25 ఏళ్ల తర్వాత ఖైదీ గోకరాజు నర్సరాజు ప్రత్యక్షం
గుంటూరు:గత కొన్ని సంవత్పరాలుగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఓ ఖైదీనీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గోకరాజు నర్సరాజు అనే వ్యక్తిని గోకరాజు పాలెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెరోల్ పై బయటకి వచ్చిన అతను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఓ వ్యక్తి తిరిగి ఇంటికి చేరాడన్న 'సాక్షి' కథనంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అతను గతంలో శిక్ష పడిన ఖైదీగా నిర్థారించుకున్నపోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను గతంలో చంచలగూడ జైల్లో 5 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. అనంతరం పెరోల్ పై బయటకి వచ్చి తప్పించుకుని తిరుగుతున్నాడు.