breaking news
escort jeep
-
బిడ్డా.. వెళ్లిపోయావా
ప్రొద్దుటూరులో ఆదివారం బాలకృష్ణ పర్యటన ఓ కుటుంబానికి కడుపుకోతను మిగిల్చింది. ‘లెజెండ్’ విజయోత్సవ సభకు బాలకృష్ణ వస్తుండటంతో ఆయనను చూడటానికి గంగాధర్, నాగశేషుడు, రమేష్ అనే వారు బైక్లో బయల్దేరారు. ఇంతలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో గంగాధర్ మృతి చెందాడు రమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రొద్దుటూరు క్రైం: లెజండ్ విజయోత్సవ సభ విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంగా వస్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ఢీ కొన్న సంఘటనలో పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టకు చెందిన దిద్దిగారి గంగాధర్ (11) మృతి చెందగా ఎర్రబల్లి నాగశేషుడు, మిద్దె రమేష్ గాయపడ్డారు. వారిలో మిద్దె రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. లెజండ్ చిత్రం విజయోత్సవ సభను ఆదివారం పట్టణ శివారులో ఉన్న రాయల్ కౌంటీ రిసార్ట్స్లో నిర్వహించాలని భావించారు. బాలకృష్ణకు రక్షణ కల్పించేందుకు కడప నుంచి ఎస్కార్ట్ వాహనం రాయల్ కౌంటీ మార్గంలో వెళుతోంది. పట్టణంలోని కాల్వకట్టకు చెందిన గంగాధర్, నాగశేషుడు, మిద్దె రమేష్ అదే సమయంలో రాయల్ కౌంటీకి బయల్దేరారు. రాయల్ కౌంటీ సమీపంలోని మైలవరం కెనాల్ వద్దకు వెళ్లగానే వెనుకవైపు నుంచి వస్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం వారి మోటార్బైక్ను ఢీకొంది. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే దిద్దిగారి గంగాధర్ మృతి చెందాడు. ఎర్రబల్లి నాగశేషుడుకు కాలు విరిగింది, మిద్దె రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్నాడు. రమేష్ను కర్నూలు ఆస్పత్రికి తరలించగా నాగశేషుడిని కడప రిమ్స్కు తరలించారు. మధ్యతరగతి కుటుంబాల్లో విషాదం గంగన్న పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టలో నివాసం ఉంటున్నాడు. అతనికి గంగాధర్, గణేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగాధర్ ఒలివియా స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గంగన్న రాయల్ కౌంటీలో పనిచేస్తున్నాడు. బాలకృష్ణ అక్కడికి రానుండటంతో గంగాధర్, నాగశేషుడు కలిసి రాయల్ కౌంటీకి బయల్దేరారు. విషయం తెలియడంతో రమేష్ కూడా వారితోపాటు వెళ్లాడు. అతను గంగాధర్ను ఉన్నత చదువులు చదివించాలని తపించాడు. అయితే విధి మరోలా తలిచింది. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో తల్లిదండ్రులు నాగలక్షుమ్మ, గంగన్నలు ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుని పరిస్థితిని చూసి వారు సొమ్మసిల్లిపోయారు. ఐదు నెలల క్రితమే వివాహం అయింది మిద్దె రమేష్ పట్టణంలోని గాంధీరోడ్డులో టైలర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఐదు నెలల క్రితం అమృతానగర్కు చెందిన లక్ష్మిదేవితో వివాహం అయింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఈ వార్తను భార్యకు తెలియనివ్వలేదు. వెంటనే అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఎర్రబల్లి నాగశేషుడు గంగాధర్కు సమీప బంధువు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. అతని తండ్రి నాగమయ్య బేల్దారి పనికి వెళ్లేవాడు. నాగమయ్యకు నాగశేషుడితోపాటు నాగమల్లేశ్వరి, నాగమ్మ అనే కుమార్తెలు ఉన్నారు. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలికి చేరుకున్నారు. ఎర్రగుంట్లలో.. ఎర్ర గుంట్ల: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన అభిమానులలో, టీడీపీ కార్యకర్తలతో నిరాశ మిగిల్చింది. అంతేకాక అపశృతి దొర్లింది. బాలయ్యను చూడడానికి వచ్చిన ఓ కార్యకర్తపై లెజండ్ బస్సు ఎక్కింది. దీంతో ఆ కార్యకర్త కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ముద్దనూరు మండలం కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్ బాలయ్య చూడడానికి ఎర్రగుంట్లకు వచ్చాడు. పోలీస్స్టేషన్ వద్దకు రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ రద్దీలో ప్రవీణ్ను బస్సు ఢీకొంది. 108 వాహనంకు సమాచారం అందించి గాయాలపాలైన ప్రవీణ్ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలయ్య వస్తున్నారని తెలిసి చూడడానికి వచ్చిన అబిమానులలో ప్రత్యేకించి మహిళలలో టీడీపీ కార్యకర్తలలో నిరాశ మిగిలింది. -
అతివేగమే ప్రాణం తీసింది..
మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదం ఒకరు మృతి, ఇద్దరికిగాయాలు సోమవారం తెల్లవారుజామున బందరులో ఘటన బాధిత కుటుంబానికి నాయకుల పరామర్శలు ఆర్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు మచిలీపట్నం క్రైం : ప్రభుత్వం రూపొం దించిన నిబంధనలు అందరితో అమలు చేయించాల్సిన అధికారులు, ఉద్యోగులు తమకు అవి వర్తించవన్నట్లు వ్యవహరిం చారు. ప్రధాన కూడళ్లలో నిదానంగా వాహ నాలు నడపాలని ప్రచారం చేసే వారే అతివేగంతో వాహనం నడి ఓ నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మరో ఇద్దరిని ఆస్పత్రులపాలు చేశారు. గుండెలను పిండే ఈ ఘట న సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు మచిలీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు. ఆయనతో పాటు ఎస్కార్ట్ జీపులో డ్రైవర్, మరో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు. మంత్రి రవీంద్రను జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్పోస్టు వరకు తీసుకెళ్లిన ఎస్కార్ట్ సిబ్బంది ఆయన్ను అక్కడ దించి. రాత్రి 12 గంటల సమయంలో తిరిగి మచిలీపట్నం బయలుదేరారు. ఎస్కార్ట్ జీపు మచిలీపట్నంలోని చలరాస్తాసెంటర్ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జీపు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలబడిన ముగ్గురిని ఢీ కొంది. ఈ ఘటనలో పట్టణంలోని నిజాంపేటకు చెందిన శేగు రామకృష్ణ (39)తీవ్రగాయాలు అయ్యాయి. అతనితో పాటు ఉన్న నిజాంపేట వాసి శేగు నాగవెంకటశివరామప్రసాద్, ఈడేపల్లికి చెందిన చొప్పరపు గోపాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జీపు పల్టీలు కొట్టటంతో దానిలో ఉన్న కానిస్టేబుల్ ఎల్.హెచ్.కుమార్కు గాయాలయ్యాయి. షాక్ నుంచి వెంటనే తేరుకున్న ఎస్కార్ట్ సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తలించారు. గాయాలపాలైన వారిలో రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు కుటుంబసభ్యులు అతన్ని విజయవాడ టైమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రామకృష్ణ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మృతి చెందాడు. బాబాయి మృతదేహాన్ని చూసేందుకెళ్లి.. ప్రమాదంలో మృతి చెందిన రామకృష్ణ పట్టణంలోని ఓ ఫ్యాన్సీ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం రామకృష్ణ బాబాయి తమ్మన రమేష్ అనారోగ్యంతో మృతి చెందారు. బాబాయి భౌతికకాయాన్ని చూసి, ఆ కుటుంబాన్ని పరామర్శిచేందుకు రామకృష్ణ చల్లరాస్తాసెంటర్లోని బాబాయి ఇంటికి వెళ్లాడు. అతనితో పాటు నాగవెంకటశివరామప్రసాద్, గోపాలకృష్ణ అక్కడికి వెళ్లారు. చనిపోయిన రమేష్ రామకృష్ణకు సొంత బాబాయి కావడంతో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. రామకృష్ణతో పాటు శివరామకృష్ణ, గోపాలకృష్ణ కూడా రాత్రికి అక్కడే ఉన్నారు. సుమారు మూడు గంటల సమయంలో నిద్ర వస్తుండటంతో టీ తాగేందుకు ఆ ముగ్గురు రోడ్డుపైకి వచ్చారు. అదే సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదవశాత్తు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన శివరామకృష్ణ, గోపాలకృష్ణ తృటితో తప్పించుకున్నారు. రామకృష్ణ మాత్రం ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రభాకరరావు మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదానికి గురైందన్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు సోమవారం ఘటనాస్థలికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదంపై డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన చోట పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీతో జరిగిన ప్రమాదంపై తీసుకోవాల్సిన చర్యలు గురించి మాట్లాడారు. ఎస్పీతో పాటు ఓఎస్డీ హృషికేశ్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందరు తహశీల్దార్ బి.నారదముని ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుడు రామకృష్ణ పూర్తి వివరాలు సేకరించారు. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. మృతుని కుటుంబానికి ఆపద్బంధు పథకం కింద నష్ట పరిహారాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.