు హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, ఆ తర్వాత జపాన్కు చెందిన యానిమేషన్ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లి’ ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ అవార్డు అందుకోగా చివరి రోజు హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ స్వీకరించారు.‘‘నిజానికి స్క్రిప్ట్ రాసేటప్పుడు కంగారుపడ్డాను. ఆ కంగారులో ఏదో రాశాను (నవ్వుతూ). మా సినిమాని ఇక్కడ వరకూ తీసుకొచ్చిన ‘కాన్స్’కి థ్యాంక్స్. దయచేసి మరో భారతీయ చిత్రం కోసం 30 ఏళ్లు వేచి ఉండొద్దు’’ అని అవార్డు అందుకున్న అనంతరం పాయల్ కపాడియా అన్నారు. వేదిక మీద ఉన్న ఈ మూవీలో నటించిన కనీ కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్లను ఆత్మీయంగా హత్తుకుని, ‘‘తమ సొంత సినిమాలా భావించి చేసిన ఈ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు’’ అన్నారు.ఇంకా ఈ చిత్ర నిర్మాతలు, భాగస్వాములు, ఇతర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అది మాత్రమే కాదు... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తొలి రోజు ఫెస్టివల్ వర్కర్లు మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తూ చేసిన నిరసనకు మద్దతు తెలిపారు. పాయల్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ – ‘‘నేను తీసిన ఈ సినిమా ముగ్గురి మహిళల స్నేహం నేపథ్యంలో ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా ఒకరికొకరు గోతులు తీసుకుంటారు.సమాజం అలానే చిత్రీకరించింది. అది దురదృష్టకరం. కానీ స్నేహం అనేది నాకు ముఖ్యమైన బంధం. ఎందుకంటే అది గొప్పతనానికి దారి తీస్తుంది. కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఈ విలువలను కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తుండాలి’’ అన్నారు. ఆమె అవార్డు తీసుకురావడం పట్ల భారత ప్రధాని మోదీ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. కని కస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్ లీడ్ రోల్స్లో ఈ సినిమాను థామస్ హకీమ్, జూలియన్ గ్రాఫ్ నిర్మించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ నెల 23న ఈ చిత్రం ప్రదర్శితమైంది. కాగా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్కే కాన్స్లోని ఓ ప్రధాన విభాగమైన గ్రాండ్ ప్రిక్ అవార్డు రావడం విశేషం.అయితే కాన్స్లో పాయల్ ప్రతిభ మెరవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ ఏడాది గోల్డెన్ ఐ అవార్డు పాయల్కు దక్కింది. అలాగే 2017లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్ నూన్ క్లౌడ్’ ప్రదర్శితమైంది. ‘ఆల్ వీయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథ ఏంటంటే... కేరళ నుంచి ముంబైకి వెళ్లి నర్సులుగా పని చేస్తుంటారు ప్రభ (కని కస్రుతి), అను (దివ్య ప్రభ). భర్తతో విడిపోయిన ప్రభకు ఓ గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ను ఆమె భర్త పంపిస్తాడు. దీంతో ప్రభకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు అను తన రిలేషన్షిప్లో ఇబ్బందులకు లోనవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ రోడ్ ట్రిప్కు వెళితే ఏం జరిగింది? అన్నదే కథ. -
మైండ్షేర్కు గ్రాండ్ ప్రిక్స్గ్లాస్ లయన్ అవార్డు
ముంబై: గ్రూప్ఎంకు చెందిన గ్లోబల్ మీడియా అండ్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ‘మైండ్షేర్’ తాజాగా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది ఇటీవల జరిగిన కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ‘6 ప్యాక్ బాండ్’ ప్రచారానికి గానూ గ్లాస్ లయన్స్ విభాగంలో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును పొందింది. వై-ఫిల్మ్స్ దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ పాప్బాండ్ను ‘6 ప్యాక్ బాండ్’ను బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్, మైండ్షేర్ సంస్థలతో కలిసి ఆవిష్కరించింది.