-
జయకు విదేశీ వైద్యం వద్దనుకున్నారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించేందుకు మంత్రులు సిద్ధపడినా, తరువాత వెనక్కి తగ్గారని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు వెల్లడించారు. జయ మరణంపై విచారణ జరుపుతున్న కమిషన్కు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆరు నెలల తరువాత బహిర్గతమైంది. తమిళ దినపత్రికలు ఆ విషయాల్ని గురువారం ప్రముఖంగా ప్రచురించాయి. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి గత డిసెంబరు 21న రామమోహన్ రావును విచారించారు. ‘అత్యుత్తమ వైద్యం అందించేందుకు జయను విదేశాలకు తరలించాలని మంత్రులకు సూచించాను. ఈ విషయంపై వారు 4 రోజులు ఆలోచించి, ఆ తరువాత పూర్తిగా విస్మరించారు’ అని ఆయన వివరించారు. మంత్రులకు మరెక్కడి నుంచైనా అనుమతులు రావాల్సి ఉండే దా? అని కమిషన్ ప్రశ్నించగా తనకు తెలియద ని బదులిచ్చారు. ‘జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు 2016 డిసెంబరు 4న వైద్యులు చెప్పగానే ఆసుపత్రికి వెళ్లి చూడగా, ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఇక లాభం లేదని వైద్యులు తేల్చేశారు. ఇదంతా జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారు’ అని చెప్పారు. -
నిండు సభలో అడ్డంగా దొరికారు
నెల రోజుల కిందట సీఈఓ ఏమన్నారు? జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టిన పోలవరం అథారిటీ సీఈఓ దినేష్కుమార్ సరిగ్గా నెల రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి వచ్చిన అథారిటీ.. ఆ పనులు జరుగుతున్న తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాసిన లేఖ అది. ఇప్పుడు జరుగుతున్న తరహాలో పనులు జరిగితే.. ప్రాజెక్టు పూర్తిచేయడానికి ప్రతిపాదిత సమయానికన్నా చాలా ఎక్కువ కాలం పడుతుందని.. ప్రాజెక్టుతో పాటు, దాని ప్రయోజనాలు నెరవేరటంలోనూ తీవ్ర జాప్యం జరుగుతందని ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంతో పాటు.. పోలవరం అథారిటీ లేవనెత్తిన మరిన్ని అంశాలను ‘సాక్షి’ మంగళవారం నాడు ప్రచురించిన తన కథనంలో వివరించింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపధ్యంలో.. దీని నిర్మాణ బాధ్యతలు కూడా కేంద్రం చేతుల్లోకి వెళతాయని.. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకపోతే ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేసే అవకాశం ఉంటుందని.. కాబట్టి ఈ పనుల బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని అధికార వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని ‘సాక్షి’ వెల్లడించింది. ‘మినిట్స్’ చూపుతూ చంద్రబాబు ఏం చెప్పారు? ఈ కథనమంతా అసత్యమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు శాసనసభలో మండిపడ్డారు. ఆ క్రమంలో పోలవరం అథారిటీ తొలి సమావేశానికి సంబంధించిన మినిట్స్ను సభలో చూపించారు. ‘నిన్ననే.. అంటే మార్చి 16వ తేదీన ఢిల్లీలో పోలవరం అథారిటీ సమావేశం జరిగిందని.. ఆ మినిట్సే మాకు పంపార’ని చెప్పారు. దాని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టులను కొనసాగించేందుకు, రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేపట్టేందుకు ఆ అథారిటీ అనుమతించిందని, ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే నిధులను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ‘సాక్షి’ అసత్యాలు రాస్తోందంటూ నిప్పులు చెరుగుతూ ఈ మాటలు అన్నారు. నెల రోజుల్లోనే సీఈఓ వైఖరి మారిందంటే అర్థమేమిటి? చంద్రబాబు చెప్పిన ఈ మాటలే.. ‘సాక్షి’ చెప్పిందే వాస్తవమని నిరూపిస్తున్నాయి. నెల రోజుల కిందట.. ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన పోలవరం అథారిటీ సీఈఓ.. సరిగ్గా నెల రోజుల్లోనే.. ‘ప్రస్తుత కాంట్రాక్టునే కొనసాగించాల’ని ఎందుకన్నారు? దీని వెనుక ఉన్న ఒత్తిడిలు ఏమిటి? వాస్తవానికి నెల రోజుల కిందట పోలవరం అథారిటీ సీఈఓ రాసిన లేఖకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం అథారిటీకి కానీ, కేంద్ర జలవనరుల శాఖకు కానీ ఎటువంటి సమాచారం, సమాధానం ఇచ్చిందీ తెలియదు. ఏం సంప్రదింపులు జరిపిందీ చంద్రబాబు చెప్పలేదు. కానీ.. ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించేలా, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. అందుకే.. సీఈఓ నెల రోజుల్లోనే తన వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతోంది. సరిగ్గా ‘సాక్షి’ చెప్పిన విషయమిదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రం చేతుల్లోకి వెళ్లకుండా తన చేతుల్లోనే ఉంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడులు తీసుకొస్తోందనే చెప్పింది. అదే నిజమని.. సీఈఓ వైఖరి నెల రోజుల్లోనే మారిపోవటం స్పష్టం చేస్తోంది. అది నిర్ణయం కాదు.. సీఈఓ సూచన మాత్రమే అంతేకాదు.. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రస్తుత కాంట్రాక్టును కొనసాగించాలన్న మాట.. పోలవరం అథారిటీ తీసుకున్న నిర్ణయం కానే కాదు. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు అమలు విధివిధానాలపై చర్చల సందర్భంగా సీఈఓ చేసిన ఒక సూచన మాత్రమే. అది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సమావేశం మినిట్స్లో పేర్కొన్న ‘తీర్మానాలు’లోనూ ఈ అంశం లేదు. అంటే.. ఇది అథారిటీ నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్ధం. అథారిటీ భేటీ 16న ఢిల్లీలో జరగలేదు... ఈ పోలవరం అథారిటీ మార్చి 16వ తేదీన ఢిల్లీలో సమావేశమైందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. ఈ మాటలు విని ఢిల్లీ వర్గాలే విస్తుపోయాయి. ఎందుకంటే.. పోలవరం అథారిటీ సమావేశం ఢిల్లీలో జరగలేదు. ఈ నెల 16వ తేదీనా జరగలేదు. వాస్తవానికి ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లోనే పోలవరం అథారిటీ తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశం మినిట్స్ను ఈ నెల 16వ తేదీన (సోమవారం నాడు) కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖకు పంపించారు. అంటే.. ఈ సమావేశం జరిగిన తేదీ, ప్రదేశం పైనా చంద్రబాబు నిందు సభలో చెప్పినవి అసత్యాలే. వ్యయం రీయింబర్స్ తీర్మానానికీ వక్రీకరణ... ఇక.. పోలవరం అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు బదిలీ చేసే విధానంపైనా చర్చలు జరగాలని, అవసరమైతే ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశంలో ప్రతిపాదించారు. దీనిపై ఎటువంటి చర్చా జరగలేదు. ఈ ప్రతిపాదనను బట్టే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిధులను తమకు బదిలీ చేయాలని కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. చంద్రబాబు మరో అంశాన్ని చూపుతూ.. ప్రాజెక్టు నిధులను రాష్ట్రానికి బదిలీ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. ఈ అథారిటీ ఏర్పడిన తర్వాత ప్రస్తుత సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఏపీ సర్కారుకు రీయింబర్స్ చేయాలని మాత్రమే అథారిటీ తీర్మానం చేసింది. ఈ రీయింబర్స్ అంశాన్ని.. పాలక మండలి చైర్మన్ అయిన జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆమోదానికి నివేదించాలని నిర్ణయించింది. కానీ.. ఈ తీర్మానాన్ని చంద్రబాబు వక్రీకరిస్తూ.. మొత్తం ప్రాజెక్టు వ్యయానికి అయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్ చేయటానికి పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుందని అసెంబ్లీలో అసత్యాలు చెప్పుకొచ్చారు. కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునే అధికారం సీఈఓకు... నిజానికి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నియంత్రణలపై.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వశాఖతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు పోలవరం అథారిటీ సీఈఓకు అధికారమిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అధారిటీ చేసిన తీర్మానాలను పోలవరం ప్రాజెక్టు అధారిటీ గవర్నింగ్ బాడీ ఆమోదం తెలిపాలి. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో గవర్నింగ్ బాడీ ఉంటుంది. గవర్నింగ్ బాడీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం గానీ, పోలవరం అధారిటీ గానీ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్కడా అనుమతించలేదు. కానీ.. అనుమతించేసిందని నిండు సభలో బల్ల గుద్ది చెప్పుకోవటం ఒక్క బాబుకే చెల్లింది! -న్యూఢిల్లీ, సాక్షి -
ఆఫీసులన్నీ ఒకేచోట..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలనను వేగవంతం చేసేందుకు.. ప్రజలకు జవాబుదారిగా ఉండేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోటకు తేనుంది. అన్ని జిల్లా కార్యాలయాలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ జిల్లా కలెక్టర్ ఇలంబరితిని ఆదేశించారు. డివిజన్, మండలస్థాయిలో సైతం కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు పలు ప్రభుత్వశాఖలకు సొంతభనాలు లేవు. అద్దె భవానాల్లో చాలీచాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ భూముల గుర్తింపు, ప్రభుత్వ శాఖలకు చెందిన అద్దె భవనాల వివరాలు సేకరిస్తున్నారు. పరిశీలనలో ఎన్నెస్పీ క్యాంప్.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా భూములు గుర్తించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియోకాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్ లో 35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కలెక్టర్ ఇలంబరితి వెల్లడించారు. జిల్లాస్థాయి కార్యాలయా ల సముదాయం నిర్మించడానికి ఇదే అనువైన స్థల మని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు కార్యాల యాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించింది. అన్నిటికీ అనువుగా ఉన్న ఎన్నెస్పీ క్యాంప్ లో అన్ని కార్యాలయాలు నిర్మించాలని మంత్రి తుమ్మల అధికారులతో చ ర్చించినట్లు తెలుస్తోంది. అద్దె భారం... జిల్లాలో పలు ప్రభుత్వశాఖలు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడిచినా ప్రధాన శాఖలకు మాత్రం సొంత కార్యాలయాలు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వశాఖల అభివృద్ధికి లక్షల కోట్లు విడుదల చేస్తున్నా అధికారులు మాత్రం కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో కొంత అద్దెలకు వెచ్చిస్తూ విధులు నిర్వహించడం పరిపాటిగా మారింది. అద్దె భవనాల్లో.. ⇒ స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సొంత భవనం లేక అనేక ఏళ్ళుగా కలెక్టరేట్ వెనుక భాగంలో అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. దీని కిరాయి నెలకు రూ.30వేలు. ⇒ పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయం సైతం అద్దె భవనంలోనే ఉంది. ⇒ ఉద్యానశాఖ 1, 2 విభాగాలు స్థానిక వీడివోస్ కాలనీలో అద్దెభవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ⇒ మైనింగ్ ఏడీ కార్యాలయం కూడా ఇక్కడే అద్దెభవనంలోనే కొనసాగుతోంది. ⇒ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి సైతం సొంత భవనం లేదు. ఖానాపురం హవేలి పంచాయతీ కార్పొరేషన్లో విలీనం కావడంతో ఆ భవనాన్ని పంచాయతీ అధికారి కార్యాలయానికి అప్పగించారు. అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయానికీ సొంత భవనం లేదు. ప్రస్తుతం జిల్లా పరిషత్ భవనంలో ఒక గదిలో ఇది కొనసాగుతోంది. ⇒ జిల్లా అడిట్ కార్యాలయం ఒక విభాగం కిరాయి చెల్లిస్తుండగా, మరో విభాగం జిల్లా పరిషత్ భవనంలో ఉంది. ⇒ కమర్షియల్ ట్యాక్స్ 1, 2, 3, విభాగాలను వేల రూపాయలు చెల్లిస్తూ కాల్వొడ్డులోని అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. ⇒ జిల్లా పర్యాటకశాఖకూ సొంత భవనం లేదు. గతంలో కలెక్టరేట్లో ఒక గదిలో ఉండేది. తరువాత అక్కడి నుంచి జిల్లా పరిషత్లోని ఓ గదికి మార్చారు. ⇒ నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రధాన కార్యాలయానికీ సొంత భవనం లేదు. ⇒ జిల్లా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం అద్దె భవనంలోనే ఉంది. ⇒ ఇరిగేషన్ ఎత్తి పోతల పథకం కార్యాలయం కిరాయి భవనమే. ⇒ కార్మికశాఖ కార్యాలయం లేక పోవడంతో అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. ⇒ నెడ్ క్యాప్ ఏపీఎంఐపీ, ఆత్మ తదితర కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement