-
విత్తన ధ్రువీకరణలో తెలంగాణ భేష్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆన్లైన్ విత్తన ధ్రువీకరణను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర బృందం ప్రశంసించింది. మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ విత్తన విభాగ సహాయ కమిషనర్ డాక్టర్ డీకే శ్రీవాస్తవ, ఎన్ఐసీ సంచాలకులు రాజేశ్ శ్రీవాస్తవ తదితరుల ఆధ్వర్యంలోని బృందం తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థను సందర్శించింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థల, విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ నుంచి ప్రతి విత్తన ప్యాకెట్పై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేయడానికి కావలసిన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. బార్ కోడింగ్ లేదా క్యూఆర్ కోడింగ్ విధానం ద్వారా విత్తన లాట్లను గుర్తించే విధానాన్ని అమలు చేయడం వల్ల విత్తన నకిలీని అరికట్టవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విత్తన విభాగ సహాయ కమిషనర్ డాక్టర్ డీకే శ్రీవాస్తవ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు ఆన్లైన్ విత్తన ధ్రువీకరణను ప్రవేశపెట్టటానికి నిధులు సమకూర్చినా ఏ రాష్ట్రం కూడా పూర్తిగా అమ లు చేయలేదని, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ మొదలు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ మాత్రం పూర్తి స్థాయిలో అమలుచేయటం అభినందనీయమని ప్రశంసించారు. క్యూఆర్ కోడింగ్ విధానం వల్ల ఉత్పత్తిదారుని వివరాల నుండి విత్తన పరీక్షా వివరాల వరకు సంక్షిప్తంగా పొందుపర్చవచ్చని, తద్వారా విత్తనం నాణ్యమైనదో కాదో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణలో అమలుపరచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు మాట్లాడుతూ 2016 ఖరీఫ్ నుంచి ఎన్నో సమస్యలను అధిగమించి సంపూర్ణంగా ఆన్లైన్ విత్తన ధ్రువీకరణ చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో చాలావరకు వేరుశనగ, శనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తిలో నకిలీ విత్తన కంపెనీలను నివారించినట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఆన్లైన్ విత్తన ధ్రువీకరణ క్రమాన్ని అమలు చేయటానికి కావలసిన పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. సమావేశంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం చెల్లించకపోతే పీడీ యాక్టు
అమరావతి: నకిలీ విత్తన కంపెనీలు రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే యజమానులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ హాలులో శుక్రవారం నిర్వహించిన 13 జిల్లాల వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైబ్రీడ్ విత్తనాలు అమ్మకం దారులకు ఆర్ఎన్డీ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కంపెనీలు ఎక్కడ విత్తనాలు వేసి పండించాయో సాక్ష్యం లేకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విత్తనాలను డిపార్ట్మెంట్ పరీక్షించిన తర్వాతే బయటకు రిలీజ్ చేయాలని సూచించారు. తయారుదారీ కంపెనీల బిల్లులు లేకుండా డీలర్లు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 200 బయో కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రైవేటుగా ప్రో ఫార్మర్స్ అడ్వకేట్స్ను పెట్టుకొని కేసులు పరిష్కరించాలని తెలిపారు. వీటిపై రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డెరైక్టర్ ధనుంజయరెడ్డిని ఆదేశించారు. డీలర్ను సస్పెండ్ చేస్తే మార్పు రాదని, కంపెనీ యజమానులను బాధ్యులను చేసి అరెస్టు చేయాలని సూచించారు. జీవీ, బ్రహ్మపుత్ర, ఆధార్ వంటి నకిలీ విత్తనాల కంపెనీలపై జేడీలు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలకు సంబంధించి ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. డీడీలు, ఏడీలకు ఆరునెలల పాటు వాహన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల తరువాత మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ఆలోగా ఎన్ని కేసులు పరిష్కరించారు, ప్రగతిని బేరీజు వేస్తానని తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement