breaking news
Esther Noronha
-
రెండు వారాలుగా టాప్లో స్ట్రీమింగ్.. ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్
ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్ ప్రధాన పాత్రల్లో ఒక తెల్లటి కెమెరా ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఐరావతం'. నూజివీడు టాకీస్ పతాకంపై గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఫ్యూజన్' సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఐరావతం మూవీ ఈ నెల 17 నుంచి రెండు వారాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఎస్తేర్, అమర్ దీప్, తన్వి నెగ్గి అరుణ్ డబుల్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... 'సుహాస్ మాకు ఆటవిడుపుగా ఐరావతం కథ చెప్తే విని కథలోని స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దామనుకున్నాం. చివరికి ఈ మూవీ హాట్ స్టార్లో అనుకోకుండా రెండు వారాలుగా టాప్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మంచి కథని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం.' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...'ఫ్యూజన్ జోనర్లో తీసిన ఐరావతం హాట్ స్టార్ ప్రేక్షకులకు నచ్చడం చాలా హ్యాపీ. నిర్మాతలకు థాంక్స్. టెక్నీషియన్స్ థాంక్స్.' అని అన్నారు. -
కామంతో కళ్లు మూసుకుపోతే.. 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: రెక్కీ (వెబ్ సిరీస్) నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా, ధన్యా బాలకృష్ణ, తోటపల్లి మధు, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాత: శ్రీరామ్ కొలిశెట్టి కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ సంగీతం: శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: రామ్ కె. మహేష్ విడుదల తేది: జూన్ 17, 2022 (జీ5) ఇటీవలే 'గాలివాన' వెబ్ సిరీస్తో అలరించిన జీ5 తాజాగా 'రెక్కీ' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ముందుకు వచ్చింది. శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్ నోరోన్హా, సమ్మెట గాంధీ నటించిన ఈ వెబ్ సిరీస్కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. 1992లో తాడిపత్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు డైరెక్టర్ కృష్ణ తెలిపారు. 7 ఎపిసోడ్లుగా వచ్చిన 'రెక్కీ' వెబ్ సిరీస్ జీ5లో జూన్ 17న విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తాడిపత్రికి వరదరాజులు ('ఆడు కాలమ్' నరేన్) మున్సిపల్ ఛైర్మన్. అదే పట్టణంలో రంగ నాయకులు (రామరాజు) మాజీ మున్సిపల్ ఛైర్మన్. వీరిద్దరి మధ్య రాజకీయ పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు గురవుతాడు. తర్వాత 6 నెలలకు వరదరాజులు కుమారుడు చలపతి (శివ బాలాజీ) కూడా చంపబడతాడు. ఈ హత్యలు చేసింది ఎవరు ? ఎవరు ప్లాన్ చేశారు ? వాటి వెనుక ఉన్నది ఎవరు ? వారిని ఎస్సై లెనిన్ (శ్రీరామ్) కనిపెట్టాడా ? అతను తెలుసుకున్న నిజాలు ఏంటీ ? ఈ రెండు హత్యలతో వారి ఇంట్లోని ఆడవాళ్లు ఏం నిర్ణయించుకున్నారు ? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'రెక్కీ' వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ఒక మహిళ వల్ల కురుక్షేత్రమే జరిగిందని చెప్పుకుంటాం. అలాంటి వనితపై వ్యామోహం పెరిగితె ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలియజేశారు. కథ చూస్తే రాజకీయ నేపథ్యమున్నట్లు అనిపించినా కామ వాంఛ, మహిళా పాత్రను ప్రధానంగా చూపించారు. అనుకున్న కథ ప్రకారం ఆద్యంతం ఆసక్తికరంగా ఆవిష్కరించారు డైరెక్టర్ పోలూరు కృష్ణ. అధికారం, రాజకీయం కథలతో అనేక సిరీస్లు ఇదివరకు వచ్చాయి. కానీ వీటికి కాస్త భిన్నంగా కామ వాంఛను జోడించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. బంధాలు, అక్రమ సంబంధాల గురించి చక్కగా చూపించారు. సిరీస్లో వచ్చే మలుపులు ఊహించని విధంగా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే మహిళళ పాత్రలను బలంగా చూపించారు. కానీ అక్కడక్కడ కొంతమేర అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే? సిరీస్ ప్రారంభం నుంచి చివరి వరకు నటీనటుల నటన అద్భుతంగా ఉంది. ఆద్యంతం వారి నటనతో సిరీస్ను రక్తి కట్టించారు. శ్రీరామ్, శివ బాలాజీ, ఆడు కాలమ్ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా పాత్రలు హైలెట్గా నిలిచాయి. శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ పాత్రలు చివర్లో ఆకట్టుకుంటాయి. అలాగే మరో కీలక పాత్రలో నటించిన తోటపల్లి మధు పూర్తి న్యాయం చేశారు. ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే 1990వ దశకంలోని వాతావరణాన్ని బాగా చూపించారు. రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీరామ్ మద్దూరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. 'రెక్కీ' వెబ్ సిరీస్కు ఈ బీజీఎం ప్రాణం పోసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్గా చెప్పాలంటే మిమ్మల్ని కదలనివ్వకుండా థ్రిల్కు గురిచేసే వెబ్ సిరీస్ 'రెక్కీ'. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
ఎస్తేర్ సందడి
సినీనటి, భీమవరం బుల్లోడు ఫేమ్ ఎస్తేర్ నరోన్హ ఆదివారం నగరంలో సందడి చేశారు. బందరు రోడ్డులోని రిప్పల్స్ మాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఎక్స్ప్రెస్ ఫర్ బెటర్ విజన్ షోరూమ్ ప్రారంభోత్సవంలో ఎస్తేర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ ఆప్టికల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. షోరూం యజమాని సిద్దులింగ్ హర్నల్ మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్థ అన్ని రకాల ఆప్టికల్స్ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇక్కడ ఉచితంగా ఐ చెకప్ నిర్వహించడంతో పాటుగా ఉచితంగా సర్వీసునూ అందిచనున్నట్టు వివరించారు. ఐఏఎస్ కావాలని కోరిక : ఎస్తేర్ టాలీవుడ్లోని అందరి హీరోలతో నటించాలని ఉందని ఎస్తేర్ పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూఇటీవల నిర్మించిన భీమవరం బుల్లోడు చిత్రం సక్సెస్ సాధించిందని పేర్కొన్నారు. కొన్ని చిత్రాల చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐఏఎస్ అవ్వాలనేది తన కోరికని, దానికోసం ఇంకా చదువుతున్నానని ఎస్తేర్ వెల్లడించారు.