breaking news
ghoshal
-
రివైజ్డ్ డిజైన్లు ఇవ్వకనే బరాజ్కు నష్టం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ను తొలిసారి 2019లో నీళ్లతో నింపారని, అదే ఏడాది బరాజ్కు నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణరాజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు వెల్లడించారు. బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ పూర్తిగా ధ్వంసమైనట్టు గుర్తించి, నీటిపారుదల శాఖకు నివేదించామని వివరించారు. బరాజ్లో లోపాలను సరిదిద్దేందుకు రివైజ్డ్ డిజైన్లు, డ్రాయింగ్స్ను నీటిపారుదల శాఖ అందించలేదని, దీంతో సమస్య పెరిగి 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగిపోయిందని పేర్కొన్నారు. ముందే రివైజ్డ్ డిజైన్లు ఇచ్చి ఉంటే బరాజ్ను రక్షించుకోవడానికి అవకాశం ఉండేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ప్రతినిధులకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. డిజైన్లతో మాకు సంబంధం ఉండదు.. ‘‘మేడిగడ్డ, ఇతర బరాజ్లలో 2019లో ఒకే తరహా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఇంజనీర్ల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబోరేటరీస్ (టీఎస్ఈఆర్ఎల్)తో మళ్లీ మోడల్ స్టడీస్ నిర్వహించాలని క్షేత్రస్థాయిలోని ఈఈ పైఅధికారులకు లేఖ రాశారు. 2020 జూన్లో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు, సీడీఓ ఇంజనీర్లు బరాజ్లను పరిశీలించారు. బరాజ్ రక్షణ కోసం ఎనర్జీ డిస్సిపేషన్ పనుల డిజైన్లను రూపొందించాలని 2020 ఫిబ్రవరిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ.. సీడీఓ సీఈను ఆదేశించారు.టీఎస్ఈఆర్ఎల్ నిర్వహించిన 2డీ మోడల్ స్టడీస్ ఆధారంగా.. బరాజ్ దిగువన తగిన రీతిలో ఎనర్జీ డిస్సిపేషన్ ఏర్పాట్లు చేసేందుకు డిజైన్లను అందించాలని 2021 మార్చిలో కోరారు. రిటైర్డ్ ఈఎన్సీలతో కూడిన నిపుణుల కమిటీ 2022 మార్చిలో బరాజ్లను సందర్శించి షూటింగ్ వెలాసిటీని తగ్గించాలని సూచించింది. కానీ రివైజ్డ్ డిజైన్లు అందించకపోవడంతో బరాజ్ కుంగింది’’అని కమిషన్కు ఎంవీ రామకృష్ణరాజు వివరించారు. పీస్ రేటు కాంట్రాక్టు విధానంలో పనులు దక్కించుకున్న తమకు డిజైన్ల తయారీతో సంబంధం ఉండదని తెలిపారు. గడువులోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉన్నా నాణ్యతలో రాజీపడలేదని పేర్కొన్నారు.విజిలెన్స్ విభాగం బరాజ్ నుంచి 90 కాంక్రీట్ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తే.. ప్రమాణాలకు మించిన నాణ్యత ఉన్నట్టు తేలిందని వివరించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో లోపాలపై కమిషన్కు అఫిడవిట్ దాఖలు చేసిన ‘ఎల్ అండ్ టీ’మాజీ ఉన్నతాధికారి అమర్పాల్ సింగ్ వ్యవహారంపై స్పందించేందుకు ఎంవీ రామకృష్ణరాజు నిరాకరించారు.