-
ఆ ఫోన్పై రూ. 25 వేలు తగ్గింపు
శాంసంగ్ తన గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్పై భారీగా ధర తగ్గించింది. 2016 మార్చిలో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ను ప్రస్తుతం రూ.25,910 తగ్గింపుకు అందిస్తోంది. అంటే లాంచింగ్ సందర్భంగా రూ.48,900గా ఉన్న గెలాక్సీ ఎస్7, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు రూ.22,990కే అందుబాటులోకి వచ్చింది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ జరుపుతున్న శాంసంగ్ కార్నివల్(ఉత్సవం)లో భాగంగా ఈ ఫోన్పై భారీ మొత్తంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రూ.25వేల కంటే తక్కువకి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎస్7 బెస్ట్ ఫోన్గా కంపెనీ చెబుతోంది. హై-ఎండ్ ప్రీమియం డిజైన్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఓ అద్భుతమైన ఫోన్గా పేర్కొంది. హాల్మార్క్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ముందు, వెనుక వైపు అవుట్స్టాండింగ్ కెమెరాలు, పవర్ఫుల్ హార్డ్వేర్, వైర్లెస్ ఛార్జింగ్ దీనిలో ప్రత్యేకతలుగా తెలిపింది. గ్లాస్, మెటల్ డిజైన్తో ఇది రూపొందింది. గెలాక్సీ ఎస్8 మాదిరి, గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్కు కూడా డస్ట్, వాటర్ రెసిస్టాన్స్ కలిగి ఉంది. రూ.25వేల కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్ఫోన్లకు ఐపీ68- రేటింగ్ ఉండటం చాలా అరుదు. గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్కు 5.1 అంగుళాల క్వాడ్-హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1440x2560 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎక్సీనోస్ 8890 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ నోగట్కు అప్గ్రేడెడ్, 4జీ ఎల్టీసీ కనెక్టివిటీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్, 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. -
రూ.46వేల స్మార్ట్ఫోన్ రూ.8990కే..
న్యూఢిల్లీ : ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నేటి నుంచి మొబైల్ బొనాంజ సేల్కు తెరతీసింది. ఈ సేల్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. రూ.46వేలుగా ఉన్న స్మార్ట్ఫోన్పై 19,010 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాక పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.18వేల తగ్గింపును కూడా ప్రకటించింది. దీంతో మొత్తంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్ రూ.8990కే అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ బ్లాక్ ఆనెక్స్, గోల్డ్ ప్లాటినం, సిల్వర్ టైటానియం రంగుల్లో లభ్యమవుతుంది. ఫీచర్ల పరంగా చూసుకుంటే ఈ స్మార్ట్ఫోన్ 5.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఎక్సీనోస్ 8890 ప్రాసెసర్తో ఇది రూపొందింది. 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 200జీబీ వరకు విస్తరణ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఫ్లిప్కార్ట్ నేటి నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించనున్న సేల్లో పలు స్మార్ట్ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తుంది. రెడ్మి నోట్(4జీబీ) అసలు ధర రూ.12,999 అందుబాటు ధర రూ.10వేలు షావోమి ఎంఐ ఏ1(4జీబీ/64జీబీ) అసలు ధర రూ.14,999 అందుబాటులోని ధర రూ.12,999 ఆపిల్ ఐఫోన్ 8 పరిమిత స్టాక్స్ అందుబాటులో ఉండే ధర రూ.54,999 మోటో జీ5 ప్లస్(4జీబీ) రూ.16,999 అందుబాటు ధర రూ.9999 గూగుల్ పిక్సెల్ 2/2 ఎక్స్ఎల్ అసలు ధర రూ.61వేలు అందుబాటులోని ధర రూ.39,999 -
