breaking news
govt employee arrested
-
ఆవు పేడ చోరీ.. జైలు పాలైన ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, బెంగళూరు: డబ్బు, బంగారం, విలువైన వస్తువులే కాదు.. ఆవు పేడను కూడా చోరీ చేస్తున్నారు. ఆవు పేడ చోరీ చేసిన కేసులో ప్రభుత్వ ఉద్యోగి జైలు పాలయ్యాడు. లక్షల్లో జీతం వస్తున్నా.. పేడ కోసం కక్కుర్తిపడి ఇలా కటకటాలపాలవడం అందినీ ఆశ్చర్యపరుస్తోంది. కర్ణాటకలోని చిక్కమాళలూరు జిల్లా బీరూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బీరూర్ పశుసంవర్ధక శాఖ సుమారు 30-40 ట్రక్కుల పేడను సేకరించింది. దాని విలువ రూ. 1.25 లక్షలు. అయితే అక్కడ నిల్వ ఉంచిన పేడ రాత్రికిరాత్రే మాయమైంది. ఈ చోరీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పశుసంవర్దక శాఖ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శాఖలోనే సూపర్వైజర్గా పనిచేస్తున్న ఉద్యోగే ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. దొంగలించిన పేడను ఓ ప్రైవేట్ స్థలంలో దాచినట్టు.. పేడను కాజేసీ రైతులకు అమ్మాలని భావించానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇకపై గోవులతో పాటు వాటి పేడపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం వస్తుందేమోనని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. కాగా, భారతీయ వ్యవసాయ విధానంలో ఆవు మూత్రం, పేడకు ప్రత్యేక స్థానముంది. పశువుల పెంటను పంటపొలాలకు ఎరువుగా చల్లుతారు . దీంతో ఆవు పేడకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. -
ప్రేమపేరుతో మోసం : ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
తమిళనాడు : ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేసి మోసగించిన ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా పెరమచూర్కు చెందిన కుమరేశన్ (30) అనే యువకుడు విద్యుత్ బోర్డు కార్యాలయంలో టెక్నీషియన్ సహాయకుడిగా పని చేస్తున్నాడు. తొలసంపట్టికి చెందిన శశికళ (23) అనే యువతి కుమరేశన్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కాలేజీలో చదువుతున్న సమయంలో కుమరేశన్ బంధువు కుమార్తె ద్వారా ఆమె పరిచయమైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి కుమరేశన్ శశికళను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో శశికళకు రెండుసార్లు గర్భం అయ్యింది. ఆమెకు కుమరేశన్ అబార్షన్ చేయించాడు. ఇదే సమయంలో కుమరేశన్కు ఉద్యోగం పర్శినెంట్ కావడంతో ప్రియురాలితో మాట్లాడడం మానేశాడు. అతనికి మరో యువతితో వివాహ సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకున్న శశికళ స్థానిక మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుమరేశన్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.