-
పదవుల మేళా
స్వల్ప వ్యవధిలోనే ఐదు ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు పండగ ఏ పదవులకైనా సై అంటున్న నేతలు ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్న పార్టీలు కొత్తవాళ్లతో నిండిపోతున్న వైనం సాక్షి, ఏలూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలన్నీ ఒకేసారి రానే వచ్చేశాయి. రాజకీయ నిరుద్యోగుల నెత్తిన పాలుపోశాయి. ఈసారి ఏదో ఓ పదవి తప్పక వరిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న నేతలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎలాగైనా టికెట్ సంపాదించాలని వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఆశావహులకు సీట్లు సర్దుబాటు చేయడంలో అధినాయకులు తల మునకలయ్యారు. రాజకీయం అనే రొంపిలోకి వెళ్లకూడదనే అపోహల నుంచి బయటపడి కొత్తవారు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరికి చావోరేవో! ఎన్నికల్లో ఏదో ఓ పదవి సంపాదించకపోతే ఈసారి కొందరికి రాజ కీయ భవిష్యత్ ఉండని పరిస్థితి. వారిలో గల్లీ నాయకుడి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్య మం కారణంగా కొందరికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయే ప్రమా దం ఏర్పడింది. ఈ కోవకు చెందినవారే జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రి. సమైక్యాంధ్ర నినాదంతో పదవిని చేపట్టి అనంతరం అధిష్టానానికి జై కొట్టడంతో అతనిపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈ ఎన్నికలు ఆయనకు చావోరేవోగా మారాయి. అలాగే జిల్లాకు చెందిన మరో మంత్రికీ ఇవి చివరి ఎన్నికలు కానున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధికార చెలాయించిన పార్టీ లో ఉన్న ఈ నేతా ప్రజాగ్రహాన్ని చవిచూడనున్నారు. స్థానిక సమరంపై దృష్టి మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో కొందరు మునిసిపల్ చైర్మన్ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. తమ అనుయాయులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీల అధిష్టానాల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలు కూడా టికెట్ పంపకాల్లో సమస్యలు తలెత్తకుండా ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్నాయి. అసెంబ్లీ టికెట్ కుదరకపోతే మునిసిపల్ చైర్మన్, అదీ కుదరకపోతే జెడ్పీటీసీ టికెట్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరికి ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటున్నారంటే ప రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇవేవీ కుదరకపోతే వాటిని మించిన నామినేటెడ్ పదవి ఇస్తామంటూ ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాతవారిపై వ్యతిరేకత ఉన్నచోట కొత్తవారిని బరిలోకి దిం చాలని భావిస్తున్నారు. ఏదైనా పర్లే దు టికెట్ ఇస్తే చాలంటూ కొందరు నేతలు సర్దుకుంటున్నారని పలువు రు గుసగుసలాడుతున్నారు. -
పంచతంత్రం
సాక్షి, ఏలూరు: ఓటరన్నకు పండగొచ్చింది.. నా యకులకు చిక్కొచ్చింది.. ఒకేసారి తరుముకొచ్చిన ఎన్నికలతో ప్రజలు ఉబ్బితబ్బిబవుతుండగా.. రాజకీయ పక్షాలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సార్వత్రిక పోరుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మునిసిపల్ ఎన్నికలతో సతమతమవుతున్న వారిని ‘ప్రాదేశిక’ పోరు ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలల వ్యవధిలో మునిసిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం వీరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నేడు ‘ప్రాదేశిక’ నోటిఫికేషన్ జిల్లాలో ఏలూరు కార్పొరేషన్తో పాటు నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి ఈనెల 30న ఎ న్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే వీటి వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలిన నేత లకు ఇప్పుడు హఠాత్తుగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రానుండటం కలవరపెడుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లాలో 46 జెడ్పీటీసీ, 903 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏప్రిల్ 6న వీటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానేవచ్చింది. జిల్లాలో 15 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. మూడేళ్లుగా తాత్సారం జిల్లాలో నగరపాలక సంస్థ, మునిసిపాలిటీలకు 2010 సెప్టెంబర్తో గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారులను నియమించి వీటిలో పాలన సాగిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవులు 2011 జులైతో ముగిశాయి. దివంగత సీఎం వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో పాలన ఉన్నా లేనట్టుగానే మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా పరిస్థితి చక్కబడలేదు. దీనిని గమనించిన కాంగ్రెస్ పెద్దలు ఎన్నికలు నిర్వహించకుండా జనాభా లెక్కలు, రిజర్వేషన్లు పేరుతో ఇప్పటివరకు తాత్సారం చే స్తూ వచ్చారు. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో వీటికి మోక్షం కలిగింది. ఖంగు తిన్న కాంగ్రెస్ గత జులైలో పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ ధైర్యం చేయలేకపోయింది. ఈలోపు రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. దీంతో పాలకులు స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఎన్నికలు జరపాల్సిందేనని ఆదేశించడంతో తప్పనిసరై నోటిఫికేషన్లు వెలువరిస్తున్నారు. దీంతో ఇటు నాయకులు అటు అధికారులు పరుగులు తీస్తున్నారు. ఏర్పాట్లలో యంత్రాంగం, అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఎక్కడ చూసినా వీటిపై చర్చలే కనిపిస్తున్నాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement