-
Mental Health: మంచి మ్యూజిక్, యోగా, డాన్స్, స్విమ్మింగ్.. వీటితో ఒత్తిడి హుష్!!
ఇటీవలి కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి. మన శక్తి సామర్థ్యాల గురించి మనం ఉన్నదానికన్నా బాగా ఎక్కువగా లేదా బాగా తక్కువగా ఊహించుకోవడం... ఫలితంగా నిరాశకు గురికావడం, మన గురించి మనం ఆలోచించడం కన్నా ఇతరులలో తప్పులు ఎన్నడం, సమయానికి తిండి, నిద్ర లేకపోవడం, ఎక్కువగా పని చేస్తూ తీవ్రమైన అలసటకు గురికావడం ఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడి వల్ల మన నాడీవ్యవస్థలోనూ, నరాల్లోనూ రసాయనాల మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వల్ల రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్తో పాటు చక్కెర పాళ్లు పెరుగుతాయి. ఇది ఎక్కువయితే కుంగుబాటు లేదా డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. కనుక ఒత్తిడికి గురికాకుండా ముందే జాగ్రత్త పడటం, ఒత్తిడి ఎక్కువయినప్పుడు వాటినుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం అవసరం. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. ఇలా అధిగమిద్దాం.. ►ఒక విషయం గురించి ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అవతలి వారు చెప్పేదానిని వినడం, తక్కువ మాట్లాడటం మంచిది. ►విషయాలను మన కోణం నుంచి మాత్రమే కాకుండా ఎదుటి వారి కోణం నుంచి కూడా చూసి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ►మన భావోద్వేగాలను బలవంతంగా అణిచేసుకోకుండా సన్నిహితులతో పంచుకోవడం వల్ల ఒత్తిడిని దూరం పెట్టవచ్చు. ►దేనికి ఒత్తిడికి గురి అవుతున్నామో గమనించుకుని రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి. ►సానుకూల దృక్పథంతో ఉండటం, మనసుకు సంతోషాన్నిచ్చే పనులు చేయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది. ►మన ప్రవర్తనను ప్రభావితం చేసే ధూమపానానికీ, మద్యానికి, మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ►సంపాదనలో కనీసం పది శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యడం వల్ల కలిగే మానసిక తృప్తి ఒత్తిడికి గురి కాకుండా చేస్తుంది. ►నాకు వద్దు, నాకు రాదు, నాకు చేతకాదు అనే మాటలను చెప్పడం మానుకోవాలి. ►ఎప్పుడూ ఇంట్లోనే లేదా ఒక గదిలోనే కూర్చుండి పోవడం కన్నా బయటకు వెళ్లడం, స్నేహితులతో, బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం, సత్సంగం చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది. చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు.. మంచి మ్యూజిక్ వినడం, యోగా, ఇంకా.. ►ఇష్టమైన సంగీతం వినడం, పాటలు వింటూ కూనిరాగాలు తీయడం కూడా ఒత్తిడి తగ్గిస్తుంది. ►వారానికి ఒకసారి ఉపవాసం చేయడం, ఉదయం సూర్యోదయంలోని లేత కిరణాలు ఒంటికి తగిలేలా కూర్చోవడం; సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడడం మంచిది. ►మన ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ, సజావుగా కానీ పూర్తి కావని గుర్తించటం, నవ్వుతూ ఉండటం, ఈ ప్రపంచం అనే అందమైన ప్రకృతిలో మనమూ ఒక భాగమేనని గుర్తించటం, యోగ, ప్రాణాయామం చేయడం ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి. ►గాఢంగా ఊపిరి పీల్చి వదలడం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం... ►ప్రతి రోజు ఒక గంట ఏరోబిక్స్ లేదా టి.విలో చూస్తూ డాన్స్ చేయడం, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వాటిలో ఏదో ఒకటి క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండె , ఊపిరితిత్తులు, రక్తనాళాలు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. వ్యాయామంలో స్ట్రెస్ని కలిగించే హార్మోన్లు నశించి, మంచి హార్మోన్లు, ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. అవి ఒత్తిడిని దూరం చేస్తాయి. ►టెన్నిస్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు ఆడుతుండాలి. ►ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది. నాయకత్వపు లక్షణాలు అలవడతాయి. ►ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోవడం ఒత్తిడి నుంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. చివరగా ఒక్క విషయం... ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని మనం సర్దిచెప్పుకోవడం, పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! -
జానపదాల్లో శ్రావ్యమైన సంగీతం
సాక్షి, హైదరాబాద్: జానపద సంగీతనృత్యాల్లో శ్రావ్యమైన సంగీతం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు. కిన్నెర సంస్థ 36 వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్ జానపద సంగీత నృత్యోత్సవాలు ‘ఘంటసాల’ వేదికపై ఘనంగా ప్రారంభమయ్యాయి. జస్టిస్ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమాజాన్ని ప్రతిబింబించే అంశాలు జానపదాల్లో ఉండేవని, వాటిని అందరూ వల్లెవేసేవారని చెప్పారు. రాష్ట్రంలో ఐదు దశాబ్దాలుగా జానపద కళలు నిరాదరణకు గురయ్యాయని, ప్రభుత్వం పెద్దగా సాయం చేయకున్నా కిన్నెర వాటిని ప్రోత్సహిస్తోందని అన్నారు. నృత్యోత్సవాల్లో జానపద బ్రహ్మ పీవీ చలపతిరావు, మాపల్లె శంకర్ బృందాలు పాడిన జానపద గీతాలు శ్రోతలను అలరించాయి. విశ్రాంత డీజీపీ డాక్టర్ ఆర్.ప్రభాకరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణాచారి, ఆంధ్రా బ్యాంక్ జీఎం టీవీఎస్ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement