breaking news
Funding problems
-
చివర్లోనూ చిక్కులు!
ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి గ్రహణం వీడడం లేదు. కర్వెన మినహా చివరి దశలో ఉన్న నాలుగు రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులు కొన్నిచోట్ల నత్తనడకన సాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అటకెక్కాయి. నిధులు, పరిహారం చెల్లింపు సమస్యలే ఇందుకు ప్రధాన కారణం కాగా.. పనుల పూర్తికి సర్కారు మరోసారి డెడ్లైన్ (వచ్చే మార్చి) పొడిగించక తప్పని పరిస్థితి నెలకొంది.చివరి దశలో 4 రిజర్వాయర్ల పనులుమొదటి దశలో ఐదు రిజర్వాయర్లు.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్లో అంజనగిరి (6.80 టీఎంసీలు), వనపర్తి జిల్లా ఏదులలో వీరాంజనేయ (6.55 టీఎంసీలు), నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెంలో వెంకటాద్రి (16.58 టీఎంసీలు), మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వెనలో కురుమూర్తిరాయ (19.15 టీఎంసీలు), జడ్చర్ల మండలంలోని ఉద్ధండాపూర్ (15.91 టీఎంసీలు) నిర్మాణం చేపట్టారు.కర్వెన మినహా (ఇక్కడ నీళ్లు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు) నాలుగు చోట్ల పంప్హౌస్లు నిర్మించారు. మొత్తంగా సుమారు ఏడాదిన్నర క్రితమే అంజనగిరి 100 శాతం, వీరాంజనేయ 95, వెంకటాద్రి 90, కర్వెన 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఏదులలో రిజర్వాయర్ కట్టకు రివిట్మెంట్, ఉద్ధండాపూర్లో పంప్హౌస్ తవ్వకం, హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి కాగా.. సర్జ్పూల్, పంప్హౌస్ కాంక్రీట్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.ఆ 2.5 కి.మీ. పనులు పూర్తయితే జలకళనార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 16 కి.మీ.,ల సొరంగం పూర్తయింది. 8.3 కి.మీ.ల ఓపెన్ కెనాల్ నుంచి నీటిని తరలించాలి. ఇందులో కుడికుళ్ల, తిర్నాంపల్లి మధ్య 2.5 కి.మీ.,ల మేర మాత్రమే పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉండగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు రిజర్వాయర్లను నీటితో నింపే అవకాశం ఉంది.ఇంకా అసంపూర్తిగా ఉన్నవి..మొత్తం 18 ప్యాకేజీలకు గాను ప్యాకేజీ–12లో వట్టెం నుంచి కర్వెన వరకు ఓపెన్ కెనాల్ పనులు ఒక శాతమే మిగిలాయి. ప్యాకేజీ–4లో నార్లాపూర్ నుంచి ఏదుల వరకు టన్నెల్ నిర్మాణం పూర్తి కాగా.. 2.74 కి.మీ. మేర గ్యాంట్రీ లైనింగ్ పూర్తి కావాలి. ప్యాకేజీ–7లో ఏదుల నుంచి వట్టెం వరకు 14.853 కి.మీ మేర (ఎడమ), 5.287 కి.మీ.,ల మేర (కుడి) సొరంగాల గ్యాంట్రీ లైనింగ్.. 2.94 కి.మీ.,ల మేర ఎడమ.. 0.339 కి.మీ.,ల మేర కుడి సొరంగం బెడ్ లైనింగ్ పనులు పూర్తికావాల్సి ఉంది.తాగునీటి పనులు మాత్రమే..?నార్లాపూర్ పంప్హౌస్లో ప్రత్యామ్నాయంతో కలుపుకొని మొత్తం 8 మోటార్లు కాగా ఇప్పటివరకు 4 అమర్చారు. నెలరోజుల్లో 2, 3, 4 పంప్ల డ్రైరన్ చేపట్టనున్నారు. ఏదులలో 10 మోటార్లకు గాను ఐదింటిని డ్రైరన్కు సిద్ధం చేశారు. వట్టెంలో 10 మోటార్లకుగాను నాలుగింటి డ్రైరన్ పూర్తవగా.. ఐదోది డ్రైరన్కు సిద్ధంగా ఉంది. ఉద్ధండాపూర్లో ఆరింటికి మూడింటి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులను తాగునీటి అవసరాలకు ఉపయోగపడేవేనని స్పష్టమవుతోంది.నిధులు, పరిహార సమస్యలు..నార్లాపూర్, ఏదులలో రిజర్వాయర్ల పరిధిలో ఇళ్లు, భూములు కోల్పోయిన ముంపు ప్రాంతాల నిర్వాసితులకు సంబంధించి పరిహార సమస్యలు ఉన్నాయి. బండరావిపాకులలో 18 ఏళ్లు నిండిన వారికి 300 ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతోపాటు పరిహారం పక్కదారి పట్టిందంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అలాగే కొల్లాపూర్ మండలంలోని ముంపు ప్రాంతాలైన సున్నపుతండా, ఒడ్డె గుడిసెల్లో నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. ఫలితంగా ఆయా ముంపు ప్రాంతాల వారు ఖాళీ చేయకుండా అక్కడే నివసిస్తున్నారు. దీంతో ఆయా రిజర్వాయర్ల పరిధిలో మోటార్లు డ్రైరన్కు సిద్ధంగా ఉన్న ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. వట్టెంలో సుమారు రూ.200 కోట్ల నిధులు పెండింగ్లో ఉండడంతో పనులు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది.ప్రాజెక్టు వివరాలు⇒ పరిపాలన అనుమతులు: 10.06.2015⇒ లబ్ధి పొందే జిల్లాలు: 6 (నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ)⇒ పనుల ప్రారంభం: 2015 జూన్ 11(భూత్పూర్ మండలం కర్వెనలో ప్రాజెక్టు పైలాన్ను అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు)⇒ సాగు నీరందించే లక్ష్యం : 12.30 లక్షల ఎకరాలు⇒ తాగునీరు అందే ప్రాంతాలు: 70 మండలాలు, 1,226 గ్రామాలువ్యయ వివరాలు ఇలా.. ⇒ అంచనా వ్యయం: రూ.35,200 కోట్లు⇒ సవరించిన వ్యయం: రూ.55,086 కోట్లు⇒ సర్కారు తాజా అంచనా: రూ.80,000 కోట్లు -
సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలి
న్యూఢిల్లీ: తమకు రావాల్సిన రూ.1,200 కోట్ల సబ్సిడీ బకాయిలు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పార్లమెంటరీ ప్యానెల్ను ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ) కోరింది. పరిశ్రమ నిధుల సమస్యను ఎదుర్కొంటుండడం ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు అవరోధంగా నిలుస్తోందని పేర్కొంది. ‘‘ఇప్పుడు యావత్దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సరఫరా వ్యవస్థతో సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వద్ద రూ.1,200 కోట్ల సబ్సిడీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమ కలసి సమస్యలను పరిష్కరించుకుని, ఎలక్ట్రిక్ వాహన లక్ష్యాలను చేరుకునేందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది’’అని ఈవీ పరిశ్రమ కోరింది. ఫేమ్ పథకం కింద సబ్సిడీలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు సైతం తెలిపింది. ఫేమ్–2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు రూ.10వేల కోట్లను ప్రోత్సాహకాలను 2019 నుంచి ఇస్తోంది. -
హైదరాబాద్లో ఆగిన నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి కావట్లేదు. 2014, అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తికాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు రూ.11,810 కోట్ల విలువ చేసే 17,960 గృహా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వీటిలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైనవి 4,150 గృహాలున్నాయి. వీటి విలువ రూ.2,727 కోట్లని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి వంటివి నిర్మాణ ఆటంకాలకు ప్రధాన కారణాలని పేర్కొంది. హైదరాబాద్లో నిలిచిపోయిన గృహాలలో 36 శాతం ప్రీమియం విభాగంలోనివి కాగా.. 20 శాతం లగ్జరీ సెగ్మెంట్, 22 శాతం అందుబాటు గృహాలు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.5.05 లక్షల కోట్ల విలువ చేసే 6.29 లక్షల గృహా నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో 2014, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 1.74 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.40 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆగిపోయిన గృహాలలో 39 శాతం అంటే 2,47,930 యూనిట్లు రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మిడ్రేంజ్ విభాగంలోనివి. 32 శాతం (2,01,350 యూనిట్లు) రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలు, 18 శాతం (1,11,050 యూనిట్లు) రూ.80–1.5 కోట్ల ధర ఉండే ప్రీమియం విభాగంలోనివి, 68,300 యూనిట్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ విభాగంలోనివి. అత్యధికంగా ఎన్సీఆర్లో 1,13,860 గృహా నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ రూ.86,463 కోట్లు. -
