breaking news
found murdered
-
న్యూఢిల్లీలో 'మరో మణిపురి' దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మణిపురికీ చెందిన జింగ్రామ్ కెన్గో (33)ను ఆగంతకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆగంతకులు పరారైయ్యారు. జింగ్రామ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హస్తినలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో గత రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య దొంగతనం కోసం చేసినదిగా లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. జింగ్రామ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. పీహెచ్డీ చేసేందుకు మృతుడు జింగ్రామ్ నెల క్రితమే మణిపూర్ నుంచి హస్తినకు తరలి వచ్చాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో జింగ్రామ్ పీహెచ్డీ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
మహిళా ప్రొఫెసర్ దారుణ హత్య
కళాశాలలో ప్రొఫెసర్గా పని చేస్తున్న మహిళ (30) దారుణ హత్యకు గురైన సంఘటన ఈరోడ్లోని సుబ్రమణ్యనగర్లో చోటు చేసుకుంది. ప్రొఫెసర్ ఇంట్లోని పని మనిషి స్థానికులు సహయంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళ ఒంటిపై ఉన్న నగలు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాంతో ప్రొఫెసర్ హత్యపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య నిన్న రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా హత్యకు గురైన యువతికి సంబంధించిన వివరాలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. భర్త మెడికల్ రిప్రజెంటేటీవ్గా పని చేస్తున్నారని, అలాగే హత్యకు గురైన యువతి తిరుచన్గోడ్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు స్థానికులు వెల్లడించారు. ఈ కేసులో భర్తను విచారించవలసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు వివరించారు.