-
తప్పు నల్లిది... శిక్ష మంచానికి!
మనుష్యుడు తనంతతానుగా తప్పు చేసేవాడు కాకపోయినా, దుర్మార్గులతో స్నేహం చేస్తే పడరాని కష్టాలను పడతాడని చెప్పడానికి...సుమతీ శతకకారుడు బద్దెనగారు బహు సులభమైన ఉపమానాలతో వివరిస్తున్నాడు... ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ ...‘‘కొంచెపు నరు..’’ అంటే... బుద్ధి పరిణతి చెందనివాడు, అధముడు, దుర్బుద్ధి కలిగినవాడు, ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతో ఉండేవాడు–వాడు బాగుపడడు, ఇతరులను బాగపడనివ్వడు. దుర్జనులతో స్నేహం చేస్తే అంచితముగ కీడువచ్చు..అంటే అంతాఇంతా అని చెప్పలేనంత అపకీర్తి, ప్రమాదం, కష్టం ముంచుకొచ్చేస్తాయి.... ఎలాగంటే... ఇప్పటితరానికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు కానీ వెనకటికి నులక మంచాలు, నవారు మంచాలు, పేము మంచాలంటూ ఉండేవి. కట్టెమంచాలకు నవారు, నులక లేదా పేము అల్లి వాడుకొనేవారు. మంచానికున్న పట్టీలు, కోళ్ళు, నవారు, నులకల మధ్య సందుల్లో కుప్పలు కుప్పలుగా నల్లులు చేరేవి, గుడ్లు పెట్టేవి. వీటికి ఒక లక్షణం ఉంటుంది. మంచంమీద పడుకున్న వ్యక్తి మేలుకుని ఉన్నంతవరకు అవి బయటికి రావు. నిద్రలోకి జారుకోగానే అవి కుడుతుంటే సుఖంగా నిద్రపోవడం సాధ్యం కాదు. వాటి బాధ వదిలించుకోవాలంటే పగలు ఎర్రటి ఎండలో మంచాన్ని నేలకేసి పదేదపదే కొడితే నల్లులు రాలిపడుతుంటాయి. కాళ్లతో వాటిని నలిపి చంపుతారు. అయినా ఇంకా సందుల్లో గుడ్లు ఉంటాయి. వాటిమీద కిరసనాయిలు పోసేవారు.... ఇప్పడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే.... నిద్రపోతున్న మనుషులను కుట్టినది నల్లులయితే మధ్యలో ఆ మంచం చేసిన తప్పేమిటి ? నిజానికి పడుకోవడానికి ఉపయోగపడడం తప్ప మరోపాపం ఎరుగదు. కానీ నల్లులకు ఆశ్రయం ఇచ్చినందుకు ... దెబ్బలు తిన్నది మాత్రం మంచమే. నల్లులు చేరిన తరువాత మంచానికి కష్టాలు ఎలా వచ్చాయో, దుర్మార్గులతో కలిసిన వారి జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మహాభారతంలో దుర్యోధనడు అంటాడు...‘‘జానామిధర్మంనచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః...’’ నాకు ధర్మం తెలియదనుకుంటున్నారా...నాకు అన్నీ తెలుసు కానీ దాన్ని పాటించాలనిపించడం లేదు. దాన్ని పట్టుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తామని కూడా తెలుసు. విజయాలు వరిస్తాయనీ తెలుసు. నాకు అధర్మం ఏదో తెలియదనుకుంటున్నారా.. ఏది చెయ్యకూడదో నాకు తెలుసు. అది చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉండదని కూడా తెలుసు. అలా ఉంటే జీవితంలో ఇబ్బందులపాలవుతామనీ తెలుసు...అయినా అధర్మాన్ని విడిచిపెట్టాలనిపించదు. ’’ అంటూ ఇంకా దుర్యోధనుడు ఏమన్నాడో చూడండి...‘‘...కేనాపి దేవేన హృధిస్థితేన యథాప్రవృతోస్మి తథాకరోమి’’...అన్నాడు... అంటే.. ఇందులో నా తప్పేముంది? మీ అందరికీ ఉన్నట్టే నా హృదయంలో కూడా భగవంతుడున్నాడు. ఆయన నన్ను ధర్మాన్ని పట్టుకోనీయడం లేదు. అధర్మాన్ని పట్టుకోనిస్తున్నాడు. నేను పట్టుకుంటున్నా. ఇది నా తప్పెలావుతుంది? ఏదయినా తప్పు ఉంటే లోపల ఉన్న భగవంతుడిది అవుతుంది..’’ అటువంటి వితండవాదనలు చేసే మూర్ఖులను ఎంతమంది రుషులు, సాధుసత్పురుషులు వచ్చినా ఏం మార్చగలరు? జీవితంలో మనకు ఇటువంటి వారు కూడా ఎక్కువగా తారసపడుతుంటారు... వారితో స్నేహం వల్ల మన జీవితాలు కూడా దారి తప్పుతాయి... మన చుట్టూ ఉండేవారిపట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో బద్దెనగారు ఉద్బోధ చేస్తున్నారు. అలా ఉండకపోతే...నల్లులకే కాదు, మంచానికి ఏర్పడిన ప్రమాదం లాగా మనకే కాదు, మన పక్కన ఉన్న ఇతరులు కూడా కష్టాలపాలవుతారని హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
దయ్యాలు తిరుగుతున్నాయి..
పెద్దెముల్(రంగారెడ్డి): 'అదిగో.. అటు చూడండి.. దయ్యాలు తిరుగుతున్నాయ్.. మనుషుల్ని పీక్కుతింటాయ్..' అంటూ గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తున్న కొందరి వ్యవహారం కుటుంబ సభ్యులకు భయం కలిగించడంతోపాటు చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్న కొందరి వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమంటే.. కల్తీ కల్లుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అది అందుబాటులో లేకపోవడంతో ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి పూట దయ్యాలు వస్తున్నాయని.. అందరినీ పీక్కొతింటాయని వింత వింతగా మాట్లాడుతున్నారు. దీంతో గ్రామస్థులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. -
కోడెల దుర్మార్గానికి పోలీసుల సహకారం
నరసరావపేట వెస్ట్ : నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ చేస్తున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలన్నీ పోలీసుల సహకారంతోనే జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. నరసరావుపేట రామిరెడ్డిపేటలో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు గ్రామీణ కేబుల్ టీవీ(జీసీ టీవీ) కేంద్ర కార్యాలయంపై దాడిచేసి విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్ప్యానెళ్ళు, డిష్లను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటిరాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రం ధ్వంసమైన కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ ఆవరణలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గత జీవితం పరిశీలిస్తే ఇటువంటి దారుణాలు వారే చేయించారనటంలో ఎటు సందేహాలు లేవని చెప్పారు. స్పీకర్ నియోజకవర్గం కాకపోయినా నరసరావుపేటలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాదని పెత్తనం చేస్తున్నారన్నారు. వ్యాపారవర్గాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఇది స్పీకర్ ప్రోత్సాహంతోనె జరుగుతోందని విమర్శించారు. దీనికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. ముప్పాళ్ళ మండల ఎంపీపీ ఎన్నిక సందర్బంగా మెజార్టీలేకపోయినా ఎంపీటీసీలను అపహరించిన ఘటనలో అసలైనవారిని వదిలేసి చేసిన అనామకులను పట్టుకొని కేసును నీరుగార్చారన్నారు. పోలీసు వ్యవస్థ కోడెల చెప్పినట్లుగా నడుస్తోందన్నారు. పోలీసులు పాత్రధారులు, సూత్రధారులను సైతం అరెస్టుచేసి తమ నిజాయతీని నిరూపించుకోవాలని కోరారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయిస్తామని చెప్పారు. రెండు నెలల నుంచి బెదిరిస్తూనే ఉన్నారు : ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీసీ టీవీ నిర్వాహకుడు కసిరెడ్డి వెంకటకోటిరెడ్డి రెండు నెలల క్రితం తన వద్దకు వచ్చి కె.చానల్ నిర్వాహకుడు కోడెల శివరామకృష్ణ జీసీ టీవీని తనకు ఇవ్వాలని, అడిగాడని, అందుగు బదులుగా రెండు వర్క్లు ఇస్తానని చెబుతున్నాడని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని బెదిరించినట్టు చెప్పాడన్నారు. దీనికి ఒప్పుకోని జీసీ టీవీ కార్యాలయంపై శివరామకృష్ణే దాడిచేయించారని ఆరోపించారు. గతంలో ఎంపీటీసీల అపహరణ, విశాఖపట్నంలో తన కుమారుడిని అపహరించటం, రాత్రికి రాత్రి దాడి చేయటం మూడు సంఘటనలు పరిశీలిస్తే ఒకదానికొకటి, ఒకే వ్యక్తి చేయించినట్లుగా ఉందన్నారు. వ్యాపారులను బెదిరిస్తూ వాటన్నింటిన తన గుప్పిట్లోకి తీసుకోవాలనే ఆలోచనతో తొమ్మిది నెలలుగా నియోజకవర్గంలో అరాచక పాలన నడిపిస్తున్నారన్నారు. జరిగిన దారుణాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామనీ, దాడి చేసినవారినీ, చేయించినవారినీ పోలీసులు వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేయాలి: జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జీసీ టీవీపై దాడి పిరికిపందల చర్యగా అభివర్ణించారు. మెజార్టీలేని చోట ఎంపీటీసీలను అపహరించటం, నరసరావుపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వారే ధ్వంసం చేసుకోవటం, చిలకలూరిపేటలో విలేఖరి హత్య కేసు మూడింటిలోను చేసిన వారిని మాత్రమే అరెస్టుచేసి చేయించిన వారిని వదిలేసి పోలీసులు కేసులను నీరుగార్చారని విమర్శించారు. రాజధాని విషయంలో కూడా రైతుల ఆస్తులను తగుల పెట్టిన కేసులో అనామకులను అరెస్టుచేశారన్నారు. అర్ధరాత్రి పూట ఆస్తులను ధ్వంసం చేయటం అమానుషమని వ్యాఖ్యానించారు. ఇటువంటి సంఘటనలో సూత్రధారులు, పాత్రధారులను పట్టుకున్నప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, ప్రజలను కూడగట్టి అధికార పార్టీ ఆగడాలను అరికట్టేందుకు పోరాడతామని హెచ్చరించారు. సమావేశంలో ఎన్సీవీ అధినేత నల్లపాటిరాము, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వారు జీసీ టీవీ నిర్వాహకుడు కసిరెడ్డి వెంకటకోటిరెడ్డి, కొండా వెంకటేశ్వరరెడ్డిలతో మాట్లాడి దాడిజరిగిన తీరును తెలుసుకున్నారు. ధ్వంసమైన సామగ్రిని పరిశీలించారు. నకరికల్లు మాజీ జెడ్పీటీసీ భవనం రాఘవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్రెడ్డి, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, కౌన్సిలర్లు షేక్.అబ్దుల్సత్తార్, ఎమ్మెల్యే అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు తదితర నాయకులు, కౌన్సిలర్లు వారివెంట ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement