breaking news
God statues
-
మహత్యమా? మతలబా?
పెద్దకడబూరు : యాదృచ్ఛికమో, మరేదైనా మతలబు ఉందో తెలియదు కానీ ఆ గ్రామంలో విగ్రహాలు వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. మహత్తుతోనే విగ్రహాలు వెలుగు చూశాయని కొంద రు భావిస్తుండగా, అవి పురాతనమైనవి కాదని మరి కొందరి వాదన. ఏది ఏమైనా పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో అమ్మవారు, శివలింగ విగ్రహాల విషయం హాట్టాపిక్గా మారింది. గ్రామానికి చెందిన ఉప్పరి తిక్కయ్య, రామలింగమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు వెంకటేష్కు అప్పుడప్పుడు యల్లాగారి తాయమ్మవ్వ పూనకం వస్తుందట. అందులో భాగంగా గత గురువారం వారి పొలం గట్టులోని పుట్టలో శివ పార్వతుల విగ్రహాలు ఉన్నట్లు తెలిపారట. దీంతో వెంక టేష్ ఆ రోజు సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని పుట్టలో నుంచి తీసి పక్కనే ఉన్న గుడిసెలో పెట్టాడట. శివలింగాన్ని తీయడానికి చేతగాక పుట్టలోనే వదిలేశాడట. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు నాలుగు రోజుల పాటు సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గ్రామస్తులు గమనించి చెప్పడంతో సోమవారం కొందరు వచ్చి దర్శించుకొని వెళ్లారు. గ్రామానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి విగ్రహాలను చూడడానికి రాగా ఆమెకు కూడా పూనకం వచ్చిందని, వచ్చే ఏకాదశి రోజున శివలింగాన్ని తీయాలని, అది కూడా వెంకటేష్ మాత్రమే తీయాలని సెలవిచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం ఆనోటా ఈనోటా పడడంతో మంగళవారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన పెద్దతుంబళం, కామవరం, కోసిగి, నౌలేకల్లు తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో జనాలు వచ్చి విగ్రహాలకు పూజలు చేశా రు. సాయంత్రం ఈ విగ్రహాలను ఆదోని తహసీల్దార్ శ్రీనాథ్, వీఆర్వో శ్రీనివాసులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం కర్నూలుకు తరలించారు. కొసమెరుపు: పుట్టలో నుంచి తీయడం తనవల్ల కాలే దని వెంకటేష్ చెబుతున్న శివలింగాన్ని అధికారులు సులభంగా తీసుకుని కర్నూలుకు తరలించారు. -
విగ్రహాలను పెకిలించిన దుండగులు
► గుప్తనిధులకోసం పెకిలించి ఉంటారని ఆరోపణ ► సంఘటన స్థలాన్ని పరిశీలించిన ముగ్గురు ఎస్ఐలు శాంతినగర్ : గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహాలను పెకిలించారు. ఈ సంఘటన వడ్డేపల్లి మండలం తనగల గట్టులో చోటుచేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తనగల గట్టుపై వెలసి న తిమ్మప్ప స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఆలయ పూజారి పాండురంగయ్య ఎప్పటిలాగే శనివారం సాయంత్రం స్వామివారి ఆలయాన్ని మూసి తాళాలువేసి వెంకటాపురం చేరుకున్నాడు. బుధవారం పౌర్ణమి కావడంతో ఉదయం వెంకటాపురం భక్తులు కృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి పూజలు చేద్దామని పూజారితో ఆలయాన్ని చేరుకున్నారు. వారు వెళ్లేలోగా ఆలయం తలుపులు తెరుచుకుని ఉన్నాయి. స్వామివారి మూల విరాఠ్ (పుట్టుశిల), వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని పెకిలించారు. వెంటనే అయిజ ఎస్ఐ రమేష్కు, సర్పంచ్ సత్యమ్మవేణుగోపాల్రెడ్డికి సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న తనగల సర్పంచ్ వాణిదివాకర్రెడ్డి శాంతినగర్ ఎస్ఐ జి.వెంకటేశ్వర్లకు జరిగిన సంఘటనను వివరించారు. దీంతో స్పందిం చిన అయిజ, శాంతినగర్, రాజోలి ఎస్ఐ జయశంకర్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గట్టుపై ఆలయ సమీపంలో మద్యం సీసాలు, అల్పాహారాలు పడి ఉండటం, నాలుగు అడుగులమేర విగ్రహాల క్రింద తవ్వడం చూసిన పోలీసులు రాత్రి సుమారు ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు మద్యంతాగి విగ్రహాలను ధ్వంసం చేసి ఉంటారన్నారు. ఆలయ పూజారులు పాండురంగయ్య, వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్కానిస్టేబుల్ రామనాయుడు పేర్కొన్నారు.