breaking news
future of Andhra Pradesh
-
రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే..
కలెక్టర్లతో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కలెక్టర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈశా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్ఫుల్ లివింగ్’ శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లతో శనివారం సచివాలయంలో చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రానున్న నాలుగు నెలల కాలానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిందిగా వారికి సూచించారు. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు చొరవ చూపాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల అనుమతులు ఒకేసారి ఇచ్చేందుకు వీలుగా త్వరలో ఈ బిజ్వెబ్ను ప్రారంభించనున్నట్లు తెలిపా రు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఏప్రిల్ నుంచి ఐదు కిలోల చొప్పున బియ్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయని,విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుంద న్నారు. కేంద్రం ఏర్పాటు చేసే 12 విద్యా సంస్థలకు అవసరమైన స్థల సేకరణకు నిధుల కొరత లేదన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. ‘మిషన్ల’లో పాల్గొనేవారికీ శిక్షణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు మిషన్లలో భాగం పంచుకునే శాఖల అధికారులకు ఈశా ఫౌండేషన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అకడమిక్, ప్లానింగ్ విభాగం సంయుక్తంగా శిక్షణనివ్వనున్నాయి. ఒక్కో శాఖ నుంచి 30 మంది అధికారులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఐఎస్బీలో ఫిబ్రవరి 18న శిక్షణ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంతో పాటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించే ముఖ్యులు, అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఈశా ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం ఉమ్మడిగా చేపట్టిన మూడురోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసిం ది. అనంతరం సీఎం చంద్రబాబు, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్, ఐఎస్బీ ప్రతినిధులు.. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ 7మిషన్లు, స్మార్ట్ ఏపీ, విలేజ్ పథకాల జయ ప్రదానికి చర్చించారు. ఈశా ఫౌండేషన్ సహకారం కోరగా అందుకు జగ్గీ వాసుదేవ్ హామీ ఇచ్చారు. వాసుదేవ్ను ప్రభుత్వం తరఫున చంద్రబాబు సత్కరించారు. అన్ని ఫైళ్లు ఆన్లైన్లోనే: ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి, ఒక అధికారి నుంచి మరో అధికారికి వ్యక్తుల ద్వారా ఫైళ్ల తరలింపు నిలుపుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆన్లైన్లోనే కదలాలన్నారు. 2న విజయవాడకు బాబు: సీఎం ఫిబ్రవరి 2న వుంత్రివర్గ సవూవేశం అనంతరం విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమవుతోంది. అనంతరం విజయవాడ వెళ్తారు. -
'వైఎస్ఆర్ సీపీకి ఉజ్వల భవిష్యత్తు'
రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జయనామ సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలలో 140 నుంచి 145 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందన్నారు. ఎన్నికల తర్వాత అనేక పార్టీలు రాజకీయ ముఖ చిత్ర పటం నుంచి కనుమరుగుకాక తప్పదన్నారు.గ్రహగతులన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.వర్షాలు సకాలంలో పడతాయని,ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు.ఎన్ని పార్టీ లు ఒక్కటైన వైఎస్ఆర్ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు.