breaking news
Fifth candidate
-
'ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటాం'
-
'ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటాం'
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఐదో అభ్యర్థిని గెలిపించుకుంటామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఐదో అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకుంటామని, అన్ని ఆలోచించే నిలబెట్టామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. శని, ఆదావిరాల్లో మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఆరు స్థానాలకుగాను టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్ ఓ స్థానానికి, టీడీపీ బీజేపీ కూటమి మరో స్థానానికి పోటీ పడుతున్నాయి. -
'ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా ఉంది'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా తమకు ఉందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ఎవరికి ఓటు వేయాలో ఎమ్మెల్యేల ఇష్టమని... అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం రహస్యంగానే జరుగుతాయన్నారు. పోటీ చేస్తున్న ఇతర పార్టీల కన్నా తమ పార్టీకే బలం అధికంగా ఉందన్నారు. ఓయూ విద్యార్థులను కొన్ని పక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. అన్ని ఆలోచించే అభ్యర్థులను బరిలోకి దించామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో కేసీఆర్కు బాగా తెలుసున్నారు.