breaking news
former deputy speaker
-
వాళ్లను పోలింగ్ బూత్ నుంచి తరిమికొట్టండి!
పశ్చిమ బెంగాల్: ప్రత్యర్ధి పార్టీ నాయకులను పోలింగ్ బూతుల నుంచి బయటకు లాగి చితక్కొట్టాలని కార్యకర్తలకు ఫోన్ ద్వారా చెప్తూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి సోనాలి గుహా చిక్కుల్లో పడ్డారు. సత్గాచియా ప్రాంతంలోని పోలింగ్ బూతులో ఈవీఎం సరిగా పనిచేయడం లేదంటూ ఆమె ఈసీకి చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో పోలింగ్ బూతులోకి ఆమె వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డగించడంతో ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మమత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన సోనాలీ.. సీపీఎం వాళ్ల వల్లే ఈవీఎం పగిలిపోయిందని, వాళ్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు ఈడ్చి తరిమికొట్టాలని ఫోన్ లో కార్యకర్తలకు చెప్పారు. ఓటర్లందరూ తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనాలి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది. సోనాలిపై కేసు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
అవమానాలు ఇక భరించలేను
మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరు టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం మలికిపురం, న్యూస్లైన్ : తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకూ ఎదురైన అవమమానాలు చాలని, ఇక భరించే ఓపిక తనకు లేదని ఆ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరు వెంకట సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మలికిపురంలో బుధవారం రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన మాట్లాడుతూ 1983లో రంపచోడవరంలో రూ.500 జీతానికి ఉద్యోగం చేసుకుంటున్న తనను స్వర్గీయ ఎన్టీ రామారావు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయించారన్నారు. డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన తనను ప్రస్తుతం పార్టీ శ్రేణులు తీవ్రంగా అవమాన పరుస్తున్నాయన్నారు. తనకు టీడీపీ అంటే చాలా ఇష్టమని, అయితే నాయకులు వైఖరి వల్ల ఇక పార్టీ సమావేశాలకు హాజరు కానని స్పష్టం చేశారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తన శిష్యుడని, ఆయనను తానే ఇండిపెండెంట్గా బరిలోనికి దింపానంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు దుష్పచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రచారాన్ని ఆపకపోతే సహించేది లేదని పేర్కొన్నారు. కాగా అల్లూరి మాటలకు వేదికపై ఉన్న అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు ఇతర నాయకులు షాక్ తిన్నారు. ప్రసంగం అయిన వెంటనే ఏవీఎస్ రాజు వెళ్లి పోయారు.