కంపెనీల ఏర్పాటు మరింత సులువు
న్యూఢిల్లీ: కంపెనీ ఏర్పాటు చేయడం ఇక మరింత సులువు కానున్నది. డెరైక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్) కేటాయింపు, కంపెనీ ఏర్పాటు, ప్రతిపాదిత కంపెనీకు సంబంధించి డెరైక్టర్ల నియామకం తదితర వివరాలను గతంలో ఐదు ఎలక్ట్రానిక్ దరఖాస్తుల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వివరాలన్నింటిని ఒక్క ఎలక్ట్రానిక్ దరఖాస్తు - ఐఎన్సీ29 ద్వారా సమర్పిస్తే సరిపోతుందని కంపెనీ మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. భారత్లో వ్యాపారం నిర్వహించడం సులువు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా కొత్త కంపెనీల చట్టంలో వివిధ మార్పులు చేయాలని కూడా కంపెనీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది.