breaking news
FSB
-
ఆధార్కు అంతర్జాతీయంగా ప్రశంసలు
హాంబర్గ్ : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ పథకం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బ్యాంకింగ్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయడానికి, నగదు వ్యవహారాలను తగ్గించడానికి భారత్ ఆధార్ను వినియోగిస్తోందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్(ఎఫ్ఎస్బీ) అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్లో ఆధార్ వినియోగం వల్ల రెమిటెన్స్ చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలు తగ్గే అవకాశమున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక విధానాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కరస్పాండెంట్ బ్యాంకింగ్ కోఆర్డినేషన్ గ్రూప్(సీబీసీజీ)ను ఎఫ్ఎస్బీ ఏర్పాటుచేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర దేశాధినేతలు శుక్రవారం నాడిక్కడ జీ–20 సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో ఎఫ్ఎస్బీ తన కార్యాచరణను సమర్పించింది. -
71 లక్షల కోట్ల డాలర్లకు షాడో బ్యాంకింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా షాడో బ్యాంకింగ్ వ్యవస్థ పరిమాణం గతేడాది 5 లక్షల కోట్ల డాలర్ల(ట్రిలియన్) మేర ఎగిసి 71 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో భారత్ సహా పలు దేశాల బ్యాంకులు ఆయా షాడో బ్యాంకింగ్ సంస్థలకి ఇచ్చిన నిధుల పరిమాణం కూడా పెరిగింది. స్విట్జర్లాండ్కి కేంద్రంగా పనిచేసే ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల బోర్డు ఎఫ్ఎస్బీ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి రాకుండా జరిగే బ్యాంకింగ్ లావాదేవీలు మొదలైన వాటిని షాడో బ్యాంకింగ్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఈ కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరిగిపోతుండటం.. ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెచ్చిపెట్టగలవని ఇటీవలి ఆర్థిక సంక్షోభం తెలియజెప్పడంతో ఇటువంటి వాటిపై ఆందోళనలు నెలకొన్నాయి. బ్యాంకులు స్వయంగా రుణాలివ్వడం వల్ల వచ్చే రిస్కులతో పాటు, ఇతరత్రా రుణాలు మంజూరుకు మధ్యవర్తిత్వ షాడో బ్యాంకింగ్ సంస్థలపై ఆధారపడటం వల్ల వచ్చే రిస్కులూ భారత్, ఇండోనేషియా, సౌదీలో భారీగా పెరిగాయని ఎఫ్ఎస్బీ పేర్కొంది.