-
సప్తవర్ణ శోభితం.. ముగింపు ఉత్సవం
♦ అంబరాన్నంటిన సంబురాలు ♦ కనువిందు చేసిన కళారూపాలు ♦ ఇంద్రధనుస్సును తలపించిన ట్యాంక్బండ్ ♦ కదలివచ్చిన సకల కళలు.. సబ్బండ వర్ణాలు ♦ హాజరైన గవర్నర్, ముఖ్యమంత్రి దంపతులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి అవతరణ వేడుక ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. ఏడు రోజుల పాటు సాగిన ఉత్సవాలు ఆదివారం రాత్రి హైదరాబాద్ హుస్సేన్ సాగర తీరంలో సప్తవర్ణ శోభితంగా ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, కళా వైభవం ఉత్సవాల్లో సమున్నతంగా ప్రతిబింబించింది. నింగిలో విరిసిన వెలుగు పూలు.. సాగర తీరంలో లేజర్ షో తళుకులు... అందుకు అనుగుణంగా తెలంగాణ కళారూపాలతో ప్రతిధ్వనించిన సంగీతం.. ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. రంగు రంగుల విద్యుద్దీపాల కాంతులలో బుద్ధ విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ముగింపు వేడుక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. దాదాపు లక్ష మందికి పైగా రావడంతో ట్యాంక్బండ్ జనసంద్రమైంది. తెలంగాణ ఆటాపాటా, బతుకమ్మలు, బోనాలు, పీర్లు, ఒగ్గుడోళ్లు, చిందు యక్షగానాలు, బైండ్ల కథలు, శారద కథలు, గుస్సాడీ నృత్యాలు సహా తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రతిబింబించే వందలాది కళారూపాలు ట్యాంక్బండ్కు తరలివచ్చాయి. పారిశుధ్య కార్మికుల స్వచ్ఛ హైదరాబాద్ ప్రదర్శన, పోతురాజుల నృత్యాలు, కోలాటాలు, లంబాడా నృత్యాలు కన్నుల పండువగా సాగాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కళా తోరణాన్ని తలపించే విధంగా ట్యాంక్ బండ్పై భారీ వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్కు లడ్డూ తినిపించారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాశంలో ప్రతి బింబించే ‘రోబో పతంగులను’ గవర్నర్, సీఎంలు వేదికపై నుంచి ఎగురవేశారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపుగా వచ్చిన వేలాది మంది కళాకారుల విన్యాసాలను వేదికపై నుంచి తిలకించారు. ఈ వేడుకలకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, భాషా సంస్కృతి శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ సారథ్యంలో ఆరువేల మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉత్సవాలకు దూరంగా ఓయూ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దూరంగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్రంగా.. ఉద్యమ రణరంగంగా ఉన్న ఓయూ క్యాంపస్లో ఉత్సవాల ఊసే లేకపోవడం చర్చనీయాంశమైంది. గత వారం రోజు లుగా రాష్ట్రమంతటా అవతరణ ఉత్సవాలు జరుపుకొని ఆదివారం ముగిసినా ఓయూ క్యాంపస్లో ఒక్క విద్యార్థి సంఘం కూడా ఉత్సవాలు జరిపేందుకు ముందుకు రాలేదు. అధికార పార్టీ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ ఉత్సవ తొలిరోజున కేక్ కోసి జెండా ఎగురవేయగా ఇతర విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకొని గొడవకు దిగారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ తదితర అంశాలతో పాటు సీఎం కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్న ఓయూ విద్యార్థులు కావాలనే ఉత్సవాలకు దూరంగా ఉన్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. కదం తొక్కిన తెలంగాణ జానపదం ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది కళాకారులు నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. డీజే సంగీత హోరులో.. తెలంగాణ జానపదాలకు అనుగుణంగా కుర్రకారు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్, లుంబినీ పార్క్ పరిసరాలు జనజాతరను తలపించాయి. తెలంగాణ పది జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది కళాకారులు, తెలంగాణ వాదులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. కనువిందు చేసిన లేజర్...‘షో’ పర్యాటక శాఖ హుస్సేన్సాగర్ మధ్య నుంచి ప్రదర్శించిన త్రీ డీ లేజర్ షో మిరుమిట్లు గొలుపుతూ అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. లేజర్ వెలుగులో బుద్ధ విగ్రహం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాకతీయ శిల్పకళా తోరణం రంగుల హరివిల్లుతో కనువిందు చేశాయి. సుమారు గంటపాటు నిర్వహించిన లేజర్ షో ఆకాశంలో ఇంద్ర ధనుస్సును సృష్టిస్తూ పేల్చిన బాణాసంచా ప్రదర్శనకే హైలైట్ అయింది. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకున్న ప్రదర్శనలు.. ట్యాంక్బండ్పై వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల సిబ్బంది నిర్వహించిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోలీసు బెటాలియన్స్, బ్రాస్బ్యాండ్, ఫైర్ బ్యాండ్, అశ్విక దళం కవాతు, షీ టీమ్స్, పోలీసు సిబ్బంది బైక్ ర్యాలీ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాన వేదిక ముందు నుంచి జీహెచ్ఎంసీ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి చిహ్నంగా రూపొందించిన జాడూ వాహనం, సిబ్బంది కవాతు అలరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికపై నుంచి అభివాదం చేస్తూ కళాకారులను ఉత్సాహపరిచారు. లక్ష లడ్డూల పంపిణీ.. ముగింపు ఉత్సవాలకు హాజరైనవారికి ప్రభుత్వం లడ్డూలు పంపిణీ చేసింది. దాదాపు లక్ష లడ్డూలు పంపిణీ చేసినట్లు సమాచారం. ప్రధాన వేదికకు చేరుకునే అవకాశం లేనివారు ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరలపై వేడుకలను తిలకించారు. ఉత్సవాలకు హాజరైన వారి దాహార్తిని తీర్చేందుకు జలమండలి, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నీటి క్యాంపులు ఏర్పాటు చేసి వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
లక్షమందికి లడ్డూల పంపిణీ: కేసీఆర్
హైదరాబాద్: జూన్ 7 రాత్రి ట్యాంక్బండ్ పై తెలంగాణ రాష్ట్ర అవతరణ ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహంచాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. లక్ష మందికి లడ్డూలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి నిజా కాలేజీ గ్రౌండ్స్ నుంచి ట్యాంక్బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జంటనగరాల ప్రజలు పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. హుస్సేన్సాగర్ ప్రాంతంలో లేజర్ షోలు, త్రీడీ లైటింగ్, బాణాసంచా పేల్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. -
ఘనంగా తెలంగాణ సంబురాలు
వరంగల్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల అభిమానులు సంబురాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో కళాకారులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కలక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు బోనాలు, బతుకమ్మలు, డప్పులతో ధూంధాంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. మెహెందీ పోటీలు: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మహిళలకు మెహెందీ పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్: తెలంగాణ అవతరణ సంబురాలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థులు డీజే ఏర్పాటు చేసి విద్యార్థులు చిందులేశారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్దకు సమూహంగా వెళ్లి మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ కాలేజీ విద్యార్థులతో పాటు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా: ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. తెలంగాణ కల సాకారం కావడానికి సోనియమ్మె కారణమని.. అలాంటి సోనియాగాంధీకి తగిన మర్యాద ఇవ్వకుండా.. ఆమె హోర్డింగ్లు తొలగించి తెలంగాణ సంబురాలు నిర్వహించ డాన్ని నిరసిస్తూ.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అహంకార పూరితమైన అధికారుల వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement