breaking news
Expansion of Cabinet
-
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కసరత్తు సాగిస్తున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ప్రధాని సంకల్పించినట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో గరిష్టంగా 81 మందికి స్థానం ఉంది. ప్రస్తుతం 53 మంది మంత్రులున్నారు. అంటే మరో 28 మందికి అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం నుంచి శర్బానంద సోనోవాల్ను కేబినెట్లో చేర్చుకోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిహార్ నుంచి లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) చీలిక వర్గం నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ కూడా మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. బిహార్లో బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్ కూడా కేబినెట్లో స్థానం కోసం ఎదురు చూస్తోంది. ఆ పార్టీ నుంచి లాలన్సింగ్, రామ్నాథ్ ఠాకూర్, సంతోష్ కుష్వాహా కేంద్ర కేబినెట్లో చోటు కోసం పోటీ పడుతున్నారు. బిహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ, మహారాష్ట్ర నేత నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్ కేబినెట్లో చేరనున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్కు పెద్దపీట ఢిల్లీకి దగ్గరి దారి అని భావించే ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ ఢిల్లీ పీఠం దక్కించుకోవాలంటే ఉత్తరప్రదేశ్లో కచ్చితంగా అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే పలువురు యూపీ నేతలకు కేబినెట్లో స్థానం కల్పించబోతున్నారు. పనితీరే ప్రామాణికం కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, హర్షవర్దన్, నరేంద్రసింగ్ తోమర్, రవి శంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, హరదీప్సింగ్ పురి అదనపు శాఖల బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి వారికి పనిభారం తగ్గించనున్నారు. మంత్రివర్గం నుంచి ఎవరెవరిని తొలగించాలన్న దానిపై ఇప్పటికే ప్రధాని మోదీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారంగా పలువురికి ఉద్వాసన తప్పదంటున్నారు. చదవండి: స్పుత్నిక్ లైట్కి నో -
సామాజిక, రాజకీయ విప్లవం..
సాక్షి, అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్లో రాజకీయ, సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తరతరాల రాజకీయ వివక్షకు తెరదించేస్తూ బడుగు, బలహీనవర్గాలకు తన మంత్రివర్గంలో అగ్ర ప్రాధాన్యం కల్పించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తున్నట్లు ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించారు. తన మంత్రి మండలి ఏర్పాటులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దాదాపు 60 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మహిళలకు సైతం పెద్దపీట వేశారు. తన మంత్రి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగానే స్పష్టం చేశారు. తదనుగుణంగానే ఆయన తన మంత్రి మండలి ఉండేటట్టుగా నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీలతో కలిపి బీసీలకు అత్యధికంగా 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు ఒకటి చొప్పున మొత్తం మీద 14 మంత్రి పదవులు కేటాయించి అగ్ర ప్రాధాన్యం కల్పించారు. రెడ్డి, కాపు సామాజిక వర్గాల నుంచి నలుగురు చొప్పున మంత్రి మండలిలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కమ్మ, క్షత్రియ, వైశ్య వర్గాల నుంచి ఒక్కొక్కరికి మంత్రులుగా స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కీలకమైన స్పీకర్ పదవిని బీసీ వర్గానికి, డిప్యూటీ స్పీకర్ పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. ఈ విధంగా సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ జగన్ తన మంత్రివర్గానికి తుది రూపు ఇచ్చినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రికార్డు మెజార్టీతో అఖండ విజయం సాధించి, అధికారాన్ని చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గం కూర్పులోనూ తనదైన ముద్ర వేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట తన మంత్రి మండలి కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం మీద ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నట్లు ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించారు. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో పదవుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం పదవులు కేటాయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరణలో చూపించారు. 25 మంత్రులతో పూర్తి మంత్రి మండలిని ఒకేసారి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆయన అందులో ఏకంగా 14 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ద్వారా ఆయన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. మొత్తం 25 మందితో తన మంత్రి మండలిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఖరారు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... జగన్ మంత్రివర్గంలో బీసీ వర్గానికి అగ్రస్థానం దక్కింది. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీతోపాటు బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించారు. తరువాత ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు, రెడ్డి సామాజి కవర్గాలకు చెరో నాలుగు మంత్రి పదవులు ఖరారు చేశారు. ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక బీసీల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ధర్మాన కృష్ణదాస్( పోలినాటి వెలమ), బొత్స సత్యన్నారాయణ(తూర్పు కాపు), పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార), అనిల్ కుమార్యాదవ్ (యాదవ), గుమ్మనూరు జయరాం (బోయ), మాలగుండ్ల శంకరనారాయణ(కురబ) సామాజిక వర్గాలతోపాటు బీసీ–ఇ కేటగిరికీ చెందిన షేక్ అంజాద్ బాషా(ముస్లిం మైనార్టీ)కి తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎస్సీ సామాజికవర్గానికి ఏకంగా ఐదు మంత్రి పదవులను కేటాయించడం గమనార్హం. మాల సామాజికవర్గ నుంచి ముగ్గురు, మాదిగ సామాజికవర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. మాల సామాజిక వర్గానికి చెందిన పినెపి విశ్వరూప్, మేకతోటి సుచరిత, కళత్తూరు నారాయణస్వామిలకు అవకాశం ఇవ్వగా... మాదిగ సామాజిక వర్గానికి చెందిన తానేటి వనిత, ఆదిమూలపు సురేష్లకు మంత్రులుగా స్థానం దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు సామాజికవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆళ్ల శ్రీనివాస్(నాని), పేర్ని వెంకటరామయ్య(నాని)లకు మంత్రులుగా అవకాశం కల్పించారు. రెడ్డి సామాజికవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. ఇక ఎస్టీ సామాజికవర్గం నుంచి పాముల పుష్ప శ్రీవాణి, కమ్మ సామాజికవర్గం నుంచి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), క్షత్రియ సామాజికవర్గం నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వైశ్య సామాజికవర్గం నుంచి వెలంపల్లి శ్రీనివాస్లకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు తన మంత్రి మండలిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు ఒక్కో ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించడం ద్వారా సామాజిక న్యాయానికి జగన్ అత్యధిక ప్రాముఖ్యం ఇస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించనున్నట్లు తాడేపల్లిలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్ఎల్పీ సమావేశంలో జగన్ ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బడుగు, బలహీన వర్గాలకు మొక్కుబడిగా తక్కువ ప్రాధాన్యమున్న మంత్రి పదవులను ఇచ్చి సామాజిక న్యాయం చేశామని రాజకీయ పార్టీలు ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక న్యాయం సాధన పట్ల తన చిత్తశుద్ధిని చేతల్లో చూపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు ప్రకటించి జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ స్థాయిలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరికి అవకాశం దక్కనుందన్నది శనివారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం వెల్లడిస్తారు. ప్రాంతీయ సమతౌల్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రి మండలిలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రాంతీయ సమతౌల్యం పాటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకరు, విజయనగరం జిల్లా నుంచి ఇద్దరు, విశాఖపట్నం జిల్లా నుంచి ఒకరు చొప్పున ఉత్తరాంధ్రకు నాలుగు మంత్రి పదవులు కేటాయించారు. తూర్పు గోదావరిజిల్లా నుంచి ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు చొప్పున ఉభయగోదావరి జిల్లాలకు ఆరు మంత్రి పదవులు కేటాయించడం విశేషం. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు, గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తూ రాజధాని జిల్లాలకు ఐదు మంత్రి పదవులతో సముచిత గౌరవం ఇచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున నలుగురిని తన మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు, కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు, వైఎస్సార్ జిల్లా నుంచి ఒకరు, అనంతపురం జిల్లా నుంచి ఒకరు చొప్పున రాయలసీమ నుంచి ఆరుగురికి జగన్ తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. తద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గ కూర్పులో ప్రాంతీయ సమతౌల్యం పాటించడంపట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ పదవి బీసీకి... డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు! రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన శాసనసభ స్పీకర్ పదవిని బీసీకి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులోనూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్ పదవిని కేటాయించడం విశేషం. శ్రీకాకుళం జిల్లా అమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, సీనియర్ నేత తమ్మినేని సీతారాంను స్పీకర్గా నిర్ణయించినట్లు సమాచారం. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గతంలో 9 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న తమ్మినేని సీతారాం బీసీ వర్గానికి చెందిన కాళింగ సామాజిక వర్గం నేత. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా రాజకీయంగా సముచిత స్థానం కల్పించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రఘుపతి గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విధంగా మంత్రివర్గ కూర్పుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. సామాజిక న్యాయానికి అగ్ర ప్రాధాన్యం కల్పిస్తూ ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించడం... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతం మంత్రి పదవులు కేటాయిస్తూ మంత్రి మండలి ఏర్పాటుకు నిర్ణయం... స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికి ఖరారు చేయడం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రివర్గ కూర్పుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక న్యాయం పట్ల తన చిత్తశుద్ధిని... సుపరిపాలన పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని పరిశీలకులు కొనియాడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేతలు 1. ధర్మాన కృష్ణదాస్ (పోలినాటి వెలమ–బీసీ)– శ్రీకాకుళం 2. బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు–బీసీ)– విజయనగరం 3. పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)– విజయనగరం 4. అవంతి శ్రీనివాస్ (కాపు)–విశాఖపట్నం 5. పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టిబలిజ–బీసీ)– తూర్పు గోదావరి 6. కురసాల కన్నబాబు (కాపు)– తూర్పు గోదావరి 7. పినిపె విశ్వరూప్ (ఎస్సీ–మాల)– తూర్పు గోదావరి 8. ఆళ్ల నాని (కాపు)– పశ్చిమ గోదావరి 9. తానేటి వనిత (ఎస్సీ–మాదిగ)– పశ్చిమ గోదావరి 10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు(క్షత్రియ– పశ్చిమ గోదావరి 11. వెల్లంపల్లి శ్రీనివాస్ (వైశ్య)– కృష్ణా 12. కొడాలి నాని (కమ్మ)– కృష్ణా 13. పేర్ని నాని (కాపు)– కృష్ణా 14. మేకతోటి సుచరిత (ఎస్సీ–మాల)– గుంటూరు 15. మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు–బీసీ)– గుంటూరు 16.బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి)– ప్రకాశం 17. ఆదిమూలపు సురేష్ (ఎస్సీ–మాదిగ)– ప్రకాశం 18.పాలుబోయిన అనిల్కుమార్ యాదవ్ (యాదవ–బీసీ)– పీఎస్సార్ నెల్లూరు 19. మేకపాటి గౌతమ్రెడ్డి (రెడ్డి)– పీఎస్సార్ నెల్లూరు 20. షేక్ బేపారి అంజాద్ బాషా(ముస్లిం–బీసీ)– వైఎస్సార్ జిల్లా 21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి)– చిత్తూరు 22. కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ–మాల)– చిత్తూరు 23. బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి (రెడ్డి)– కర్నూలు 24. గుమ్మనూరు జయరామ్ (బోయ–బీసీ)– కర్నూలు 25. మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ–బీసీ)– అనంతపురం -
విస్తరణపై చర్చలకు ఢిల్లీకి సీఎం
సాక్షి, ముంబై: మంత్రిమండలి విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్వీస్ ఢిల్లీ పయనం కానున్నారు, మిత్రపక్షాలైన స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా (ఆర్పీఐ), శివసంగ్రామ్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్ (ఆర్ఎస్పీ) పార్టీల నుంచి మంత్రి పదవుల కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగింది. మంత్రి మండలిలో చేరాలనుకునేవారి సంఖ్య బీజేపీలో కూడా పెద్దగానే ఉంది. దీంతో ఎటూ తేల్చుకోలేని ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో చర్చలు జరుపుతారని తెలిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం జనవరి మొదటివారంలో మంత్రి మండలిని విస్తరిస్తామని దేవేంద్ర ఫడణ్వీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలను అధికారంలో భాగస్వాములను చేసుకునే విషయంపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మిత్రపక్షాల నాయకులైన రామ్దాస్ ఆఠవలే, వినాయక్ మెటే, మహాదేవ్ జాన్కర్లు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రీయ సమాజ్ పక్ష్ నేత మహాదేవ్ జాన్కర్ మినహా మిగత పార్టీల నాయకులెవరూ ఉభయ సభల్లోనూ సభ్యులు కారు. పైగా ఈ పార్టీలకు చెందిన ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలుగా లేరు. ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన వారికి మంత్రిమండలిలో స్థానం కల్పిస్తే వారికి శాసనమండలిలో లేదా శాసన సభలో సభ్యత్వం ఇప్పించాల్సిన బాధ్యత కూడా బీజేపీపైనే పడనుంది. ప్రస్తుతం శాసనమండలిలో అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో బీజేపీకి మూడు లభించనున్నాయి. ఈ స్థానాల కోసం బీజేపీకి చెందిన నాయకులే పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వీటన్నింటిపై బీజేపీ అధిష్టానంతో చర్చించి, నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.