breaking news
Finance Minister P. Chidambaram
-
వృద్ధి, ఉద్యోగాలపైనా దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సంబంధించి ద్రవ్యోల్బణ కట్టడే కాకుండా వృద్ధి, ఉపాధి కల్పనపైనా దృష్టి సారించాలని రిజర్వ్ బ్యాంక్కు ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు. ఆర్బీఐకి ఉన్న వివిధ బాధ్యతల్లో ధరల స్థిరీకరణ ఒకానొక భాగం మాత్రమేనని ఆయన చెప్పారు. అన్నింటికన్నా పెద్ద బాధ్యత వృద్ధి, ఉపాధి కల్పనకు తోడ్పడటమేనని చిదంబరం వివరించారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరల్ రిజర్వ్కి రాబోయే కొత్త చైర్మన్ బాధ్యతల గురించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పిన మాటలను చిదంబరం ప్రస్తావించారు. కొత్త ఫెడ్ చైర్మన్ ఇటు ధరల స్థిరీకరణ, అటు ఉపాధికల్పన లక్ష్యంగా పనిచే యాలని ఒబామా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడితో పాటు ఉపాధి కల్పన, వృద్ధిపైనా బాధ్యత ఉందన్న సంగతి ఆర్బీఐ గుర్తెరిగేలా స్పష్టమైన సంకేతం పంపాలని, దీనిపై పార్లమెంటు ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉంద న్నారు. రూపాయి స్థిరపడే దిశగా కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) తగ్గించేందుకు, ద్రవ్య స్థిరీకరణకు చర్యలు చేపడుతున్నట్లు చిదంబరం చెప్పారు. -
కొత్తగా అధ్యయనమేం లేదు..!
* విభజనపై కేంద్ర హోంశాఖ వర్గాల స్పష్టీకరణ * శ్రీకృష్ణ కమిటీ నివేదికనే సమర్పిస్తామని వెల్లడి * విభజన అనివార్యమైతే నీటి పంపిణీ వంటి అంశాలపై నిపుణుల కమిటీలు వేయాలన్న శ్రీకృష్ణ కమిటీ * ఎలాంటి నిపుణుల కమిటీలూ ఏర్పాటు చేయని సర్కారు న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిపై ఇప్పుడు కొత్తగా ఎలాంటి అధ్యయనం చేపట్టటంలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ అంశంపై అధ్యయనం మొత్తం పూర్తయిందని.. ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం రాజ్యసభలో వివరించినట్లు తమ నివేదిక సిద్ధంగా ఉందని పేర్కొన్నాయి. అదే శ్రీకృష్ణ కమిటీ నివేదిక అని.. ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు దానిని సమర్పిస్తామని చెప్పాయి. అలాగే.. చిదంబరం రాజ్యసభలో ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలచుకున్నట్లు ప్రకటించినందున.. దీనిపై ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన ఊహాగానాలకు తెరపడినట్లేనని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. నిపుణుల కమిటీలకు శ్రీకృష్ణ సూచన... మొత్తం 460 పేజీలకు పైగా ఉన్న శ్రీకృష్ణ కమిటీ అనేక కోణాల నుంచి ఈ అంశాన్ని అధ్యయనం చేసింది. విభిన్న ప్రామాణిక కోణాల నుంచి విశ్లేషించింది. విభజన జరిగితే ఎవరికి ఏం చెందాలి అనే దానిని అంచనా వేసేందుకు వివిధ సాంకేతిక కమిటీలను నియమించాలని సూచించింది. హైదరాబాద్ అంశంతో సహా పలు అంశాలను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించటమే ఉత్తమ మార్గమని అభిప్రాయపడింది. విభజన అనివార్యమైన పక్షంలో.. నదీ జలాల నిర్వహణ, సాగునీటి వనరులను సమానంగా పంపిణీ చేసే అంశంపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించాలని సూచించింది. అయితే.. విభజన అంశంపై తమ అధ్యయనం పూర్తయిందని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇంతవరకూ అలాంటి కమిటీని కానీ, మరే ఇతర జల నిర్వహణ బోర్డు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ వంటి వ్యవస్థను కానీ ఏర్పాటు చేయలేదు. ఈ అంశంపై హోంశాఖ వర్గాలు స్పందిస్తూ.. ‘విభజన, ఆస్తులు, అప్పులు, వనరుల పంపిణీపై రోడ్మ్యాప్ను రూపొందించటానికి నిపుణుల వ్యవస్థలను ఏర్పాటు చేస్తే.. అవి తన పని పూర్తి చేయటానికి కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది’ అని పేర్కొన్నాయి. రోడ్మ్యాప్ లేనిదే విభజన లక్ష్యం చేరుకోవటం చాలా కష్టతరమవుతుందని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటికే పరిష్కరించి ఉండాల్సింది... ‘‘విభజనకు సంబంధించిన దాదాపు అన్ని అంశాలపైనా మేం విస్తృతంగా అధ్యయనం చేసి.. మా సూత్రీకరణలు తెలియజేశాం. అభివృద్ధి సూచీలపై ఏం చేయాలో కూడా చెప్పాం. విభజన నిర్ణయంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సహజంగానే పెల్లుబుకుతాయని హెచ్చరించాం. అక్కడి ప్రజలకు తమ పెట్టుబడులు, ఆస్తులు, ఉపాధి, ఉద్యోగాలపై సందేహాలు ఉంటాయి. ఈ అంశాలన్నిటినీ పరిష్కరించి.. భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వారిలో విశ్వాసం నింపాలి. అనివార్యమైన పరిస్థితుల్లో మాత్రమే.. అదికూడా మూడు ప్రాంతాల మధ్యా సామరస్యపూర్వకంగా ఆమోదం లభించేట్లయితేనే విభజనకు వెళ్లాలని సిఫారసు చేశాం’’ అని శ్రీకృష్ణ కమిటీ మాజీ సభ్యుడొకరు స్పష్టంచేశారు. ‘‘ఫ్రభుత్వం విభజన విషయంలో సీరియస్గా ఉన్నట్లయితే.. అది ఇప్పటికే అన్ని ఆందోళనలనూ పరిష్కరించి ఉండాల్సింది. లేదంటే.. సుదీర్ఘ కాలం అశాంతి, అలజడి నెలకొంటాయి. అది మూడు ప్రాంతాల మీదే కాదు, దేశంపైనా ప్రభావం చూపుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.


