breaking news
Evade Subramaniam
-
సమస్యలున్నాయని పారిపోతామా...
‘డాటరాఫ్ అశ్వినీదత్’ అనే ట్యాగ్ నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి మంచి బాట అయ్యింది. కానీ, నాదైన ప్రత్యేకతను చాటుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టం. అందుకే, నా పని నేను శ్రద్ధగా చేసుకుంటాను. నిర్మాణ రంగంలో ఆడవాళ్లు తక్కువ ఉన్నారన్నది వాస్తవమే. కానీ, గత పదేళ్లతో పోల్చితే ఇప్పుడు మంచి మార్పు వస్తోంది. తెర వెనుక ఉన్న శాఖల్లో చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. నేను తీసిన ‘ఎవడే సుబ్రమణ్యం’కి పని చేసిన టెక్నీషియన్స్లో నలభై శాతం మంది ఆడవాళ్లే ఉన్నారు. ఆడవాళ్లు కారు డ్రైవ్ చేసినా, స్కూటర్ నడిపినా ‘ఆ... ఏం చేస్తుందిలే’ అనే రోజులు పోయాయి. ఇప్పుడు మగవాళ్లు కూడా ఆడవాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్... మేల్ డామినేషన్ ఉంది. అందుకే, ఆడవాళ్లు కొంచెం ఎగ్రెసివ్గా ఉండాలి. నేనంతే! నా పని మీద నాకు పట్టు ఉంది. వృత్తి మీద గౌరవం ఉంది. అందులో సక్సెస్ అవ్వాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే... నేను కంటిన్యూస్గా సినిమాలు నిర్మించడం లేదు కాబట్టి, ‘లేడీ ప్రొడ్యూసర్ కదా... ఇబ్బందిగా ఉందేమో’ అనుకునే అవకాశం ఉంది. నాకెలాంటి ఇబ్బందీ లేదు. మంచి సినిమాలు మాత్రమే తీయాలన్నది నా లక్ష్యం. అందుకే ఈ గ్యాప్. ఇక... మహిళల సమస్యల గురించి చెప్పాలంటే - సినిమా ఇండస్ట్రీ అనే కాదు... కార్పొరేట్ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, హాస్పటల్స్లో అన్ని చోట్లా ఇబ్బందులుంటాయి. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి, ఇక్కడ ఎక్కువ ఉంటాయనుకుంటారు. కానీ, సమస్యలు ఉన్నాయి కదా అని పారిపోతే ఏమీ సాధించలేం! - స్వప్నాదత్, సినీ నిర్మాత (‘ఓం శాంతి’, ‘బాణం’ చిత్రాల ఫేమ్) -
నానీని చూస్తే... అసూయగా ఉంది! - నాగచైతన్య
‘నాని ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేస్తుంటాడు. ఇలాంటి గొప్ప సినిమాలో నటించినందుకు నానీని చూస్తే అసూయగా ఉంది. నాకు ఇలాంటి పాత్ర ఎందుకు రాలేదా? అనిపించింది. ఇలాంటి సినిమా నిర్మించా లంటే, నిర్మాతలకు దమ్ము కావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాని, మాళవికా నాయర్, విజయ్ దేవరకొండ, రీతూ వర్మ ముఖ్య తారలుగా వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకా దత్ స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విజయోత్సవాన్ని గురువారం హైదరాబాద్లో జరిపారు. ఈ వేడుకలో నాగచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. నాని మాట్లాడుతూ ‘‘ఈ స్థాయిలో ప్రశంసలు లభిస్తాయని ఊహించలేదు’’ అన్నారు. స్వప్నా దత్ మాట్లాడుతూ - ‘‘మంచి సినిమా తీస్తే అందరూ ప్రోత్సహిస్తారని మరోసారి నిరూపితమైంది. కమర్షియల్ పంథాలో తీసినా విభిన్నంగా ప్రయత్నించాం’’ అన్నారు. మంచి చిత్రంలో నటించినందుకు విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశారు.