-
బాహుబలులన్నీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని గాయత్రి (ప్యాకేజీ–8) పంప్హౌస్లోని బాహుబలి మోటార్ల న్నింటికీ పరీక్షలు పూర్తయ్యాయి. నిర్ణీత రెండు టీఎంసీల మేర గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా గాయత్రి పంపింగ్ కేంద్రం సిద్ధమైంది. అతితక్కువ సమయం లో పంపింగ్ కేంద్రాన్ని నిర్మించ డంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కొత్త రికార్డు సృష్టించింది. ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్తో నడిచే మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, దాని దిగువన గాయత్రి పంప్హౌస్లో మోటార్ల సామర్థ్యం మరో 15 మెగావాట్ల మేర ఎక్కువగా అంటే 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా 7 మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఒక్కో మోటారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులుగా ఉంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్హౌస్లో మొదటి పంప్హౌస్కు ఈ ఏడాది ఆగస్టు 11న మొదటి మోటార్ను ప్రారంభిం చగా, అదేనెల 14న రెండు, 20న మూడు, 31న నాలుగు, సెప్టెంబర్ 18న ఐదు, అక్టోబర్ 19న ఆరు మోటార్లను ప్రారంభించారు. శనివారం మిగిలిన ఏడో మోటార్ను ఈఎన్ సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథ కాల సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మోటార్ దిగ్విజయంగా నడవడంతో ఇక్కడ నూటికి నూరు శాతం మోటార్లన్నీ సిద్ధమైనట్లయింది. నెలాఖరుకు పూర్తి స్థాయిలో.. ఇక ఇప్పటికే లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి(అన్నారం)లలో మోటార్లు వెట్రన్లు పూర్తి చేసుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్ సంస్థే పూర్తి చేసింది. ఇక సుందిళ్ల (పార్వతి)లో తొమ్మిది మోటార్లలో ఎనిమిది మాత్రమే సిద్ధమయ్యాయి. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో మరో మోటార్కు వెట్రన్ నిర్వహించాల్సి ఉండగా, దానికి నెలాఖరున పూర్తి చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే తొలిదశలో కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లే. -
ఐవీఆర్సీఎల్కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో ఐవీఆర్సీఎల్ నష్టాలు క్రితంతో పోలిస్తే రూ.153 కోట్ల నుంచి రూ.245 కోట్లకు చేరాయి. టర్నోవరు రూ.452 కోట్ల నుంచి రూ.522 కోట్లకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన గాయత్రి లాభం.. గాయత్రి ప్రాజెక్ట్స్ స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు మూడు రెట్లు అధికమై రూ.45 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.440 కోట్ల నుంచి రూ.660 కోట్లకు చేరింది. గాయత్రి షుగర్స్కు నష్టం.. జూన్ క్వార్టరులో గాయత్రి షుగర్స్కు రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.15 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.132 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పడింది. ఎన్సీఎల్ లాభం రూ.16 కోట్లు.. జూన్ క్వార్టరు స్టాండలోన్ ఫలితాల్లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9 కోట్ల నుంచి రూ.16 కోట్లకు ఎగిసింది. టర్నోవరు రూ.192 కోట్ల నుంచి రూ.227 కోట్లకు చేరింది. సువెన్లైఫ్ లాభం రూ.29 కోట్లు.. త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో సువెన్లైఫ్ నికరలాభం క్రితంతో పోలిస్తే సుమారు 9% తగ్గి రూ.29 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.137 కోట్ల నుంచి రూ.146 కోట్లకు చేరింది. స్వల్పంగా తగ్గిన గ్రాన్యూల్స్ లాభం.. గ్రాన్యూల్స్ ఇండియా జూన్ క్వార్టరు కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.40 కోట్ల నుంచి రూ.37 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.353 కోట్ల నుంచి రూ.386 కోట్లకు ఎగిసింది. రూ.1 విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 పైసల తొలి మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది. 30 శాతం పెరిగిన పెన్నార్ లాభం.. జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పెన్నార్ ఇండస్ట్రీస్ నికరలాభం క్రితంతో పోలిస్తే 30 శాతం పెరిగి రూ.13 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.338 కోట్ల నుంచి రూ.460 కోట్లకు చేరింది. -
రూ.926 కోట్ల కాంట్రాక్టు 'గాయత్రీ' సొంతం
న్యూఢిల్లీః లీడింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ గాయత్రీ ప్రాజెక్ట్స్ బీహార్ కు చెందిన ఓ భారీ కాంట్రాక్టును సొంతం చేసుకుంది. బీహార్ లోని ఎన్ హెచ్82 రహదారి విస్తరణ పనులకు సంబంధించిన మొత్తం 926 కోట్ల రూపాయలు విలువచేసే కాంట్రాక్టును తమ సంస్థ చేజిక్కించుకున్నట్లు కంపెనీ బీఎస్ ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్ కు బీహార్ రాష్ట్రం నుంచి 926 కోట్ల రూపాయల వ్యయం చేసే పనులకు సంబంధించిన ఆర్డర్ లభించింది. బీహార్ లోని గయ, హిస్వా, రాజ్ఘర్, నలంద, బిహార్షరీఫ్ సెక్షన్లకు చెందిన ఎన్ హెచ్ 82 కు సంబంధించిన నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కాంట్రాక్టును బీహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎస్టీడీసీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్స్ అండ్ హైవేస్ ద్వారా పొందినట్లు సంస్థ ప్రకటించింది. ప్రముఖ జపనీస్ సహకార ఏజెన్సీ (జైకా) సహాయ నిధులతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు గ్రాయత్రీ తెలిపింది. -
గాయత్రి ప్రాజెక్ట్స్కు రూ. 306 కోట్ల కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్ రూ. 306 కోట్ల విలువ చేసే ప్రాజెక్టును దక్కించుకుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని నాలగంపల్లి గ్రామం ప్రాంతంలో జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా వేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు తెలియజేసింది. -
గాయత్రి ప్రాజెక్ట్స్ లాభం రూ. 28 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గాయత్రి ప్రాజెక్ట్స్ నికర లాభం దాదాపు 75 శాతం వృద్ధితో సుమారు రూ. 16 కోట్ల నుంచి రూ. 28 కోట్లకు (స్టాండెలోన్) పెరిగింది. ఆదాయం రూ. 560 కోట్ల నుంచి రూ. 668 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,601 కోట్ల నుంచి రూ. 1,812 కోట్లకు, లాభం రూ. 22 కోట్ల నుంచి రూ. 59 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను షేరు ఒక్కింటిపై రూ. 2 (20శాతం) డివిడెండును కంపెనీ ప్రకటించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement