Gouri Kishan
-
ఆయన గట్టి గట్టిగా అరిచాడు.. నేనైతే ఏడ్చేదాన్ని: అను ఇమ్మాన్యుయేల్
తమిళ సినిమా 'అదర్స్' ప్రమోషన్లలో నటి గౌరీ కిషన్కి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో 'మీ బరువెంత?' అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించడం వివాదస్పదమైంది. సినిమా గురించి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నా పర్సనల్ విషయాల గురించి ఎందుకు అడిగారని సదరు జర్నలిస్ట్పై గౌరీ ఫైర్ అయ్యారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్స్ గౌరికి మద్దతు తెలుపుతూ.. జర్నలిస్ట్ని ట్రోల్ చేశారు. చివరకు సదరు జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. జర్నలిస్ట్ సారీని గౌరీ అంగీకరించలేదు. 'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. ఆయన ప్రశ్నని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని.. ఆయన బాడీ షేమింగ్ చేయలేదనడం కరెక్ట్ కాదు’ అంటూ ఆయన క్షమాపణలను తోసిపుచ్చింది. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్తో పాటు చిత్రపరిశ్రమం మొత్తం హాట్ టాపిక్గా మారింది. తాజాగా దీనిపై హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel ) స్పందించింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న చాలా తప్పని అను చెప్పింది. ఒకరి బాడీపై కామెంట్స్ చేసే అధికారం ఎవరికీ లేదని అను పేర్కొంది.గర్ల్ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గౌరి కిషన్ ఇష్యూ గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానం చెప్పారు. ‘నేను ఆ ప్లేస్లో ఉంటే ఏడ్చేదాన్నేమో. ఆ జర్నలిస్ట్ గౌరీపై గట్టి గట్టిగా అరిచాడు. కానీ ఆమె ధైర్యంగా ఎదురించింది. హీరోని సినిమా విషయాల గురించి చక్కగా అడిగిన ఆ జర్నలిస్ట్.. హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి ‘బరువెంత?’అని అడిగాడు. సినిమాకు ఆమె బరువుకు ఏం సంబంధం? హీరోయిన్ అంటే లిప్స్టిప్ పెట్టుకొని మంచిగా రెడీ అయి ఉండడమేనా? అంతకు మించి కూడా మాలో వేరే టాలెంట్ ఉంటుంది. అది గుర్తించండి’ అని అను ఇమ్మాన్యుయేల్ పేర్కొంది. -
హీరో మెటీరియల్ నుంచి హీరోయిన్ బరువు దాకా...
ఇది సోషల్ మీడియా యుగం. కారెవరూ ఫేమస్ అవడానికి అనర్హం అన్నట్టుగా తయారు చేసిన సామాజిక మాధ్యమాల యుగం. ఇవి ప్రతీ ఒక్కరికీ కీర్తి దాహాన్ని పాప్యులారిటీ పిచ్చిని పెంచేస్తున్నాయి. ఉఛ్చనీచాలు, కనీస విలువలను మర్చిపోయేలా చేస్తున్నాయి. అయితే ఆ మైకంలో జర్నలిజం కూడా చిక్కుకుపోవడమే దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలవడానికి ఒకప్పుడు పాత్రికేయులు గొప్ప గొప్ప కధనాలు రాసేవారు. సినిమాలపై అద్భుతమైన సమీక్షలతో ప్రేక్షకులకు మార్గదర్శకత్వం వహంచేవారు. ఇప్పుడు.. దాని కోసం కొందరు ఎంచుకుంటున్న దారులు సినీ జర్నలిస్టులు అంటేనే సెలబ్రిటీలు చీదరించుకునే స్థాయికి దిగజార్చుతున్నాయి.ఆ మధ్య ఓ సినీ జర్నలిస్ట్ నటి మంచులక్ష్మి వస్త్రధారణపై ప్రశ్నించడం ద్వారా తల బొప్పి కట్టించుకున్న వైనం చూశాం. ఐదు పదుల వయసులో ఉన్న మహిళ అయి ఉండీ ఇలాంటి దుస్తులు ధరించడం కరెక్టా? అనే అసంబద్ధమైన ప్రశ్న ద్వారా మంచులక్ష్మి కోపాన్ని నషాళానికి ఎక్కించారాయన. ఇది చిలికి చిలికి చివరకి మా అసోసియేషన్కి మంచులక్ష్మి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.ఆ ఉదంతం ఇంకా మరవకముందే... మరో పాత్రికేయ నారీమణి... తమిళ నటీనటుల సాక్షిగా తెలుగు జర్నలిస్ట్ల పరువు తీసిపారేశారు. ఒక యువ కధానాయకుడు, దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan)ను ప్రశ్నించే క్రమంలో మీరు హీరో మెటీరియల్ కాదు కదా అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్ వివాదం రాజేసింది. దీంతో ఆమెపై నెటిజన్ల నుంచి సినీ జనం దాకా దుమ్మెత్తి పోశారు. సీనియర్ నటుడు శరత్కుమార్ నుంచి మన యువనటుడు కిరణ్ అబ్బవరం దాకా... సదరు జర్నలిస్ట్ ప్రశ్నలోని డొల్లతనాన్ని లేకితనాన్ని ఎత్తిచూపారు.సరే... ఇప్పుడిప్పుడే ఆ సంగతి మరుగునపడుతోంది అనుకునేంతలో... తమిళ నాట మరోసారి మరో సినీ జర్నలిస్ట్ తన నోటికి పని కల్పించాడు. మార్గంకాలి, అనుగ్రహీతన్ అంటోనీ వంటి మళయాళ సినిమాల ద్వారా ప్రతిభావంతురాలైన యువనటిగా పేరు తెచ్చుకుంటున్న యువ కధానాయిక గౌరీ కిషన్(Gouri kishan) ను... తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మీ బరువు ఎంత? అంటూ ప్రశ్నించడం ద్వారా నోటికి ఉండే అన్ని హద్దులనూ చెరిపేశాడు. ఈ ప్రశ్నను ఎదుర్కున్న గౌరీ కిషన్ అదే సమావేశంలో సదరు జర్నలిస్ట్ను పట్టుకుని ఎదురు ప్రశ్నలతో ఉతికి ఆరేయడం వేరే సంగతి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఖుష్బూ, నటి రాధిక, గాయని చిన్మయి... వంటివారు గౌరీ కిషన్కు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు. ఆమె జర్నలిస్ట్ను ఉతికి ఆరేసిన తీరును ప్రత్యేకంగా శభాష్ అంటున్నారు.ఇప్పుడు ఇకనైనా సినిమా జర్నలిజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి ఈ మూడు సందర్భాల్లోనూ జర్నలిస్ట్లు వేసిన ప్రశ్నలు అత్యంత అసందర్భం, అసంబద్ధం అనేది నిస్సందేహం. అయినప్పటికీ అలా వారు అడగడం వెనుక పాప్యులారిటీ లేదా వైరల్ అవ్వాలనే దురాశ ఉండవచ్చునని అనిపిస్తోంది. వ్యక్తి దురాశ వ్యవస్థకు చేటు కాకూడదు. సినీ జర్నలిజం మొత్తానికి దీని వల్ల కలుగుతున్న, కలగబోతున్న నష్టాన్ని సీనియర్ పాత్రికేయులు, సినిమా పెద్దలు వెంటనే గుర్తించి తగిన మరమ్మతులు చేయడం తక్షణావసరంగా కనిపిస్తోంది. -
నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ!
మలయాళ నటి గౌరీకిషన్ (Gouri G Kishan)కు చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ అదర్స్. ఈ తమిళ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న ఆమెను ఓ జర్నలిస్టు అవమానకరమైన ప్రశ్నతో ఇబ్బందిపెట్టాడు. మీ బరువెంత? అని అడిగాడు. అది విని షాకైన గౌరీ కిషన్.. నా బరువుతో మీకేం అవసరం? ఇది చాలా చెత్త ప్రశ్న.. ఇలా అడగడం బాడీ షేమింగే అవుతుంది అని మండిపడింది. అది బాడీ షేమింగ్ కాదని జర్నలిస్ట్ వాదించాడు. అలా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది.హీరోను అడగ్గలరా?ఈ వ్యవహారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఘాటుగా స్పందించింది. జర్నలిజం విలువలు కోల్పోతోంది. కొందరు జర్నలిజాన్ని తప్పుగా వాడుతున్నారు. ఒకమ్మాయి బరువు గురించి వారికెందుకు? హీరోయిన్ను సూటిగా అడిగినప్పుడు మరి హీరో బరువు గురించి ఎందుకు అడగలేదు? ఇది నిజంగా సిగ్గుచేటు. యువ నటి గౌరీని ఈ విషయంలో అభినందించాల్సిందే! అభ్యంతరకర ప్రశ్న అడిగిన వ్యక్తికి అక్కడే ఇచ్చిపడేసింది. మీ ఇంట్లోవాళ్లను అడిగితే ఓకేనా?మేము ఎదురుతిరిగి మీ కుటుంబంలోని స్త్రీల గురించి అలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే మీకు ఓకేనా? ముందు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.. గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అని ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న పొరపాటు చేసింది. నటి గౌరీకిషన్ పేరుకు బదులుగా గౌరీ శంకర్ అని హ్యాష్ట్యాగ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు, మేడమ్, ఆమె గౌరీ శంకర్ కాదు.. గౌరీ కిషన్ అని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Dhanya Rajendran (@dhanyarajendran) Journalism has lost its ground. The so called journos take journalism to the gutters. How much a woman weighs is none of their business. And asking the hero about it?? What a shame! Kudos to the young #GowriShankar who stood her ground and gave it back. Are the same men ok if…— KhushbuSundar (@khushsundar) November 7, 2025చదవండి: ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి -
ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి
తమిళ సినిమా '96'తో తెలుగువారికి పరిచయమైన గౌరీ కిషన్(Gouri Kishan )కు మీడియా సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమా అదర్స్ ప్రమోషన్స్లో భాగంగా మూవీ యూనిట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే, ఈ సమావేశంలో తన బరువు గురించి అవమానకరమైన ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆపై తన ప్రశ్నను అతను సమర్థించుకునేందుకు ప్రయత్నం చేయడంతో గౌరీ కూడా ఫైర్ అయింది. దీంతో ఆమెకు నెటిజన్లు మద్ధతుగా నిలిచారు.తమిళ, మలయాళ చిత్రాలతో గౌరీ కిషన్ ఫుల్ బిజీగా ఉంది. అబిన్ హరికరణ్ దర్శకత్వంలో తను నటిస్తున్న కొత్త చిత్రం ‘అదర్స్’ త్వరలో విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రెస్మీట్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ ‘మీ బరువు ఎంత ఉంటుంది..?’ అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు గౌరీ అసహనం వ్యక్తం చేయడంతో ఆ జర్నలిస్ట్ కూడా తన ప్రశ్నను సమర్థించుకుంటూ మరోసారి అడిగాడు. ఈ ప్రశ్నకు గతంలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా సమాధానం చెప్పారని వాయిస్ పెంచాడు. నా బరువుతో మీకేంటి అవసరందీంతో గౌరీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 'నా బరువు గురించి నాతో చర్చించే హక్కు దర్శకుడికి ఉంది. కానీ, ఒక జర్నలిస్ట్గా మీకేంటి అవసరం..? స్త్రీ శరీరం చాలా సంక్లిష్టమైనది, హార్మోన్ల అసమతుల్యతతో ఉంటుంది. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలియకుండానే, నా బరువు గురించి అడగడానికి మీరు ఎవరు.. నా బరువు తెలుసుకొని మీరు ఏం చేస్తారు..? నా బరువు వల్ల సినిమాకు ఏమైనా నష్టం జరిగిందా..? ఇప్పటికి నేను చాలా సినిమాలు చేశాను. నా ప్రతిభ గురించి అడగండి. కనీసం ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల గురించి అడగరెందుకు..' అని ఆమె ఫైర్ అయింది. ఆ జర్నలిస్ట్ కూడా తన తప్పును తెలుసుకుని ఆమెకు వెంటనే క్షమాపణ చెప్పాడు. ఆమెను బాడీ షేమింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని గౌరీ కిషన్ చెప్పింది. తాను కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చానని తెలిపింది. కానీ, ఇలాంటి ప్రశ్నలు జర్నలిస్టిక్ నీతిని పాటించవని స్పష్టం చేసింది. ప్రెస్ మీట్ సందర్భంగా తనను ఇలా ఇబ్బంది పెట్టడం బాధ అనిపించినప్పటికీ వారి పట్ల తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆమె స్పష్టం చేసింది.96 సినిమా త్రిష చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించింది. ఇదే మూవీ తెలుగులో జాను పేరుతో విడుదలైంది. ఆమె ఇందులో కూడా నటించిది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది.நடிகையிடம் அநாகரிக கேள்வி எழுப்பிய யூடியூபர்.. தனி ஆளாக தரமான பதிலடி கொடுத்த நடிகை கௌரி கிஷன்....!#Polimer | #Chennai | #Actress | #Movie | #GouriGKishan pic.twitter.com/4qkQqGVYyw— Polimer News (@polimernews) November 6, 2025 -
నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్
సమాజంలో, ముఖ్యంగా సినీ సమాజంలో నటీ మణులు, హీరోయిన్లపై, శరీరాలపై అవమానకర (Bodyshaming) వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ (Gouri Kishan) శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్మీట్లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు?’ అని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది. నటిగా నా నటన గురించి అడిగాలి, సినిమా గురించి అడగాలి కానీ, నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది. పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఇది జర్నలిజం కాదు. వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయ్యింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద నటికి మద్దతుగా నిలిచారు. మహిళలపై ఆబ్జెక్టిఫికేషన్, బాడీ షేమింగ్కు అడ్డుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. గౌరీ కిషన్ తన రాబోయే చిత్రం 'అదర్స్' కోసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగికత గురించి చర్చకు దారితీసింది. గౌరీ స్పందనతో అక్కడే వున్న ఆదిత్య మాధవన్ మౌనం కూడా ఈ చర్చకు ఆజ్యం పోసింది.క్షమాపణలు కోరిన హీరోఅయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరీ సహనటుడు, నటుడు ఆదిత్య మాధవన్ దీనిపై స్పందిస్తూ అందరికీ క్షమాపణలు చెప్పారు. తన మౌనం బాడీ షేమ్ చేయడాన్ని ఆమోదించినట్టుకాదనీ, కానీ ఆ సందర్భంలో స్తంభించి పోవడంతో తన నోట మాట రాలేదంటూ చెప్పుకొచ్చాడు. అయినా తాను జోక్యం చేసుకుని ఉండి ఉంటే బాగుండు అన్నారు.చిన్మయి స్పందనగాయని చిన్మయి శ్రీపాద ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు."గౌరీ అద్భుతమైన పని చేసింది. అగౌరవకరమైన, అనవసరమైన ప్రశ్న అడిగిన క్షణం, అరుపులు, ఎదురుదెబ్బలు వినిపిస్తాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత ధైర్యంగా నిలబడినందుకు చాలా గర్వంగా ఉంది. ఏ పురుష నటుడిని కూడా బరువు గురించి అడగరు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.అటు పలువురు మహిళా జర్నలిస్టులు, పలువురు నెటిజన్లు గౌరీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. హీరో, దర్శకుడు అక్కడే ఉండి కూడా మౌనంగా ఉండటం ఇద్దరికీ సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌరీ కిషన్ తనదైన నటన, ప్రతిభతో హీరోయిన్గా రాణిస్తోంది తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.Thank you @Chinmayi Women like you inspire us to stand our ground. Your support means a lot to me, thank you. https://t.co/SbfN3eCyEp— Gouri G Kishan (@Gourayy) November 6, 2025


