-
ముద్దొచ్చే అబ్బాయిలు
స్టేజీ మీద ఈ అబ్బాయిలను చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గమీద ముద్దుల వర్షం కురిపిస్తారని ‘లావణి’ నాట్య బృందాలలో ఒక బృందానికి సారథి అయిన హంకారే చిరునవ్వుతో చెబుతున్నారు. స్త్రీ వేషం ధరించి, థీమ్ని మార్చి యువకులు చేస్తున్న ప్రాచీన ‘లావణి’ నాట్య రూపకాలకు మహారాష్ట్రలో ఇప్పుడు అమితమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. పాటలు పాడుతూ, నాట్యం చేసే జానపద కళకు ‘లావణి’ అని పేరు. ఇటీవల కొంతకాలంగా మహారాష్ట్ర యువకులు స్త్రీ వేషధారణతో ఈ కళను పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ‘లావణి’ తో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ‘నాట్యం చేస్తున్న ఆ మూడు గంటలూ మమ్మల్ని మేం మరచిపోతాం’ అంటాడు ఆనంద్ సతామ్ అనే లావణి నాట్యకారుడు. మహారాష్ట్ర పట్టణప్రాంతాల్లో అమ్మాయి రూపంలో నాట్యం చేస్తున్న వందలాదిమందిలో ఆనంద్ సతామ్ ఒకరు. జనవరి 25న ముంబైలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ లో సావిత్రి మేధాతుల్ రచించిన సంగీత రూపకం ‘సంగీత బరి’లో ఆనంద్ సతామ్ తో పాటు కామ్తే అనే యువకుడు ‘లావణి’ ని ప్రదర్శించాడు. ఈ నాట్యం చేసేవారి కదలికలు.. వేదిక మీదే కాదు, వేదిక బయట కూడా స్త్రీలాగే మారుతుంటాయి. దాంతో మగపిల్లలు ఆడపిల్లలుగా మారిపోతారేమోననే భయంతో కుటుంబ సభ్యులు వారిని ఈ పాత్రలు వెయ్యొద్దని నిరోధించేవారు. కాని సతామ్, కామ్తే ఇద్దరూ లావణి నాట్యాన్ని ప్రదర్శించడానికే ఉత్సాహం చూపించారు. ‘‘ఒకప్పుడు నన్ను ఈ నాట్యం చేయొద్దని చెప్పినవారే, ఇప్పుడు నా నాట్యం చూసి గర్వపడుతున్నారు, నా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు’ అంటాడు కామ్తే. ఉన్నవి రెండు విధానాలు పట్ణణ ప్రేక్షకులు లావణి కళారూపాన్ని మోహవాంఛకు రిఫ్లెక్షన్గా భావిస్తుంటారు. వాస్తవానికి ఈ నాట్యంలో ఆధ్యాత్మికత, వేదాంతం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఉంటుంది. ప్రధానంగా అయితే ‘లావణి’ని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ‘దోల్కీ ఫాడ్ తమాషా’, ‘సంగీత్ బరి’. దోల్కీ ఫాడ్ తమాషాలో లావణి ప్రదర్శన నాలుగు నుంచి ఎనిమిది గంటలపాటు నడుస్తుంది. ఇందులో కళాకారులు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూంటారు. గ్రామాలలో వారంవారం పెట్టే గ్రామసంతలో, పశువుల సంతలలో ఎక్కువమంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శిస్తారు. సంగీత్ బరిలో.. గుంపులుగా, సంచరిస్తూ, కొద్దిమంది ప్రేక్షకుల ముందు కూడా నటిస్తారు. వీరికి ఏడాదికి సరిపడా కాంట్రాక్టు ఉంటుంది. సాధారణంగా ఆడవారు మాత్రమే సంగీత్ బరిలో నటిస్తు్తంటారు. ముఖ్యంగా భాటు కోల్హాటి లేదా కళావంతుల కుటుంబాలకు చెందినవారు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. వారి ఆచారం ప్రకారం ఈ కుటుంబాలలోని మహిళలు వివాహానికి అనర్హులు. వీరు కేవలం వేశ్యావృత్తిలో మాత్రమే జీవించాలి. కొత్తగా మూడో విధానం కామ్తే, సతామ్ల ప్రదర్శనలు మూడోరకానికి చెందినవి. వీటిని బ్యానర్ ప్రదర్శనలు అంటారని చెబుతారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన పి.హెచ్డీ స్కాలర్ సేజల్ యాదవ్. ఈయన లావణి ప్రదర్శకుల మీద విస్తృతంగా పరిశోధన చేశారు. 2016లో ‘లావణి లైవ్’ పేరున ఒక ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు. లావణి ప్రదర్శనలాంటివే సమకాలీనంగా ఎన్నో ఉన్నాయి. ప్రతివారికి వారి సొంత ఆలోచన ఉంటుంది. లావణిలోని అసలు విషయాన్ని వీరు పక్కకు తోసేసి, సొంతంగా రూపొందించుకుంటూ, అందరినీ వారి గుంపులో చేర్చుకుంటున్నారు. లావణిని ప్రదర్శించేవారిలో ఒకరైన ‘హంకారే బృందం’ సుమారు మూడుమాసాల పాటు లావణిలా నటించడానికి సాధన చేస్తుంది. అమ్మాయిలా నడవటం, అమ్మాయిలా మాట్లాడటం వంటివి రంగస్థలం మీద ప్రదర్శించడానికి ముందే నేర్చుకుంటారు. వారిని చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపిస్తారని చెబుతారు బృంద సారథి హంకారే. ఇక ‘బిన్ బేకాంచా తమాషా’ అనే మరో విధానం అయితే చాలా కాలం విజయవంతంగా నడిచింది. కాని నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, బుకింగ్స్ తగ్గిపోవడంతో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఈ క్రమంలోనే లావణిలో వినూత్న శైలులకు బీజాలు పడ్డాయి. కామ్తే, సతామ్ సంగీత్ బరి విధానంలో ఇస్తున్న ప్రదర్శనలైతే పట్టణ ప్రజలలో వివిధ వర్గాల వారి మధ్య ఉన్న దూరాన్ని తుడిచివేస్తున్నాయి. – జయంతి తొమ్మిది గజాల చీర ఢోల్కీ అనే వాద్య పరికరం వాయిస్తూంటే ఈ లావణి నాట్యం చేస్తుంటారు. తొమ్మిది గజాల చీర ధరించి మహిళలు ఈ నాట్యం చేస్తారు. నాట్యానికి పాడే పాటలో వేసే దరువు చాలా వేగంగా ఉంటుంది. లావణ్య అనే పదం నుంచి లావణి పదం వచ్చింది. ఈ పదానికి ‘అందమైన’ అని అర్థం. మరాఠీలోని లావణే అనే పదం నుంచి వచ్చినట్టు చెబుతారు. -
గండికోట ఉత్సవాలకు జానపద కళ
కడప కల్చరల్ : నవంబరులో జరగనున్న గండికోట వారసత్వ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా జానపద బ్రహ్మోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్సవాలలో అటు జానపద కళలు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు జిల్లా కళాకారులను కూడా ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి చెక్కభజన, జడకోలాటం, కోలాటం తదితర జానపద ప్రక్రియలకు ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జానపద కళా బృందాలు, తిరుమల–తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టులో నమోదై ఉంటాయి. జిల్లా అధికారులు ఈ ఉత్సవాల కోసం ఆ ప్రాజెక్టు అధికారులను కొన్ని నాణ్యమైన కళాబృందాలను జిల్లాకు పంపాలని కోరారు. టీటీడీ అధికారులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. ఉత్సవాల రెండు రోజుల్లోనూ టీటీడీ ప్రాజెక్టు పక్షాన కొన్ని కార్యక్రమాలను స్పాన్సర్ చేయనున్నట్లు తెలుస్తోంది. గండికోటలో ఉత్సవాల నిర్వహణకు ఐదెకరాల స్థలాన్ని చదును చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రతిష్ఠాత్మకంగా.. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే అవకాశం ఉంది. నవంబరు 10లోపుగానీ, 23 తర్వాత గానీ ఉత్సవాల నిర్వహణకు తేదీలు ఖరారు కానున్నాయి. ఇందులో అన్ని నాణ్యతగల కార్యక్రమాలను ఎంపిక చేసేందుకు సంబంధిత అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే శాస్త్రీయతను ప్రతిబింబించే నృత్యాలు, ఇతర కార్యక్రమాలతోపాటు ఆధునికత కడా మేళవించిన ‘ఫ్యూజన్’ నృత్యాలను కూడా ప్రదర్శనలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలువురు ప్రముఖ మిమిక్రీ కళాకారుల ప్రదర్శనలు, భారతదేశానికి ప్రతిష్ఠాత్మకంగా నిలిచే నృత్య భారతీయం లాంటి అన్ని రాష్ట్రాల నృత్య రీతుల సమ్మేళనాలను ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement