breaking news
good future
-
రగ్బీతో మంచి భవిత
గండవరం(కొడవలూరు): రగ్బీ ఆటలో నైపుణ్యాన్ని సంపాదిస్తే మంచి భవిష్యత్తు ఉందని ముం బైకు చెందిన రగ్బీ ఇండియా డెవలప్మెంట్ ఆఫీసర్ నోయల్ మాథ్యూస్ తెలిపారు. రగ్బీలో మూడు రోజుల శిక్షణ ఇచ్చేందుకు గానూ రగ్బీ ఇండియా జట్టు ప్లేయర్ వెంకట్తో కలిసి గురువారం గండవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. రగ్బీ ప్రాధాన్యంపై పాఠశాలలో నిర్వహిం చిన అవగాహన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు.రగ్బీ ఆట ఒలింపిక్స్లో కూడా ప్రవేశం సాధిం చిందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ ఆటపై మక్కువ కనబరుస్తున్నాయని చెప్పారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోతోందంటే అందులో తల్లిదండ్రులు పాత్ర ఎంతో ఉందన్నారు.అత్యధిక శాతంమంది తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడాకారులు కావాలని కోరుకోకపోవ డం కూడా దేశం క్రీడల్లో వెనుకబడటానికి కారణమన్నారు.శిక్షణకు మండలంనుంచే కాక సమీప ప్రాం తాల నుంచి 200 మంది విద్యార్థులు తరలివచ్చారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి రమేష్, హెచ్ఎం పద్మావతి, పీఈటీ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ ‘బంగారు తల్లి’
కలెక్టరేట్, న్యూస్లైన్: ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ఉద్దేశించిన ‘బంగారుతల్లి పథకాన్ని’ అర్హులైన వారందరికీ వర్తింపజేసేం దుకు సమష్టిగా కృషి చెయ్యాలని జి ల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరం లో ‘బంగారు తల్లి పోస్టర్’ను విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ యేడాది మే నెల నుంచి జిల్లా వ్యాప్తంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తోందన్నారు. ఇందుకుగాను వైధ్యులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికెట్తోపాటు, ఇతర ధృవపత్రాలతో దరఖాస్తులను అందజేయాలన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో పథకం అమలు జరుగుతుందని, ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే పథకాన్ని వర్తింపజెయ్యాలన్నారు. వైద్య సిబ్బంది నుంచి గర్బిణీల స్త్రీల వివరాలు, పుట్టిన ప్రతి బిడ్డ సమాచారాన్ని సేకరించి డిఆర్డిఏకు అందజేయాలన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు చదువుతోపాటు, వారికి ఉపాధి లభించేంత వరకు ప్రభుత్వసాయం అందుతుందన్నారు. పథకంపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అర్హులైన వారందరు వినియోగించుకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.చంద్రశేఖర్, డిపిఓ రవీందర్, డ్వామా పీడి వెంకటరమణ రెడ్డి, డిఆర్డిఏ పీడి చంద్రశేఖర్ రెడ్డి, ఐసిడిఎస్ పీడి ఇందిర, తదితరులు పాల్గొన్నారు.