శాంసంగ్ ఇండిపెండెన్స్ సేల్: భారీ ఆఫర్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొనుగోళ్లపై బిగ్ డిస్కౌంట్లు, క్యాఫ్బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ పై ఈ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు రూ.20వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది శాంసంగ్ ఇండిపెండెన్స్ సేల్ లో భాగంగా, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్పై రూ. 8వేల క్యాష్ బ్యాక్ ( 64 జీబీ,128జీబీ రెండు వేరియంట్లు). దీనితో పాటు, ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ .12,000 వరకు అదనపు క్యాష్ బ్యాక్ లభ్యం. గాలక్సీ ఎస్ 7 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు రూ .4వేల క్యాష్ బ్యాక్. రూ.12వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్. అంతేకాదు ఈ స్వాతంత్ర్య దినోత్సవ అమ్మకాలల్లో భాగంగా రెండు ఫోన్లపై 24 నెలల వరకు ఈఎంఐ ఆఫర్. కాగా గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఇప్పటికీ శాంసంగ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లుగా పరిగణించబడుతున్నాయి. ఈ ఫోన్లు గత ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్ 7 రూ .48,900, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రూ .56,900 ధరలతో లాంచ్ అయ్యాయి. -
గెలాక్సీ ఎస్7ను మించిపోయిన ఎస్8
సియోల్ : సియోల్ : ఐఫోన్ కిల్లర్ గా తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ ప్రీఆర్డర్స్ లో అదరగొడుతుందట. తన ముందస్తు స్మార్ట్ ఫోన్ ఎస్7 కంటే మించిపోయిన ప్రీ-ఆర్డర్లను రికార్డు చేసినట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ చీఫ్ కోహ్ డాంగ్-జిన్ వెల్లడించారు. దక్షిణకొరియా, అమెరికా, కెనడాలో ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ విక్రయాలను ఏప్రిల్ 21 నుంచి కంపెనీ చేపట్టబోతుంది. నోట్ 7 దెబ్బకు అతలాకుతలమైన శాంసంగ్, ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకుని, ఆపిల్ కు చెక్ పెట్టాలని ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజానికి తొలి ఏడాది విక్రయ రికార్డును ఈ ఫోన్ ఇస్తుందని కొంతమంది ఇన్వెస్టర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించామని, అంచనావేసిన దానికంటే మెరుగ్గా దీని ప్రీ-ఆర్డర్లు రికార్డవుతున్నట్టు కోహ్ చెప్పారు. ఎలాంటి బ్యాటరీ పేలుళ్ల ఘటనలు సంభవించకుండా.. ఎంతో సురక్షితమైన ఫోన్ గా దీన్ని ప్రవేశపెట్టామన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్ కంపెనీకి బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గా నమోదవుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్ట్రాంగ్ ఎస్8 అమ్మకాలు, మెమరీ చిప్ మార్కెట్ బూమ్ కంపెనీకి మంచి వద్ధి రికార్డు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
ఎస్7 తయారీ ఖర్చు మరీ అంతతక్కువా?
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్ఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించాయి. అయితే ఈ మొబైల్స్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 సిరీస్ మొబైల్స్ తయారీ కోసం కేవలం రూ.16 వేలు మాత్రమే ఖర్చుచేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మార్కెట్లో కొన్ని సర్వేలలో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 వెర్షన్ ఉన్న ఎస్ 7 కోసం 255 డాలర్లు(భారత కరెన్సీలో కేవలం రూ. 15,750) అవుతుందట. సాఫ్ట్ వేర్ రీసెర్చ్, ఆర్ అండ్ డీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, పన్నులు ఇతర రకాల అలవెన్సులు ఇందుకు అధనం అని మార్కెట్ అనలిస్ట్ ఐహెచ్ఎస్ సర్వేలో తేలింది. గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే, గెలాక్సీ ఎస్ 7 ప్రొడక్ట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు గెలాక్సీ ఎస్5 కంటే ఒక డాలర్ (దాదాపు రూ.70) తక్కువ పడుతుందట. గెలాక్సీ ఎస్5 మార్కెట్లోకి వచ్చిఇప్పటికీ రెండేళ్లు అవుతుంది. ఆపిల్ ఉత్పత్తులను పూర్తిగా అధిగమించి విక్రయాలను చేయాలని కసరత్తులు చేస్తోంది. బార్సిలోనాలో గత నెలలో ప్రవేశపెట్టిన ఈ మొబైల్స్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ మొబైల్స్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ను కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్స్ ఓపెన్ మార్కెట్లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement