-
స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త హీరోలు!!
♦ వివో, ఒప్పొ, జియోనీ దూకుడు ♦ 21-27 శాతానికి పెరిగిన మార్కెట్ వాటా ♦ తక్కువ ధర, నాణ్యత, ఎక్కువ ఫీచర్లే కారణం ♦ శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ స్పీడ్కు బ్రేకులు సాక్షి, బిజినెస్ విభాగం : స్మార్ట్ఫోన్ యూజర్లలో మార్పొస్తోంది. ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధరకుతోడు ఫిర్యాదులు లేని బ్రాండ్లకు సై అంటున్నారు. ఈ అంశమే ఇప్పుడు చైనా కంపెనీలైన వివో, ఒప్పొ, జియోనీలకు కలిసొచ్చింది. ఫలితం!! వీటి మార్కెట్ వాటా వేగంగా పెరుగుతోంది. మార్చితో పోలిస్తే జూన్ త్రైమాసికంలో ఇవి తమ వాటాను 21 నుంచి 27 శాతానికి పెంచుకున్నాయి. చైనాలో మాదిరిగా భారత్లోనూ వీటి వ్యూహం ఫలితంగా ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్న కంపెనీల పునాదులకు బీటలు పడుతున్నాయి. జెట్ స్పీడ్లో చైనా బ్రాండ్లు.. వివో, ఒప్పొ, జియోనీ, హువావే, లెనోవో వంటి చైనా కంపెనీ లు భారతీయ స్మార్ట్ఫోన్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒప్పొ, వివో సంస్థలు ప్రపంచ టాప్-5 మొబైల్ హ్యాం డ్సెట్స్ కంపెనీల్లో స్థానం పొందాయి. ఇవి దేశంలోని టాప్-3 స్మార్ట్ఫోన్ కంపెనీలైన శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్కు గట్టి పోటీనిస్తున్నాయి. దీనికి స్టోర్లలో బ్రాండింగ్, రిటైల్ మార్జిన్ చెల్లింపులు, ఫీచర్లు, నాణ్యత వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. రూ.25 వేలు, ఆపైన ధరలో ఉన్న చైనా కంపెనీల మోడళ్లను కూడా కస్టమర్లు ఆదరిస్తున్నారని మొబైల్స్ రిటైల్ చైన్ టెక్నోవిజన్ చెబుతోంది. జూన్ త్రైమాసికంలో వివో 201%, జియోనీ 99, ఒప్పొ 42, లెనోవో 23, షావొమీ 23% వృద్ధి చెందాయని కౌంటర్ పాయింట్ చెబుతోంది. వాటా 27 శాతానికి జంప్.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివో, ఒప్పొ, జియోనీ, లెనోవో సంస్థల దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ వాటా పెరిగింది. జనవరి-మార్చితో పోలిస్తే ఏప్రిల్-జూన్లో ఈ కంపెనీల మార్కెట్ వాటా 21 శాతం నుంచి 27 శాతానికి ఎగసింది. దీనికి ఆయా కంపెనీల రిటైల్ మార్కెటింగ్ వ్యూహాలు, బ్రాండింగ్ విధానాలు బాగా అనుకూలించాయి. వివో ఐపీఎల్ స్పానర్గా వ్యవహరించింది. ఇక ఒప్పొ ఐసీసీ టీ20 వరల్డ్ కప్, బిగ్బాస్, ఐపీఎల్లకు స్పాన్సర్షిప్స్ డీల్స్ను కలిగి ఉంది. అలాగే ఈ కంపెనీలు రిటైలర్లకు ఆఫర్ చేస్తోన్న మార్జిన్ చెల్లింపులు 5-6 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఇవి మిగతా ప్రధాన కంపెనీలు ఆఫర్ చేసే విలువ కన్నా ఎక్కువ. క్రెడిట్పైన మొబైళ్లను సరఫరా చేస్తుండడంతో ఈ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలపైనే చిన్న రిటైలర్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రధాన కంపెనీల వాటా దిగువకు.. దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్లో లీడర్గా ఉన్న కొరియా దిగ్గజం శాంసంగ్కు గట్టి పోటీ ఎదురవుతోంది. చైనా కంపెనీల దెబ్బకు దీని మార్కెట్ వాటా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 29 నుంచి 25.6%కి తగ్గింది. ఇక దేశీ కంపెనీ మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్లూ భారీ పతనాన్నే చూస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ వాటా 17 శాతం నుంచి 14 శాతానికి దిగిరాగా... ఇంటెక్స్ వాటా 10% నుంచి 8.5%కి పరిమితమైంది. రూ.20,000లోపు ధర విభాగంలో వివో, ఒప్పొ, జియోనీ కంపెనీలదే హవా అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ సీనియర్ టెలికం అనలిస్ట్ తరుణ్ పాఠక్ తెలిపారు. వ్యూహాత్మకంగా చైనా బ్రాండ్లు.. చైనా కంపెనీలు దేశంలో వాటి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనువుగా పెట్టుబడి పెడుతున్నాయి. ఇవి ప్రధానంగా కస్టమర్ సర్వీసులపై దృష్టి కేంద్రీకరించాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. వివో, ఒప్పొ, జియోనీ సంస్థలు ప్రొడక్ట్ నాణ్యతలో రాజీపడటం లేదన్నారు. ఈ కంపెనీల మోడళ్లపై కస్టమర్ల ఫిర్యాదులు లేవని టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. పైగా అధిక ఫీచర్లున్న మోడళ్లు తక్కువ ధరకు వస్తున్నాయన్నారు. చైనా కంపెనీలు హై ఎండ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను అందుబాటు ధరల్లో యూజర్లకు అందిస్తున్నాయని గార్ట్నర్ ఇండియా రీసెర్చ్ డెరైక్టర్ అన్సూల్ గుప్తా పేర్కొన్నారు. -
శ్రీసిటీలో జియోనీ ఫోన్ల తయారీ
- ఫాక్స్కాన్తో చేతులు కలిపిన కంపెనీ - తయారీకి మూడేళ్లలో రూ.330 కోట్ల వ్యయం - జియోనీ ఇండియా ఎండీ అరవింద్ వోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న జియోనీ ‘మేక్ ఇన్ ఇండియా’ బాటపట్టింది. మొబైల్స్ తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, డిక్సన్ టెక్నాలజీస్తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్కాన్ ప్లాంటుతోపాటు డిక్సన్కు చెందిన నోయిడా ప్లాంటులో ఫోన్లు తయారు కానున్నాయి. అక్టోబరులో మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. ఫాక్స్కాన్ శ్రీసిటీ ప్లాంటులో మూడు అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 5 లక్షల యూనిట్లు. డిక్సన్ నోయిడా ప్లాంటులో 9 అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 7 లక్షల యూనిట్లు. రెండు ప్లాంట్ల వద్ద జియోనీ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. వచ్చే మూడేళ్లలో తయారీకి రూ.330 కోట్లు ఖర్చు చేస్తామని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజనీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు: చైనాలోని సొంత ప్లాంటులో తయారైన ఫోన్లను జియోనీ దిగుమతి చేస్తోంది. ఇక నుంచి జియోనీ ఎఫ్ సిరీస్, పీ సిరీస్ స్మార్ట్ఫోన్లను ఫాక్స్కాన్ శ్రీసిటీ ప్లాంటులో తయారు చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లను డిక్సన్ ఉత్పత్తి చేయనుంది. దేశీయంగా తయారీ చేపట్టడం ద్వారా త్వరితగతిన కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు కంపెనీకి వీలవుతుంది. అలాగే దిగుమతి సుంకాలు ఆదా అవుతాయి. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా వెలుపల తయారీ కేంద్రంగా భారత్ను నిలుపుతామని జియోనీ ప్రెసిడెంట్ విలియం లూ పేర్కొన్నారు. నెలకు ఒక మోడల్: భారత్ మార్కెట్లో నెలకు ఒక మోడల్ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు అరవింద్ తెలిపారు.రూ.8,000 ఆపైన ధరలో వచ్చేవన్నీ 4జీ మోడళ్లని తెలిపారు. ఆన్లైన్లోనూ ఫోన్లను విక్రయిస్తామని వెల్లడించారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్తోపాటు ఇతర ఇ-కామర్స్ కంపెనీలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని జియోనీ ఇండియా ఆర్జించింది. ఈ ఏడాది రూ.6,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏడాదిలో 250 జియోనీ బ్రాండ్ స్టోర్లు
కంపెనీ ఎండీ అరవింద్ వోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోనీ భారత్లో ఏడాదిలోగా బ్రాండ్ స్టోర్ల సంఖ్యను 250కి చేర్చనుంది. ప్రస్తుతం 22 బ్రాండ్ స్టోర్లు ఉన్నాయని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజ్నీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా 45,000పైగా రిటైల్ స్టోర్లలో జియోనీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ప్రముఖ రిటైల్ చైన్ సంస్థలతో చేతులు కలిపామన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement