breaking news
first test hundred
-
శతకాలతో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. పాక్ బౌలర్లకు చుక్కలు
3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి వేదికగా ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్లో పరుగుల వరద పారిస్తుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ వన్డేల తరహాలో బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్కోర్ 227/0గా ఉంది. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా దక్కంచుకోలేకపోయారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ టీమ్లో గుర్తు తెలియని వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా 14 మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జోరూట్ మినహా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అస్వస్థతను జయించి బెన్ డకెట్ సెంచరీ సాధించడం విశేషం. డకెట్కు ఇది టెస్ట్ల్లో తొలి శతకం. -
సచిన్ మొదటి సెంచరీకి 30 ఏళ్లు
సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయి. సచిన్ ఆటకు వీడ్కోలు పలికి ఏడేళ్లు అయిపోయింది.. అయినా ఇప్పటికి అతని గురించి ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రస్తుత టీమిండియా జట్టులో ఉన్న సగం మంది ఆటగాళ్లు అతని ఆటతీరును చూస్తూ పెరిగిన వారే. దేశంలో క్రికెట్ను ఒక మతంగా భావించే అభిమానులు సచిన్ను క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తారు. క్రికెట్ ఉన్నంతకాలం సచిన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.. కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు సాధించిన సచిన్.. టెస్టుల్లో మొదటి సెంచరీ సాధించి సరిగ్గా ఈరోజుతో 30 ఏళ్లయింది. సచిన్ సాధించిన మొదటి సెంచరీకి సంబంధించిన ఫోటోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది.(ఎక్కడైనా ధోనియే నెంబర్ వన్) 1990లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆగస్టు 14న 17 ఏళ్ల వయసులో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. ఆరోజు మొదలైన సెంచరీల మోత నిరంతరాయంగా 23 ఏళ్ల పాటు కొనసాగింది. 1989లో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో మొదటి సెంచరీ చేయడానికి 8 టెస్టుల వరకు ఆగాల్సి వచ్చింది. ఆ మ్యచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు గ్రహం గూచ్, మైకెల్ ఆర్థర్టన్, రాబిన్ స్మిత్లు సెంచరీలతో చెలరేగడంతో 519 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ధీటుగానే బదులిచ్చింది. అప్పటి కెప్టెన్ మమ్మద్ అజారుద్దీన్ 179 పరుగులతో కథం తొక్కడంతో పాటు సచిన్ 68 పరుగులు చేయడంతో 432 పరుగుల చేసింది. అనంతరం అలన్ లాంబీ సెంచరీతో 320 పరుగులు చేసిన ఇంగ్లండ్ భారత్ జట్టుకు 407 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన సచిన్ 225 నిమిషాల పాటు క్రీజులో ఉన్న సచిన్ 189 బంతులెదుర్కొని 119 పరుగులు సాధించాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 343/6 వద్ద నిలిచి డ్రాగా మిగిలిపోయింది. #OnThisDay in 1990, a 17-year-old Sachin Tendulkar hit his maiden Test hundred and the rest is history ... Which is your favourite 💯 from the Master Blaster? pic.twitter.com/SPwjYhEUrM — ICC (@ICC) August 14, 2020 కానీ ఆ మ్యాచ్ సచిన్కు మాత్రం మాధురానుభూతిగా మిగిలిపోయింది.. ఎందుకంటే సచిన్ తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడంతో పాటు.. అతి తక్కువ వయసులో టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. సచిన్ తన 24 ఏళ్ల కెరీర్లో 463 వన్డేల్లో 18,426 పరుగులు, 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. మొత్తం 100 సెంచరీలు సాధించిన సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. సచిన్ రికార్డును అందుకోవడం ఇప్పటితరంలో కష్టమే అని చెప్పొచ్చు. మొదటి సెంచరీ సాధించి 30 ఏళ్లయిన సందర్బంగా సచిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నేను అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్లోనే పాకిస్తాన్ బౌలర్లైన వకార్ యూనిస్, వసీం అక్రమ్ బౌలింగ్ను ఎదుర్కొన్నా. వకార్ వేసిన ఒక బంతి బౌన్సర్గా వచ్చి నా ముక్కును పచ్చడి చేసింది. అయినా ఏమాత్రం బెదరకుండా ఆడాను. . ఒకవైపు ముక్కు నుంచి రక్తం కారుతున్నా.. నొప్పిని భరించి అర్థ సెంచరీ సాధించి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించా. ఎంత కష్టం వచ్చినా క్రికెట్ను మాత్రం వద్దలొద్దని ఆరోజే నిర్ణయించుకున్నా. తర్వాతి రోజుల్లో వంద సెంచరీలు చేస్తానని నేను కూడా అనుకోలేదు.' అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. అయితే యాక్సిడెంటల్గా ఇదే రోజుకు మరో విశేషం కూడా ఉంది. లెజెండరీ బ్యాట్స్మెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ ఆటకు గుడ్బై చెప్పిన రోజు కూడా ఇదే. తాను ఆడిన చివరి టెస్టు మ్యాచ్ చివరి ఇన్నింగ్స్లో పరుగులు ఏం చేయకుండానే డక్గా వెనుదిరిగాడు. 1948 ఓవల్లో జరిగిన ఆ మ్యాచ్లో బ్రాడ్మన్ కేవలం 4 పరగులు చేసి ఉంటే బ్యాటింగ్ సగటు 100తో కొత్త రికార్డు నమోదయ్యుండేది. (ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు : నెహ్రా) -
సచిన్ పేరు మార్మోగిన వేళ..
► ఇంగ్లండ్ పర్యటనతో వెలుగులోకి సచిన్ ► నేటితో తొలి సెంచరీ చేసి 26 ఏళ్లు న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ వరల్డ్ కప్-1983 గెలిచిన తర్వాత భారత్లో ఆటపై మక్కువ కాస్త పెరిగిన మాట వాస్తవమే.. కానీ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట చూసిన తర్వాత నుంచి ఎంతో మంది క్రికెట్ పై ఆసక్తి పెంచుకుని బ్యాట్ పట్టారు. 16 ఏళ్ల వయసులో 1989లో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్ పాకిస్తాన్ పై 93, న్యూజీలాండ్ పై 88 పరుగులు చేసి తనలో ప్రతిభ ఉందని చాటిచెప్పాడు. ఉపఖండం బయట తాను ఆడిన రెండో టెస్టు సిరీస్ తో వెలుగులోకి సచిన్ వచ్చాడు. 1990లో ఇంగ్లండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు లార్డ్స్ లో 247 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ దాదాపు అదే పరిస్థితి..407 పరుగుల లక్ష్యంతో అజహరుద్దీన్ నేతృత్వంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 127 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో చిచ్చరపిడుగు సచిన్ క్రీజులోకొచ్చాడు. మరోసారి దారుణ ఓటమి తప్పేలా లేదని భావించిన టీమిండియా సచిన్ అజేయ సెంచరీ(119 నాటౌట్, 17 ఫోర్లు) సహాయంతో 6 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసి టెస్టు డ్రాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. 51 టెస్టు సెంచరీలు సాధించిన సచిన్కు జట్టును ఓటమి నుంచి తప్పించిన తొలి టెస్టు శతకం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. నేటితో ఆ ఇన్నింగ్స్(సచిన్ తొలి సెంచరీ) 26 ఏళ్లు(ఆగస్టు 1990) పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి రిటైరయ్యే వరకూ తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను సచిన్ చేరుకున్నాడు.