-
భారత్ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్
ముంబై: అంతర్జాతీయ కారణాలతో చమురు ధరల్లో పెరుగుదలసహా ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి) భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం, 7 శాతం వృద్ధి ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక ఎకనమిక్ కన్క్లేవ్లో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్ల తగ్గుదలకు ముందు ఆర్థిక క్రియాశీలత నెమ్మదిస్తుందన్నది తన అభిప్రాయమని అన్నారు. -
రుణగ్రస్తుల ఆశలపై ఆర్బీఐ నీళ్లు?
రుణ గ్రస్తులు ఎంతో ఆతృగా ఎదురు చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష అక్టోబర్ 4- 6 తేదిల్లో జరగనుంది. సాధారణంగా ఆర్బీఐ ఎంపీసీ సమావేశం అంటే ప్రధానంగా వడ్డీ రేట్లు పెంపు, తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మరో రెండ్రోజుల్లో జరిగే ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని సమాచారం. 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో వివిధ దశల్లో ఆర్బీఐ రెపోరేటును 2.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఆ తర్వాత వరుసగా రెపో రేట్లను యథాతదంగా కొనసాగిస్తూ వచ్చింది. దీంతో రిటైల్, గృహ, వాహన రుణాలు ప్రియమయ్యాయి. రుణ గ్రహీతలపై భారం పడింది. ఈ తరుణంలో వచ్చే సమీక్షాలోనూ ఆర్బీఐ ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని రుణగ్రస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంది. -
యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేలమందికి ఉద్వాసన
సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఐటీ కంపెనీలను భారీగా ప్రభావితం చేస్తోంది. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ కూడా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తోంది. కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అటు వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. ఈ మేరకు కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు. తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. సగానికి పైగా తొలగింపులు నాన్ బిల్ కార్పొరేట్ ఫంక్షన్ల సిబ్బందిని ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. మరోవైపు యాక్సెంచర్ తమ వార్షిక రాబడి వృద్ధిని కూడా కుదించుకుంది. గతంలో అంచనా వేసిన 8-11 శాతంతో పోలిస్తే 8-10శాతం మధ్య ఉంటుందని భావిస్తోంది. (ఇదీ చదవండి: ట్యాక్స్పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ముఖ్యంగా వ్యూహాత్మక వృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు నిమిత్తం నియామకాలను కొనసాగిస్తున్న క్రమంలో తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి , ఖర్చులను తగ్గించడానికి ఈ చర్యలను ప్రారంభించామని రాబోయే 18 నెలల్లో ఉద్యోగుల కోతలుంటాయని తెలిపింది. అంతేకాదు గతంలో 11.20 -11.52 డాలర్లతో పోలిస్తే ఒక్కో షేరుకు సంపాదన10.84-11.06 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. (సీఈవో సుందర్ పిచాయ్కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ కేవలం రూ. 1,999కే) -
ఎకానమీ సవాళ్లను పరిష్కరించాలి!
బెంగళూరు: అంతర్జాతీయ ఆర్థిక అవుట్లుక్ ఇటీవలి నెలల్లో మెరుగుపడినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు, ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను దృఢ సంకల్పంతో పరిష్కరించాలని కూడా జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీబీసీ) ప్రారంభ సమావేశంలో దాస్ చేసిన ప్రసంగ ముఖ్యాంశాలు.. ► ప్రపంచం తీవ్ర మాంద్యం నుండి తప్పించుకోవచ్చని, వృద్ధి మందగమనం లేదా అంతగా తీవ్రత లేని మాంద్యం పరిస్థితులే సంభవించవచ్చని ఇప్పుడు గొప్ప ఆశావాదం ఉంది. అయితే, ఇంకా అనిశ్చిత పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ►మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను మనం కలిసికట్టుగా దృఢంగా పరిష్కరించాలి. ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు, రుణ ఇబ్బందులు, క్లైమాట్ ఫైనాన్స్, వాణిజ్య రంగంలో పరస్పర సహకారం లోపించడం, గ్లోబల్ సరఫరాల సమస్యలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పటిష్ట ప్రపంచ ఆర్థిక సహకారంతో ప్రపంచ వృద్ధి విస్తృత స్థాయిలో మెరుగుపరచడం సాధ్యమవుతుంది. ► జీ20 గ్రూప్ ప్రస్తుతం పరివర్తన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి జీ20 ఒక బహుపాక్షిక ఫోరమ్గా అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. -
పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో పతనం.. శ్రీలంక సీన్ రిపీట్!
ఇస్లామాబాద్: దాయాది దేశంలో పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ కరెన్సీ(రూపాయి) విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. రూపాయి విలువ గురువారం డాలర్కు 255 రూపాయలకు పడిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కేవలం ఒక్కరోజులోనే 24 రూపాయలు పతనమైనట్లు తెలిపాయి. ఇక, బుధవారం పాక్ కరెన్సీ విలువ రూ. 230.89గా ఉండగా.. అది గురువారానికి రికార్డు స్థాయిలో పతనమైంది. అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు పాక్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరెన్సీ మారకపు రేటు నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీంతో, కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. మరోవైపు.. కరెన్సీపై పాక్ ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించాలని, రూపాయి మారకపు విలువను మార్కెట్ నిర్ణయించేలా చూడాలని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) పాకిస్తాన్ను కోరింది. ఈ క్రమంలోనే ఐఎంఎఫ్ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్ వెంటనే ఈ నిబంధనకు అంగీకారం తెలిపింది. ఇదిలా ఉండగా.. 2019లోనే పాకిస్తాన్కు సాయం అందించేందుకు ఐఎంఎఫ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కానీ, 6.5 బిలియన్ డాలర్ల సాయం విషయంలో కొన్ని షరతులు విధించింది. పాక్కు నిధులు ఇవ్వాలంంటే కరెంట్స్ సబ్సిడీలను ఉపసహరించుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. అలాగే, పాక్ రూపాయి మారక విలువను మార్కెట్ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్ ఆఫ్ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్ కండీషన్స్ పెట్టింది. అయితే, ఈ షరతులకు అప్పటో పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీంతో, ఆర్థిక సాయం నిలిచింది. తాజా పరిస్థితుల్లో ఆర్థిక సాయం తప్పనిసరి కావడంతో పాక్ ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సంక్షోభం నెలకొనగా, ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక ప్యాకెట్ పిండి రూ.3వేల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. అంతే కాకుండా పాకిస్తానీలు ఆహార ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విదేశీ మారక నిల్వల తగ్గిపోవడంతో ఇంధన కొరతకు దారి తీసింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద దారి పొడవునా వాహనదారులు బారులుతీరారు. పొదుపు చర్యలే శరణమంటున్న పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత పెట్టింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. గ్యాస్, విద్యుత్ ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. నిఘా సంస్థలకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేయరాదని తీర్మానించింది. చమురు దిగుమతులు గుదిబండగా మారిన నేపథ్యంలో అన్ని స్ధాయిల్లో పెట్రోల్ వాడకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement