future plan
-
రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
ఐదంకెల జీతం, కార్పొరేట్ హోదా..ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే అదో గొప్ప స్టేటస్. కానీ ఇపుడు కథ మారిపోయింది. ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ (Oracle)12 వేల మంది టెకీల ఉద్వాసన కథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదేదో తక్కువ పెర్ఫార్మర్కే పరిమితం కాదు..ఎంతో అనుభవం ఉన్నా, నిపుణులకు కూడా ఇది తప్పలేదు. దీంతో ఆయా ఐటీ ఉద్యోగులు తమ బాధలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడం నెట్టింట చర్చకు దారి తీస్తోంది. అలాగే ఆర్థిక స్వేచ్ఛ, కార్పొరేట్ ఒత్తిడిలుని జీవితం వంటి అంశాలపై చర్చలను రేకెత్తించింది.పదేళ్ల పాటు అంకితభావంతో సేవలందిస్తూ, ఏడాదికి రూ. 37 లక్షల వేతనం అందు కున్న వ్యక్తి ఉన్నట్టుండి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వనేష్ మాలి అనే ఎక్స్ యూజర్ తన స్నేహితుడి ఉదంతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.దీని ప్రకారం సదరు ఐటీ ఉద్యోగికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా ఉన్నపళంగా ఉద్యోగం నుండి తొలగించారు. రేపటినుంచి నీ సేవలు అనవసరం అన్న సందేశం వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు అశనిపాతంలా తగిలిన మాట వాస్తవం. ఎందుకంటే.. బోలెడన్ని కమిట్మెంట్స్, ఈఎంఐలు, ఫీజులు లాంటి అవసరాలెన్నో కళ్లముందు మెదులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆందోళన చెందుతారు. కానీ, మనం చెప్పుకోబోయే టెకీ మాత్రం చాలా ప్రశాంతంగా ఆలోచించాడు. ఎలాంటి నిరాశ లేదా ఆందోళనకు బదులుగా, ప్రశాంతంగా ఈ పెను తుఫానులాంటి పరిస్థితిని స్వీకరించడం విశేషం. "నేను దీనిగురించి అస్సలు బాధపడటం లేదు. నిజానికి నేను సంతోషంగా ఉన్నాను. ఇకపై నేను ఏ ఐటీ కంపెనీలోనూ పని చేయను. నేను వ్యవసాయంపై దృష్టి పెడతాను." అనే నిర్ణయానికి వచ్చేశాడు.వ్యవసాయమే ఎందుకూ అంటేఇదేదో తాత్కాలిక ఆలోచనో, కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదిది. దీని వెనుక ముందు చూపుతో చాలా తెలివిగా వ్యవహరించిన బలమైన ఆర్థిక ప్రణాళిక ఉంది. గత 10 ఏళ్లుగా సంపాదించిన సొమ్మును తెలివిగా పొదుపు చేశాడు. భవిష్యత్తులో ఉద్యోగం పోయినా అతను ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా తగిన ఆర్థిక భద్రతను కల్పించుకున్నాడు. ఇపుడిక ఎలాంటి దిగులు లేకుండా తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ, కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ 'ర్యాట్ రేస్' (Rat Race) అని పిలిచే ఈ కార్పొరేట్ పోటీ ప్రపంచాని దూరంగా, ప్రశాంత జీవనం గడపడమే అతని లక్ష్యం.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది దీనిని 'ఆస్పిరేషనల్ మూవ్' (ఆదర్శవంతమైన అడుగు) అని అభివర్ణిస్తున్నారు. లేఆఫ్స్ అనేవి కొన్నిసార్లు మన జీవితాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశాలని కొందరు కామెంట్ చేశారు. సొంత రూల్స్తో ర్యాట్ రేస్నుంచి వైదొలగడం అరుదైన ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్పొరేట్ జీవితం కంటే వ్యవసాయం, కుటుంబాన్ని ఎంచుకోవడానికి ధైర్యం , దృఢ విశ్వాసం అవసరమని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు జీవితంలో పొదుపు ప్రాముఖ్యత అందర్నీ ఆకట్టుకుంది. ఆకస్మికంగా ఉద్యోగం పోయినా తట్టు కోవాలంటే ఆర్థికంగా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఈ ఘటన నిరూపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లక్షల జీతం కన్నా తనవాళ్ల మధ్య మనశ్శాంతిగా జీవించడంతోపాటు, భూమాతను నమ్ముకున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.ఇదీ చదవండి : పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్ -
మహేష్ ఫ్యూచర్ ప్లాన్ అదుర్స్..
-
Etela Rajender: సరైన సమయంలో సరైన నిర్ణయం
సాక్షి, కరీంనగర్: రాజకీయ భవిష్యత్తుపై సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మూడు రోజులుగా వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడానన్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 పాత జిల్లాల నుంచి కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. బుధవారం హుజూరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ సంఘాల వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నా నిర్ణయానికి సంబంధించి నియోజకవర్గంలోని ప్రజలు రెండు రకాలుగా అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని బేరీజు వేసుకుంటున్నా. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కరోనాను నివారించడంతోపాటు, కరోనా బారిన పడ్డ వారిని కాపాడుకోవడం ముఖ్యమైన అంశం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హుజూరాబాద్ కీలకంగా వ్యవహరించింది. 20 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు తెలంగాణ ఉద్యమ అనుబంధం ఉంది. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో రైల్రోకో చేసి అప్పటి ఢిల్లీ సర్కారుకు తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పాం. అప్పుడు ఉప్పల్ రైల్వేస్టేషన్లో పోలీసులు ఫైరింగ్కు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంత ప్రజలు లెక్కచేయలేదు. ఉద్యమాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇక్కడి ప్రజలు, నాయకుల కమిట్మెంట్ ఎంతో గొప్పది. నాకు జరిగిన అన్యా యాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి మీకు జరిగిన అన్యాయం, దుర్మార్గం సహించరానిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నారైలు కూడా వారి సలహాలు, సూచనలు ఇచ్చారు’అని ఈటల వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏం కోరుకున్నారో అది నేడు జరగడం లేదన్నారు. ఇప్పుడు ఆత్మ గౌరవం ప్రధాన సమస్యగా మారిందని, హైదరాబాద్లో ఉన్న తన ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని ఈటల చెప్పారు. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు మూడు రోజులపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటన పూర్తి చేసుకున్నమాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం తిరిగి శామీర్పేటలోని తన నివాసానికి చేరుకున్నారు. మూడు రోజులపాటు హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో పాటు పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలతో ఈటల భేటీ అయ్యారు. శాసనసభ్యత్వంతో పాటు పారీ్టకి రాజీనామా చేసే విషయంలో ఈటల అనుచరులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగాలని కొందరు కోరగా, రాజీనామా చేసి బయటకు వస్తే వెంట నడుస్తామని మరికొందరు ప్రకటించారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే యోచనకు ఈటల వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కిన ఈటల, దేవరయాంజాల్ భూముల విషయంలోనూ న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు సమాచారం. ( చదవండి: ఈటల రాజేందర్ బర్తరఫ్పై నిరసన ) -
నేడే సర్వే
సమగ్ర కుటుంబ సర్వేకు అంతా రెడీ జిల్లాలో 10.69 లక్షల కుటుంబాలు విధుల్లో 42,840 మంది ఉద్యోగులు స్వగ్రామాలకు చేరుకున్న ప్రజలు కిక్కిరిసిన బస్సులు, రైళ్లు పల్లెల్లో పండుగ వాతావరణం సాక్షిప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. అన్ని సంక్షేమ పథకాలకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ సర్వే సమాచారమే ప్రామాణికమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రజలు సొంత ఊళ్ల బాట పట్టారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సర్వే కోసం ఊరికి వస్తున్నారు. వరంగల్ నగరం, ఇతర పట్టణాల్లో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజే ఉండడంతో అందరూ ఒకేసారి సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు వాహనాలు దొరకడం లేదు. సర్వే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. కార్మిక శాఖ సైతం ప్రత్యేకంగా సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచే అన్ని పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు సెలవును ప్రకటించేశాయి. అన్ని వర్గాల ప్రజలు ఒకేసారి ఊళ్లకు చేరుతుండడంతో గ్రామాల్లో పండగ వాతావరణ నెలకొంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి కొన్నేళ్లుగా ఊళ్లకు రాని వారు సైతం ఇప్పుడు సొంత ప్రాంతాలకు వచ్చారు. ఇతర దేశాల్లో స్థిరపడిన వారు సైతం సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చారు. సర్వే నిర్వహణ ఇలా.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 8,86,279 కుటుంబాలు ఉన్నాయి. సమగ్ర సర్వే నేపథ్యంలో వివరాలు తీసుకోవాల్సిన కుటుంబాల సంఖ్యను తేల్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్యను గుర్తించింది. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన జనాభా లెక్కల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్న కొందరు ఇప్పుడు వేర్వేరుగా నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాలో 10,69,506 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కుటుంబాల వివరాల సేకరణకు ప్రభుత్వ, కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగులు కలిపి 42,840 మందిని నియమించారు. ఒక్కో ఉద్యోగి సగటున 30 కుటుంబాల వివరాలను సేకరిస్తారు. మొదట ఒక ఉద్యోగికి 25 కుటుంబాలే అని నిర్ణయించారు. కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వివరాలు సేకరించే ఉద్యోగికి కుటుంబాలను పెంచారు. ఎన్నికల నిర్వహణ తరహాలోనే.. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందిని గ్రామాలకు తరలించేందుకు 1500 వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సర్వేపై టోల్ఫ్రీ నంబర్ల ఏర్పాటు సమగ్ర కుటుంబ సర్వేపై సందేహాలు, ఫిర్యాదులు ఉన్న వారి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా టోల్ఫ్రీ నెంబర్లును ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ కార్యాలయంలో 18004252747 నంబరుతో టోల్ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. అలాగే సందేహాలు ఉన్న వారు నేరుగా కలెక్టర్ జి.కిషన్ వినియోగించే 9000114547కు మెస్సేజ్ చేయవచ్చు. వరంగల్ నగర పరిధిలోని వారి కోసం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా 18004251980 టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. ప్రభుత్వం రూపొందించిన వివరాల సేకరణ పత్రంలోని అంశాలను ప్రజలు ఎన్యూమరేటర్(ఉద్యోగులకు)కు వివరించాల్సి ఉంటుంది. వివరాలు సేకరించే వారు... తమ ఇళ్లకు రాకున్నా, అనవసరమైన విషయాలును అడిగినా వీటికి ఫిర్యాదు చేయవచ్చు. -
సమైక్యాంద్ర భవిష్యత్తు పోరుపై ఏపీఎన్జీవోల సమావేశం