మరో ఇద్దరు ప్రతినిధుల క్రాస్ ఎగ్జామినేషన్లో.. ⇒ బరాజ్ గేట్ల నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో దిగువన నేలను తాకుతుందనే అంచనాలతో నీటి పారుదల శాఖ (సీడీఓ) డిజైన్లను రూపొందించగా.. వాస్తవ వేగం సెకనుకు 16 మీటర్లుగా ఉందని, డిజైన్లలో లోపాలున్నాయని ఐఐటీ రూర్కీ అధ్యయనంలో తేలిందని ‘ఎల్ అండ్ టీ’హైడల్ ప్రాజెక్టు విభాగం ఉపాధ్యక్షుడు ఎస్.సురేశ్కుమార్ కమిషన్కు వివరించారు.⇒ ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రామరాజు బరాజ్ను సందర్శించి 2022 వర్షాకాలానికి ముందే షూటింగ్ వెలాసిటీని తగ్గించే ఏర్పాట్లు చేయాలని, లేకుంటే బరాజ్ దెబ్బతింటుందని హెచ్చరించారని కమిషన్కు ‘ఎల్ అండ్ టీ’డీజీఎం రజనీష్ పి.చౌహాన్ తెలిపారు. 7వ బ్లాక్కు మరమ్మతులు సాధ్యం కాదని, పూర్తిగా పునర్నిర్మించక తప్పదని పేర్కొన్నట్టు తెలిసింది. -
Srikrishna Janmashtami: శ్రీకృష్ణ చెలిమి.. శ్రీనివాస కలిమి
భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో శ్రీకృష్ణ భగవానుడికి, ఆవులకు మధ్య విడదీయలేని దైవిక బంధం ఉంది. కలియుగంలో పుట్టలోని శ్రీనివాసుడికి ప్రతి రోజూ గోమాత పాలు ఇచ్చి సంరక్షించడం తెలిసిందే. అందుకే గోవుకు హిందూ ధర్మంలో ఎనలేని ప్రాముఖ్యత. అలాంటి గోమాత సంరక్షణకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఉన్న గోవుల ద్వారా వచ్చే పాలను తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిత్య పూజలు, అభిషేకాలకు, నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. టీటీడీ పరిధిలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ రూపంలో అందిస్తుండడం విశేషం. నేడు గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. తిరుపతి రూరల్: దేశం నలుమూలల నుంచి వచ్చే గోమాతలకు ఆయా పరిస్థితులకు అనుగుణమైన వాతావరణం.. అత్యాధునిక సౌకర్యాలు.. ఆరోగ్య పరిరక్షణకు నిత్యం అందుబాటులో ఉండే పశువైద్యాధికారులు.. అపరిశుభ్రతకు తావు లేకుండా పరిరక్షించే కాపర్లు.. ఆరోగ్యానికి బలవర్థకమైన దాణాతో కూడిన మేత.. టీటీడీ ఆధ్వర్యంలో 2002లో ప్రారంభమైన శ్రీవెంకటేశ్వరస్వామి గోసంరక్షణశాల సకల దేవతలకు నిలయంగా విరాజిల్లుతోంది. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ తిరుమల, తిరుపతి, తిరుచానూరుతో పాటు పలమనేరులోనూ అతిపెద్ద గోసంరక్షణశాలలను నిర్వహిస్తోంది. దాదాపు 4,279 పైగా పశువులను ఇక్కడ సంరక్షిస్తుండడం విశేషం. శుభ్రమైన వాతావరణంలో దేశీయ గోవుల సంరక్షణ రోజూ 628 లీటర్ల పాల ఉత్పత్తి తిరుమలలోని ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో నిత్య పూజలు, సేవలు, అభిషేకాలు, నైవేద్యాలతో పాటు విద్యాసంస్థల అవసరాల కోసం ప్రతి రోజూ 3వేల లీటర్ల పాలు అవసరం. ఇందుకు దాదాపు 500 గోవులు అవసరం కాగా.. భక్తుల నుంచి దానంగా సేకరించేందుకు టీటీడీ పిలుపునిచ్చింది. ఆ మేరకు గత మూడు నెలల్లో 130 గోవులు దానంగా లభించాయి. వీటి ద్వారా రోజూ 428 లీటర్లు, గోశాలలోని మిగిలిన గోవుల నుంచి 200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీవారి నిత్య కైంకర్యాలకు అవసరమైన దేశవాళీ ఆవు నెయ్యి కోసం గోశాలలో అత్యాధునిక ఆవు నెయ్యి తయారీ కేంద్రం, ఎస్వీ పశువైద్య వర్సిటీ సహకారంతో పశుదాణా తయారీ కర్మాగారం నిర్మిస్తోంది. ఎస్వీ వెటర్నరీ వర్సిటీతో ఒప్పందం చేసుకుని పిండ మార్పిడి విధానం ద్వారా గోశాలలోని ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగిన గోవులలో మేలురకపు గో జాతిని ఉత్పత్తి చేస్తున్నారు. టీటీడీ గోదానం అధిక పాల దిగుబడి కోసం భక్తుల నుంచి గోవులను సేకరిస్తున్న టీటీడీ మరోవైపు గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ప్రతి అలయానికి గోవు, దూడను వితరణ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 193 ఆలయాలకు ఆవు, దూడలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఉచితంగా అందించింది. అంతేకాకుండా గోశాలలో పరిమితికి మించి ఉన్న, రైతులకు ఉపయోగపడే గోవులను, ఆంబోతులను అందించి గో ఆధారిత ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు 2,018 ఆవులను, ఆంబోతులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి రోజూ స్వయంగా భక్తులే గోదర్శనం, గోపూజ చేసుకుని, గోవులకు మేత అందించేందుకు అలిపిరి, తిరుపతి గోశాలలో గో ప్రదక్షిణ మందిరాలను నిర్మించారు. వీటికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతి ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ఏర్పాట్లు గోశాలలో నేడు గోకులాష్టమి వేడుకలు శ్రీకృష్ణుని పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ పరిధిలోని ఎస్వీ గోశాలల్లో గోకులాష్టమి వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు, అధికారులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. గోవుకు విశేష పూజలు చేయనున్నారు. అనంతరం గోవులను అందంగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. అనుగుణమైన వసతులు ఎస్వీ గోశాలలో గోసంరక్షణకు టీటీడీ అత్యాధునిక వసతులను కల్పిస్తోంది. గోసంరక్షణ ట్రస్ట్కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి గోవులను భక్తులు దానం చేస్తుంటారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఏర్పాట్లను తీర్చిదిద్దుతున్నారు. ►ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే గోవులకు అనుగుణంగా ఇసుక తిన్నెలను పరుస్తున్నారు. ►గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా షెడ్ల నిర్మాణం. ►పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ సిమెంట్ ఫ్లోరింగ్ ►పశువులకు మధ్యాహ్నం పూట కూడా నీడనిచ్చేందుకు చెట్ల పెంపకం ►గిట్టల వాపు రాకుండా మెత్తటి ఇసుక బెడ్ల ఏర్పాటు ►గోవుల జాతికి అనుగుణంగా సౌకర్యాల కల్పన ఎస్వీ గోశాల విస్తీర్ణం(తిరుపతి): 69 ఎకరాలు మొత్తం పశువులు:1,868 గుడికో గోమాత పథకం కింద ఆవు, దూడలను పొందిన ఆలయాలు: 193 గో ఆధారిత ప్రకృతి సేద్యానికి ఉచితంగా అందించిన గోవులు, ఆంబోతులు:2,018 రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నోడల్ గోశాలలు: 26 -
ఆవును సంరక్షించడంతో నా జీవితం మలుపు తిరిగింది
‘గంగి గోవు పాలు గరిటెడైనను చాలు..’ అంటూ వేమన శ్రేష్టమైన ఆవు పాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. నాటు (దేశీ జాతి) ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి సర్వోత్తమమైనవన్న భావన ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. వీటినే ‘ఎ2 మిల్క్’ అని పిలుస్తూ.. అనేక దేశాల్లో అమృతసమానంగా చూస్తున్నారు. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఎ2 పాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు ఆర్గానిక్ పాల ఉత్పత్తిని పెంపొందించి, ఎ2 పాల ఉత్పత్తులను ‘ఏపీ గోపుష్టి’ పేరుతో దేశ విదేశాల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. నాటు ఆవుల సంతతిపై అవ్యాజమైన ప్రేమతో, అనురక్తితో ‘సురభి గోశాల’ ను నిర్వహిస్తున్న వల్లూరు రవికుమార్ ఈ పథకానికి సలహాదారుగా నియమితులయ్యారు. నాటు ఆవు పాల ఉత్పత్తితో పాటు శాస్త్రీయ పద్ధతిలో సంతతిని పెంపొందించుకునే పద్ధతులపై తన సుసంపన్నమైన అనుభవాలను ఆయన ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు. దేశీ ఆవుల్లో కొన్నే ‘గంగి గోవుల’ని ఆయన సూత్రీకరిస్తున్నారు.. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వల్లూరు రవి కుమార్(47) హైదరాబాద్లో ఓ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు. ఒక రోజు తమ ఇంటి ఎదుట ఒక నాటు ఆవుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ ఆవును సంరక్షించి సపర్యలు చేయడంతో రవి జీవితం మలుపు తిరిగింది. తదనంతరం గుజరాత్లోని తోడల్లుడి దగ్గరకు వెళ్లినప్పుడు దేశీ గోజాతుల గురించి మరింత ఆసక్తి కలిగింది. దేశీ గోజాతుల సంరక్షణకు రవి కృషి అనుకోకుండా అలా ఆరంభమైంది. ఏడేళ్ల క్రితం ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వగ్రామం పేరికలపాడులో ‘సురభి గోశాల’ను రవి 4 ఆవులతో ప్రారంభించారు. 21 ఎకరాలు.. 125 ఆవులు.. సురభి గోశాలలో ఇప్పుడు 125 ఆవులు, ఆంబోతులు ఉన్నాయి అనే కంటే.. వాటితో రవి పూర్తిగా మమేకమై అనుదిన జీవనాన్ని పంచుకుంటున్నారు అంటే బావుంటుంది. 2.35 ఎకరాల్లో షెడ్లున్నాయి. వివిధ జాతుల గోవులు, ఆంబోతులకు అందులో వేర్వేరుగా ప్రత్యేక ఆవాస విభాగాలున్నాయి. పక్కనే ఉన్న 6 ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డి పెంచుతున్నారు. 45 రోజులకోసారి కోస్తూ నిరంతరం పచ్చి గడ్డి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఆవుల పేడను గుంతలో వేసి, చివికిన తర్వాత పొలాల్లో వేస్తున్నారు. గోమూత్రం బక్కెట్లతో పట్టుకుంటేనే స్వచ్ఛత, ఔషధ గుణాలు చెడకుండా ఉంటాయని రవి అన్నారు. వరి గడ్డి కొని మేపుతున్నారు. 60% పచ్చిమేత, 40ఋ% ఎండుమేత ఉండేలా చాప్ కట్టర్తో ముక్కలు చేసి రెండూ కలిపి ఆవులకు పెడుతున్నారు. పదెకరాల్లో సజ్జలు, పచ్చజొన్న, జె7 జొన్న, 3 ఎకరాల్లో పుల్ల శనగ, 3 ఎకరాల్లో వేరుశనగ పండించి.. దాణాకు వాడుతున్నారు. గిర్ జాతి ఆవులు ఎక్కువ సంఖ్యలో 79తోపాటు 7 ఆంబోతులు ఉన్నాయి. కాంక్రేజ్ ఆవులు 18, ఆంబోతులు 2 ఉన్నాయి. పుంగనూరు ఆవులు 3, ఒక ఆంబోతు ఉంది. రెడ్ సింధి ఆవులు 3, థార్పార్కర్ ఆవులు 3, ఒక ఆంబోతు ఉన్నాయి. 3 ఒంగోలు ఆవులు ఉన్నాయి. 115 ఆవుల్లో ఏ సీజన్లో అయినా కనీసం 30 ఆవులు పాలు ఇస్తూ ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా చూడి కట్టించడం చేస్తున్నామని రవి కుమార్ తెలిపారు. 15 చూడితో ఉంటాయి. 30 దూడలు (మూడేళ్ల లోపు) ఉంటాయి. వత్తిడి లేని గోపాలన నాటు ఆవుల పెంపకం పాల దిగుబడి వరకే పరిమితం చేసుకోకుండా దేశీ గో జాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం రవి ప్రత్యేకత. వత్తిడి లేని గోపాలన పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారు. ఆవులను వేరే ప్రాంతం నుంచి కొని తెచ్చిన తర్వాత కొత్త మనుషులకు అలవాటు పడటానికి కనీసం 15 రోజులు పడుతుంది. రైతు స్వయంగా రోజుకు కనీసం 4–5 గంటల పాటైనా ఆవులతో మమేకం అవ్వాలి. ప్రతి ఆవుకు పేరు పెట్టాలి. ఆ పేరుతోనే పిలుస్తూ గంగడోలు సవరిస్తూ ఉంటే.. కొద్ది రోజుల్లోనే నాటు ఆవులు మచ్చిక అవుతాయి. వత్తిడి నుంచి బయటపడతాయి. ఆవులను ప్రేమగా నిమరాలి. రోజూ నిమిరే వ్యక్తిని గుర్తు పెట్టుకొని.. పేరుతో పిలవగానే పరుగెత్తుకుంటూ దగ్గరకు వస్తాయని రవి తెలిపారు. ఈ అనుబంధం ఏర్పరచుకుంటే ఆవులు వత్తిడికి గురికాకుండా.. సౌమ్యంగా, ఆనందంగా ఉంటూ అధిక పాల దిగుబడినిస్తాయన్నారు. ఫ్రీ లోఫింగ్ సిస్టం జన్యు స్వచ్ఛతను పరిరక్షించుకోవడానికి ‘ఫ్రీ లోఫింగ్ సిస్టమ్’ను రవి అనుసరిస్తున్నారు. కట్టేసి మేపరు. అన్నిటినీ కలిపి ఆరు బయట తిరగనివ్వరు. అలా తిరగనిస్తే రక్త సంబంధం ఉండే ఆవులను ఆంబోతులు ‘దాటే’ అవకాశం ఉంటుంది. దాని వల్ల ‘ఇన్బ్రీడింగ్’ జరిగి, జన్యు స్వచ్ఛత తగ్గిపోతుంది. పిడిగ్రీ నియమాలు ఇందుకు అనుమతించవు. అంటే.. ఏ జాతికి ఆ జాతిని వేర్వేరుగా ప్రత్యేక దొడ్ల(ఎన్క్లోజర్)లో ఉంచుతున్నారు. పాలిచ్చే ఆవులు, 7 నెలలు నిండిన చూడి ఆవులు, 9 నెలల లోపు దూడలు, మూడేళ్ల లోపు దూడలు, ఆంబోతులు.. ఇలా విభజించి వేర్వేరు విభాగాల్లో ఉంచుతున్నారు. ప్రతి ఆవుకు 15 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా 65“60 అడుగుల విస్తీర్ణంలో దొడ్లను నిర్మించారు. నీడనిచ్చే షెడ్తో పాటు ఎండ తగిలే ఖాళీ ప్రదేశం కూడా ఈ దొడ్డిలో ఉంటుంది. ఆవు తన ఇష్టం మేరకు ఎండలో, నీడలో బంధించినట్లు లేకుండా తిరుగాడుతూ స్వేచ్ఛగా ఉండటం వల్ల వత్తిడి ఉండదు. 4 ఏళ్లుగా పిడిగ్రీ నమోదు రవి ఏడేళ్లుగా సురభి గోశాలను నిర్వహిస్తున్నారు. అనేక విషయాల్లో అనుభవం గడించిన తర్వాత దేశీ గోజాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ఉపక్రమించారు. గత నాలుగేళ్లుగా పిడిగ్రీ(జన్యు వంశకత)ని నమోదు చేస్తున్నారు. ప్రతి ఆవు, ఆంబోతు తల్లిదండ్రులు ఎవరు? వాటి లక్షణాలు, పాల ఉత్పత్తి సామర్థ్యం తదితర వివరాలను, వాటి ఫోటోలను శాస్త్రీయంగా నమోదు చేసి, కంప్యూటరీకరిస్తున్నారు. దేశీ గోజాతుల బ్రీడింగ్లోను, నాణ్యమైన పాల ఉత్పత్తిలోనూ రవి కుమార్ సాధించిన విజయం అసామాన్యం. పట్టుదల, శ్రద్ధ రవిని ఎ2 డెయిరీ రంగంలో విజయ తీరాలకు నడిపించాయి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ దూడలే రైతుకు ఆస్తి దేశీ గోజాతులను పెంచే రైతులకు దూడలే పెద్ద ఆస్తి అని రవి భావిస్తున్నారు. పిడిగ్రీ ప్రకారం, పోషణ లోపం లేకుండా పెంచితే మూడేళ్ల పెయ్య దూడ ఒక్కోటి రూ. లక్షకు అమ్ముడు పోతుందని, అదే రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తుందని ఆయన స్వానుభవంతో చెబుతున్నారు. దూడకు ఒకటి లేదా రెండు రొమ్ముల పాలు పూర్తిగా వదిలెయ్యాలి. ఒక నెల అటు వైపు రొమ్ములు, మరో నెల ఇటు వైపు రొమ్ములు దూడకు అలవాటు చెయ్యాలి. 3 నెలల తర్వాత దూడ పాలు తాగటం తగ్గిస్తుంది. 6వ నెల నుంచి రోజుకు కిలో దాణా పెట్టాలి. ఆవు లేదా దూడ ఆరోగ్యం ఎలా ఉందో వాటిని, పేడను చూసి తెలుసుకోగలిగే అవగాహన రైతుకు ఉండాలి. టీకాలు షెడ్యూలు ప్రకారం వేసుకుంటూ.. మూడేళ్ల వరకు దూడలను కనిపెట్టుకొని ఉండాలి. ఈనిన తర్వాత 90 రోజుల్లో ఆవును కట్టించాలి. ఏడాదికో దూడ పుట్టాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే డెయిరీ రంగంలో నష్టాలకు ఆస్కారమే ఉండదు. గంగి గోవు నెయ్యిలో ‘కెరోటిని’ 3.2% రోజుకు 240 లీటర్ల పాల దిగుబడి వస్తోంది. ఉదయం పూట పాలను విజయవాడలో ఇంటింటికీ (లీ. రూ. వంద) పంపుతున్నారు. సాయంత్రం పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయ బద్ధంగా వెన్న తీస్తారు. 40 డిగ్రీలకు మించని వేడితో కాచి నాణ్యమైన నెయ్యినిæతయారు చేస్తున్నారు (కిలో రూ. 2,700 – 3 వేలు). ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. నిబంధనల మేరకు 3 నెలలకోసారి పాలు, నెయ్యిలకు లాబ్ పరీక్షలు చేయిస్తారు. పాలలో ఎస్.ఎన్.ఎఫ్. 8–8.5%, కొవ్వు 4–4.5% వస్తుంటాయి. నెయ్యిలో ఇతర పౌష్టికాంశాలతో పాటు ‘కెరోటిని’ 3.2% ఉంటుంది. మనిషి దేహానికి విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా సమకూరేందుకు ఇది దోహపడుతుంది. ఇది గంగి గోవు నెయ్యిలోనే ఉంటుంది. గేదె నెయ్యిలో ఉండదు అన్నారు రవి. మజ్జిగను దూడలకు కుడితిలో పోస్తారు. పుల్ల మజ్జిగను పంటలపై అవసరం ఉన్నప్పుడు పిచికారీ చేస్తారు. ఆవుతో రోజూ మాట్టాడాలి! నాటు ఆవులు సున్నితంగా ఉంటాయి. కొట్టకూడదు. ముల్లుగర్రతో పొడవ కూడదు. తిట్ట కూడదు. ముక్కుతాడు, సిగమారు వెయ్యకూడదు. రైతు రోజూ 4–5 గంటలు ఆవులతో ఉండాలి. పేరుతో పిలుస్తూ ప్రతి రోజూ కొద్ది నిమిషాలు నిమరాలి. ఆవులతో మమేకం కాగలగాలి. మేత కన్నా ఈ ప్రేమ ముఖ్యం. ఇలా చేస్తుంటే ఆవుపై వత్తిడి ఉండదు. పాల దిగుబడి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలూ పెద్దగా రావు. కష్టపడే తత్వం ఉన్న రైతుకు నాటు ఆవుల గోశాల సంతృప్తిని, లాభాలను అందిస్తుంది. ఏ పేరు గల ఆవు ఎప్పుడు చూడి కట్టింది, ఏ రోజు ఎంత పాలిచ్చింది, ఆరోగ్య స్థితిగతులు.. అన్నీ రైతు స్వయంగా రోజూ డైరీలో రాసుకోవాలి. దానికి అనుగుణంగా ఏయే మార్పులు, చేర్పులు చేసుకోవాలో అర్థమవుతుంది. ఆవు ఆరోగ్య రక్షణ, మేత–దాణా లభ్యత, దూడల పోషణ, వత్తిడి లేని సంరక్షణ పద్ధతులు.. ఇవే నాటు ఆవు గోశాలల సక్సెస్ మంత్రాలు. గోశాలలో ఉన్న ఆవుల్లో మూడో వంతు ఆవులు రోజుకు 10 లీటర్ల పాలిచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. లీటరుకు రూ. 50 ధర లభిస్తే చాలు రైతు నిలబడతాడు. ఏపీ ప్రభుత్వ గో పుష్టి పథకం రైతులకు చాలా ఉపయోగకరమైనది. గోశాల వల్ల ఆర్థిక పుష్టితో పాటు సమాజంలో ఎంతో పెద్ద వారి నుంచి కూడా గౌరవ మర్యాదలు పొందుతున్నాను. భార్యా పిల్లల తోడ్పాటు నా విజయానికి మరో ముఖ్య కారణం. – వల్లూరు రవి కుమార్ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు, పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా,ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు. నాటు ఆవుల్లో గంగి గోవులు వేరు.. దేశీ జాతుల ఆవుల్లోనూ అన్నీ శ్రేష్టంగా ఉండవంటారు రవి. 100% సకల సద్గుణాలు కలిగిన ఆవును గంగి గోవు అంటారు. విశాలమైన గంగడోలు, మంచి మోపురం, సాధు స్వభావం, మనిషిని గుర్తుపట్టే నైజం.. ఈ లక్షణాలు 100% ఉంటే ‘గంగి గోవు’. ఈ లక్షణాలు 50–65% ఉంటే ‘గోవు’. ఈ లక్షణాలు అసలు లేకపోతే ‘ఆవు’ మాత్రమేనని రవి అంటున్నారు. -
సిటీఓపెన్ క్వార్టర్స్లో ఘోషల్
చికాగో: పీఎస్ఏ విండీ సిటీ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషల్ 11-9, 3-11, 11-4, 11-7తో ప్రపంచ 12వ ర్యాంకర్ తరెక్ మొమెన్ (ఈజిప్టు)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల విభాగంలో దీపికా పల్లికల్ తొలిరౌండ్లో పోరాడి ఓడిపోయింది. పల్లికల్ 5-11, 11-8, 7-11, 14-12, 6-11తో ఐదో సీడ్ వీ వెర్న్ (మలేసియా) చేతిలో పరాజయం పాలైంది.