-
మద్యం పోసి... సిగరెట్లు తాగించి
సాక్షి, హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ఇటీవల జూనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ రూములకు రప్పించి వారికి బలవంతంగా మద్యం పోసి... సిగరెట్లు తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికార వర్గాలు చేపట్టిన విచారణలో విస్మయకర నిజాలు వెలుగుచూశాయి. కొందరిని బట్టలు విప్పించి డ్యాన్స్లు చేయించారని కూడా అంటున్నారు. బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కాగా, కొందరు విద్యార్థినులను కూడా ర్యాగింగ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమేనా కాదా అన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ ర్యాగింగ్ ఉదంతంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్పై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధక కమిటీల పటిష్టం... రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల కొందరు సీని యర్ విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడుతున్న ఘటనలు అధికా రుల దృష్టికి వచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ల్లోనూ ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న భావనతో చూసీచూడనట్లుగా వదిలేశారు. కానీ గాంధీ ఘటన నేపథ్యంలో ఇకపై ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఈ కార్యాలయం ఆదేశించింది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఇప్పటికీ లేకుంటే తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, హాస్టళ్ల వద్ద రాత్రి వేళ నిఘా పెంచాలని సూచించింది. మరోవైపు ర్యాగింగ్కు గురైన విద్యార్థుల ఫిర్యాదు నిమిత్తం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు, ఈ మెయిల్ ఐడీని రూపొందించాలని కూడా డీఎంఈ కార్యాలయ అధికారులు యోచిస్తున్నారు. -
వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): గాంధీ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల సస్పెన్షన్పై పునరాలోచించాలని కోరు తూ వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడిన పదిమంది వైద్య విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య విద్యా ర్థులు మంగళవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో గాంధీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, చిలకలగూడ సీఐ మట్టంరాజులు వైద్యవిద్యార్థులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్కు ఫిర్యాదు అందిన నేపధ్యంలో.. అక్కడి ఉన్నతాధి కారుల సూచన మేరకు గాంధీ వైద్య కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణయిందని అధికారులు వివరించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానం మేరకే చర్యలు చేపట్టామని, ఇది డీఎంఈ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై చట్టప్రకారం పోలీస్ కేసులు నమోదు చేయాలని, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. డీఎంఈ, గాంధీ ప్రిన్సిపాల్ రమేశ్రెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరని, బుధవారం ఆయనతో సమావేశం ఏర్పాటు చేస్తామని వైస్ ప్రిన్సిపాల్ నచ్చజెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించి, తరగతులకు హాజరయ్యారు. -
అన్ని కాలేజీల్లో సీపీఆర్ శిక్షణ ఇవ్వాలి: గవర్నర్
పంజగుట్ట(హైదరాబాద్): కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణను ఒక జీవితాన్ని కాపాడే మంచిపనిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభివర్ణించారు. విదేశాల్లో 60 నుంచి 65 శాతం సీపీఆర్ శిక్షణ పొందిన వారుంటే భారత్లో కేవలం 2 శాతం ఉండటం బాధాకరమన్నారు. ప్రతీ కాలేజీలో సీపీఆర్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం రాజ్భవన్ సంస్కృతిహాల్లో గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్, గాంధీ మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయన్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ హ్యాండ్స్ ఓన్లీ సీపీఆర్’పేరుతో రాజ్భవన్ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు సీపీఆర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ ఈ కార్యక్రమంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగమూర్తి పాల్గొన్నారు. -
కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టారు
గాంధీఆస్పత్రి: కరోనా బారిన పడ్డవాళ్లను కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లూ వదిలేస్తే, ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలకు వెలకట్టలేమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు. కోవిడ్తో మృతి చెందిన నర్సుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ మెడికల్ కాలేజీలోని వివేకానంద ఆడిటోరియంలో గురువారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వైద్యరంగంలో తెలంగాణ నంబర్వన్ కావాలని, అందుకు నర్సింగ్ సిబ్బంది తమవంతు కృషి చేయాలని అన్నారు. 4,722 స్టాఫ్నర్సుల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నర్సింగ్ కౌన్సిల్ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించామని, నర్సింగ్ డైరెక్టరేట్ విషయమై సీఎం కేసీఆర్తో చర్చించామని, ఆయన పాజిటివ్గా ఉన్నారని వివరించారు. నర్సింగ్ విద్యను పటిష్ట పరిచేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 బీఎస్సీ నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో పాటు నర్సింగ్ స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. నర్సింగ్ విద్యలో మార్పులకు అనుగుణంగా ఎస్ఎన్సీయూ, ఆంకాలజీ, మెంటల్ హెల్త్ విభాగాల్లో స్పెషలైజేషన్ శిక్షణ ఇస్తామన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన 33 జిల్లాలకు చెందిన 106 మంది స్టాఫ్నర్సులు, ఆరుగురు నర్సింగ్ సూపరింటెండెంట్లకు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు వాకాటి కరుణ, అజయ్కుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు రాజారావు, నాగేందర్, గాంధీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ విజయనిర్మల, నర్సింగ్ పిన్సిపాల్స్ విద్యుల్లత, విజయ, వివిధ జిల్లాలకు చెందిన నర్సింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గాంధీలో 135 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో 135 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఓబీజీ, íపీడియాట్రిక్, అనస్తీషియా విభాగాల్లో ఒక్కో విభాగానికి 20 చొప్పున, ఆర్థోపెడిక్లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) 20 పోస్టులు మొత్తం 135 ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈనెల 19 నుంచి ఏప్రిల్ 4లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 7న మెరిట్ లిస్ట్ ప్రకటించనున్నట్లు తెలిపారు. 9న గ్రీవెన్స్ పరిశీలన, 11న ఫైనల్ మెరిట్ లిస్ట్, 12న సెలక్షన్ లిస్ట్, 14న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎండీ, ఎంఎస్, డీఎన్బీ తత్సమానమైన విద్యతోపాటు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంసీఐ లేదా ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ఉండాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంబీబీఎస్తోపాటు తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఉండాలని వివరించారు. 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని, రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్ ప్రకారం కేటాయింపులుంటాయని తెలిపారు. ఎస్సెస్సీ ఒకటి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మార్క్స్ లిస్ట్, ఎంబీబీఎస్, పీజీ సర్టిఫికెట్లు, కుల, వికలాంగ« ధ్రువీకరణ, సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసిన సర్టిఫికెట్, ఆధార్కార్డు, సంబంధిత పత్రాలను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లు సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement