breaking news
ganesh Immersed
-
నిమజ్జనానికి 2,500 వాహనాలు
సాక్షి,హైదరాబాద్: గణపతి నిమజ్జన మహోత్సవానికి వాహనాలను అందజేసేందుకు ఆర్టీఏ చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి మండపాలకు అవసరమైన వాహనాలను అందజేసేందుకు రవాణా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకుల నుంచే వచ్చే డిమాండ్కు అనుగుణంగా వాహనాలను ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17న నిమజ్జన వేడుకలు జరగనున్న నేపథ్యంలో 16వ తేదీ సోమవారమే వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. సుమారు 2,500 వాహనాలను సిద్ధం చేయనున్నారు. వారం రోజులుగా కసరత్తు.. నిమజ్జన వాహనాల కోసం వారం రోజులుగా అధికారులు కసరత్తు చేపట్టారు. భారీ ట్రేలర్లు మొదలుకొని లారీలు, డీసీఎంలు వంటి వివిధ రకాల వాహనాల సేకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం గ్రేటర్లోని ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈసారి వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. వాహనాల కోసం చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా మండపాల నిర్వాహకులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. సొంతంగా సమకూర్చుకోవడమే కష్టమే.. ఆర్టీఏ వాహనాలను ఏర్పాటు చేసినప్పటికీ మండపాల నిర్వాహకులు సొంతంగానే వాహనాలను సమకూర్చుకొని విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారు. చిన్న విగ్రహాల తరలింపులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. భారీ విగ్రహాల తరలింపునకు ట్రేలర్లు, టస్కర్లు వంటి వాహనాలు అవసరం. వాటిని సొంతంగా ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టమే. అలాంటి వాహనాలను ఆర్టీఏ సేకరించి అందజేస్తోంది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచన మేరకు నగరంలోని ప్రధాన మండపాలకు భారీ ట్రేలర్ల నుంచి టాటాఏస్ల వరకు అందజేయనున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో వాహనాల వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. మండపాల నిర్వాహకులు తమకు అవసరమైన వాహనాల కోసం ఆర్టీఏ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవచ్చు. 12 కేంద్రాల్లో వాహనాలు..నిమజ్జన వాహనాలను మండపాల నిర్వాహకులకు అందజేసేందుకు గ్రేటర్ పరిధిలో 12 కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల నుంచి మండపాలకు వాహనాలను తీసుకెళ్లవచ్చు. నెక్లెస్ రోడ్డు, మేడ్చల్, టోలీచౌకి, జూపార్కు, మలక్పేట్, కర్మన్ఘాట్, నాగోల్, గచి్చ»ౌలి, మన్నెగూడ, పటాన్చెరు, వనస్థలిపురం, ఆటోనగర్ల నుంచి వాహనాలను మండపాలకు తరలించనున్నారు. మరోవైపు వాహనాలకు చెల్లించాల్సిన అద్దెలను కూడా ఆర్టీఏ అధికారులు ఖరారు చేశారు.వాహనాల అద్దె సుమారుగా.. 👉 భారీ ట్రేలర్లు లేదా టస్కర్లు రూ.3300 (డీజిల్ ఖర్చు, డ్రైవర్ బత్తాతో కలిపి) 👉 10 నుంచి 12 టైర్ల సామర్థ్యం హెవీ గూడ్స్ వెహికల్స్కు రూ. రూ.4500. డీజిల్ ఖర్చు, డ్రైవర్కు రూ.500 బత్తా అదనం. 👉 6 టైర్ల సామర్థ్యం కలిగిన లారీలకు రూ.3000. 👉 మిడిల్ గూడ్స్ వెహికల్స్కు రూ.2000. 👉 డీసీఎం వంటి లైట్గూడ్స్ వెహికల్స్కు రూ.1500. 👉 టాటాఏస్లకు రూ.1000 చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. 👉 వీటితో పాటు ప్రతి వాహనం డ్రైవర్కు బత్తా తప్పనిసరిగా ఇవ్వాలి. -
గణేష్ నిమజ్జనంలో ౩౦ మంది పోకిరీలు ఆరెస్ట్
-
గంగమ్మ ఒడికి గౌరీపుత్రుడు
గణాధిపతి... సిద్ధిబుద్ధి ప్రదాత... తొలి పూజలందుకున్న గౌరీ నందనుడు గంగమ్మ ఒడికి చేరాడు. వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చిన కొండంత దేవుడు మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకున్నాడు. 9 రోజులు పత్రి, గరిక పూజలు అందుకొని.. పండ్లు, పాయసం, ఉండ్రాళ్లు ఆరగించిన బొజ్జ గణపయ్య ఆదివారం నిమజ్జనానికి వెడలాడు. విగ్రహాల శోభాయూత్ర అంగరంగ వైభవంగా జరిగింది. యువతీ యువకుల కోలాటాలు, నృత్యాలు, బ్యాండుమేళాలు, డప్పుచప్పుళ్ల సందడి మధ్య గణేష్ మహరాజ్ జలాధివాసానికి తరలాడు. మూషిక వాహనుడికి లారీలు, ట్రాక్టర్లు... అన్నీ వాహనాలయ్యూరుు. భక్తుల జయజయధ్వానాల నడుమ ఆయూ చెరువులు, జలాశయూల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం కనులపండువగా జరిగింది. హన్మకొండ కల్చరల్ : తొమ్మిది రోజుల పాటు జిల్లా ప్రజల ను అలరించి భక్తిసాగరంలో ముంచెత్తిన పార్వతీ తనయుడు గణనాథుడి విగ్రహాలను భక్తులు ఘనంగా నిమజ్జనం చేశా రు. రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పుటికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి తెరపి ఇవ్వడంతో గణనాథుల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. నగరంలో సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన వినాయక నిమజ్జనం అర్ధరాత్రి వరకు కొనసాగింది. యువకులు, యువతులు, మహిళలు, పిల్లలు, పెద్దలు ఊరేగింపు వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు. గణపతి బొప్పామోరియా, జైబోలో గణేష్ మహరాజ్కీ జై అంటూ వీరభక్తిని చాటుకున్నారు. కాషాయ రిబ్బన్లు, టోపీలు, జెండాలు ధరించి హోలీ రంగులు చల్లుకుంటూ బాణసంచా పేళుల్లు, డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. గణపతులకు ఘనంగా స్వాగతించడానికి వరంగల్ మహానగర గణపతి నవరాత్రి ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. వరంగ ల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, జిల్లా అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి సాయంత్రం 6.00 గంటలకు బంధంచేరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి హన్మకొండలోని వినాయకులు పలు వీధుల నుంచి ఊరేగిం పుగా వచ్చి చౌరస్తా మీదుగా పద్మాక్షి గుండం, సిద్ధేశ్వ గుం డం, ములుగు రోడ్డులోని కోటచెరువు వైపు తీసుకువేళ్లారు. హన్మకొండ చౌరస్తా శక్తిస్థల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి గుజ్జుల నరసయ్య, రామానుజం తదితరులు వినాయక ఊరేగింపులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాత్రి 7.00 గంటలకు ఈ వేదికపై నుంచి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ప్రకటించారు. కాజీపేట వైపు నుంచి బంధం చెరువు దిక్కు వచ్చే వినాయకులను దర్గాసెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి శ్రీనివాస్రావు తదితరులు, వరంగల్ వైపు నుంచి చిన్నవడ్డేపల్లి చెరువుకు వస్తున్న వినాయకులను పోచ్చమ్మమైదాన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి నందాల చందర్బాబు, భైరిశ్యామ్సుందర్ ఆధ్వర్యంలో ఆహ్వనించారు. రాత్రి 12 గంటల వరకు జిల్లా మొత్తం మీద 8000 వినాయకులను నిమజ్జనం చేశారు. కాజీపేట బంధం చెరువులో 500, సిద్ధేశ్వర గుండంలో 500, కోటచెరువులో 800, చిన్నవడ్డేపల్లి చెరువులో 1500, ఉర్సు రంగసముద్రంలో 400ల వినాయక విగ్రహలను నిమజ్జనం చేశారు. నగరం మొత్తం మీద 3700 విగ్రహాలను నిమజ్జనం చేశారు. జిల్లా పోలీస్, రెవెన్యూశాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నిమజ్జనం సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు. వేలాది మంది ప్రజలు చెరువుల వద్దకు తరలివచ్చారు. వేడి తగ్గిన వేలం పాటలు బోజ్జ గణపయ్య లడ్డూ తింటే భలే రుచి మాత్రమే కాదు కలిసొస్తుందని భక్తుల నమ్మకం. అయితే నగరంలోని పలుచోట్ల గణేష మండళ్లు నిర్వహించిన లడ్డూ వేలం పాటలు గతంలో కంటే తక్కువకు పోయాయి. కొన్నిచోట్ల గజానన మండలివారే జోక్యం చేసుకుని కొనుగొలు చేయాల్సివచ్చింది. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని శ్రీగజానన మండలిలో నిర్వహించిన వేలం పాటలో నూతన గజానన మండలి కమిటీవారే రూ.35,116లకు గణపతి లడ్డూ కైవసం చేసుకున్నారు. ఎక్సైజ్ కాలనీలోని శ్రీనాగేంద్రస్వామి శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీఆభయాంజనేయస్వామి సహిత శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో జరిగిన వేలంపాటలో ఏనుగుల సాంబరెడ్డి, మంజుల దంపతులు రూ.2,116లకు లడ్డూ దక్కించుకున్నారు.