‘జెట్’లో జోక్యం చేసుకోం
న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. ‘ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్మెంట్కి మధ్య వ్యవహారం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతాపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటరు మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయింది. బ్యాంకుల షరతులకు ఒప్పుకున్నా: గోయల్ జెట్ ఎయిర్వేస్కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వెల్లడించారు. జెట్ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల నిధులివ్వనున్నాయి. ఎగురుతున్నది 28 విమానాలే.. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది. మార్చి జీతాలు వాయిదా .. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికిల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 9న మరోసారి అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. షేరు 5 శాతం డౌన్.. విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది. -
కీలకం.. మూడో త్రైమాసికం!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిధులకోసం ఎదురు చూస్తున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో గడిచిన రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వం నుంచి అరకొర నిధులే విడుదల కావడంతో పలు కార్యక్రమాలు వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు.. మూడో త్రైమాసికంలో పెద్దమొత్తంలో నిధులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరుతో అర్ధవార్షికం ముగిసింది. ఈ క్రమంలో ఈనెలాఖరులో మూడో క్వార్టర్ నిధులు వస్తాయని భావించిన అధికారులకు ఎదురుచూపులే మిగిలాయి. నిధుల విడుదలకోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో యంత్రాంగం వేచిచూసే ధోరణిలో ఉంది. కీలక పథకాలన్నీ డీలా! చాలినన్ని నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలయ్యే ప్రధాన కార్యక్రమం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్. ఈ రెండు పథకాల కింద ఆయా శాఖల వద్ద 38వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిశీలన పూర్తి చేసిన అధికారులు ఆమేరకు మంజూరీలు కూడా ఇచ్చారు. కానీ సంక్షేమ శాఖల వద్ద నిధులు లేకపోవడంతో అవన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. గత రెండు త్రైమాసికాల్లో ఈ పథకాలకు పెద్దగా నిధులివ్వలేదు. ప్రస్తుతం ఈ రెండు పథకాల కింద రూ.400 కోట్లు అవసరం. తాజాగా మూడో త్రైమాసికంలో ఈమేరకు నిధులు విడుదల చేస్తే పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనుంది. మరోవైపు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల బకాయిలు సైతం కుప్పలుగా పేరుకుపోయా యి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.868.55 కోట్లు అవసరమని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు సంబంధించి దాదాపు ఐదు నెలలుగా సరైన మోతాదులో బడ్జెట్ విడుదల కాలేదు. మెస్ చార్జీలు, నిర్వహణ, కరెంటు బిల్లులు, పిల్లల దుస్తులకు సంబంధించిన కుట్టు కూలీ కలిపి రూ.125 కోట్లకు పైగా బకాయిలున్నాయి. కార్పొరేషన్లలో దా‘రుణం’... స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించే నిరుద్యోగ యువత ప్రథమంగా ఎదురు చూసేది కార్పొరేషన్ రుణాలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు 2018–19 వార్షిక సంవ త్సరంలో దాదాపు 6.45లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు కూడా కలుపుకుంటే దాదాపు 8లక్షలకు పైమాటే. కానీ ఈ ఏడాది కార్పొరేషన్ రుణాల పంపిణీ ఆశాజనకంగా లేదు. రెండేళ్ల క్రితం దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా పరిష్కరిస్తుండగా... బీసీ, ఎంబీసీ, మైనార్టీ కార్పొరేషన్లు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో దిక్కులు చూస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత బీసీ కార్పొరేషన్కు రూ.350 కోట్లు విడుదల చేశారు. 38వేల మంది నిరుద్యోగులకు రూ.50వేలలోపు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయగా... ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని సైతం వాయిదావేశారు. మైనార్టీ కార్పొరేషన్కు సైతం ప్రత్యేకంగా నిధులు విడుదల కాకపోవడంతో దరఖాస్తు పరిశీలనను ఆ శాఖ అధికారులు అటకెక్కించారు. -
వెనుకబాటు
స్వయం ఉపాధి కల్పనలో లక్ష్యానికి దూరంగా మెప్మా - నిర్దేశించిన లక్ష్యం 600 యూనిట్లు - ఏర్పాటు చేసిన యూనిట్లు 179 - ఈ ఏడాది నుంచి ఎస్జేఎస్ఆర్ రద్దు - ఎన్ఎల్యూఎం పేరిట అమల్లోకి సబ్సిడీ లేని కొత్త పథకం సాక్షి, కర్నూలు: పట్టణ ప్రాంతాల్లోని పొదుపు గ్రూపు సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా వ్యక్తిగత, సామూహిక రుణాల అందజేతలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వెనుకబడింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.6 కోట్లతో స్వయం ఉపాధి పథకం(యూఎస్ఈపీ) కింద జిల్లాలోని నగరపాలక సంస్థ, తొమ్మిది పురపాలక సంస్థల్లో 600 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 179 యూనిట్లు మాత్రమే నెలకొల్పడం గమనార్హం. అదేవిధంగా సంఘం మొత్తానికి అర్బన్ ఉమెన్ సెల్ఫ్ ప్రోగ్రాం(యూడబ్ల్యుఎస్పీ) కింద ఆరు యూనిట్లకు గాను ఎమ్మిగనూరులో ఐదు, కర్నూలులో ఒక్కటి మాత్రమే ఏర్పాటు చేయించగలిగారు. కర్నూలు, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు మినహా మిగిలిన ఆరు పురపాలక సంస్థల్లో లక్ష్యానికి అనుగుణంగా దరఖాస్తులు కూడా అందని పరిస్థితి నెలకొంది. బ్యాంకర్లు అంగీకార పత్రాలు ఇవ్వకపోవడం.. యూనిట్ల స్థాపనలో స్పష్టమైన విధానాన్ని లబ్ధిదారులు పాటించకపోవడం.. ఈ విషయంలో మెప్మా సిబ్బంది సలహాలు, సూచనలను అందివ్వలేకపోవడం అందుకు కారణమవుతోంది. స్వయం ఉపాధి పథకాలకు రూ.25 వేల వరకు రాయితీ లభిస్తోంది. సంఘాల ద్వారా పొందే రుణాలకు రూ.3 లక్షల వరకు రాయితీ ఉంటుంది. ఈ రెండు పథకాలకు సంబంధించి పురపాలక సంస్థల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన పురోగతి పరిశీలిస్తే ఆ శాఖ పనితీరు ఇట్టే అర్థమవుతోంది. మొత్తం రూ.6 కోట్ల వ్యయంతో 606 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా.. నిధుల లేమి కారణంగా 179 యూనిట్లు (29.53 శాతం) మాత్రమే స్థాపించగలగడం గమనార్హం. ఇదిలా ఉండగా స్వర్ణ జయంతి సహరీ రోజ్గార్(ఎస్జేఎస్ఆర్) పథకాన్ని ఈ ఏడాది నుంచి కేంద్రం రద్దు చేసింది. దీంతో ఈ పథకం ద్వారా మెప్మా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూఎస్ఈపీ కింద వ్యక్తిగత, సామూహిక రుణాల మంజూరు నిలిచిపోనుంది. అయితే కొత్తగా నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్(ఎన్ఎల్యూఎం) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్జేఎస్ఆర్ తరహాలో ఈ పథకం కింద రుణాలు పొందే లబ్ధిదారులకు సబ్సిడీ వర్తించదు. కేవలం తక్కువ వడ్డీకి మాత్రమే రుణాలను అందజేస్తారు. ఈ కొత్త పథకం 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల మున్సిపాలిటీల్లోని స్వయం సహాయక సంఘాలకు మాత్రమే వర్తింపజేయనున్నారు. వ్యక్తిగతంగా 1,038.. సామూహికంగా 14 యూనిట్లకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిధుల సమస్య ఉంది ఈ ఏడాది రూ.6 కోట్ల నిధులు కేటాయించగా ప్రభుత్వం మూడు విడతల్లో రూ.70 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. వచ్చిన నిధులను మంజూరైన యూనిట్లకు కేటాయించాం. నిధుల సమస్యను సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి నివేదించాం. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో నిధుల సమస్య తలెత్తింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. - రామాంజనేయులు, పీడీ, మెప్మా


