-
షికారుకు వెళ్లి.. ప్రాణాలు వదిలారు
పెనమలూరు : విజయవాడ – అవనిగడ్డ కరకట్టపై యనమలకుదురు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మరో యువకుడు ప్రాణాలు వదిలాడు. అయితే కారులో ఉన్న ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతున్న యువతులు కూడా గాయపడి కానూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు సరదాగా షికారుకు వెళ్లి కరకట్టపై ప్రమాదానికి గురయ్యారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటమట తోటవారి వీధికి చెందిన రేసపు జీవన్రెడ్డి (21) అదే ప్రాంతానికి చెందిన అతని మిత్రుడు నెక్కల ప్రశాంత్ (22) గత ఏడాది ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వీరికి సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కానూరుకు చెందిన ఈదా స్నేహ (19), ముదిగొండ సుప్రజ (19) తో పరిచయం ఉంది. కాగా శుక్రవారం సాయంత్రం స్నేహ, సుప్రజ ఎసైన్మెంట్ ఉందని పటమటలో జీవన్రెడ్డి వద్దకు వెళ్లారు. అక్కడ జీవన్రెడ్డి, ప్రశాంత్ కారులో ఉండటంతో వారిని కూడా ఎక్కమని కోరారు. దీంతో నలుగురూ కారులో షికారుకు బయలుదేరారు. వీరి కారు రాత్రి యనమలకుదురు కరకట్ట చింతల్ వద్దకు రాగా ఎదురుగా వచ్చిన ఇసుక లోడు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న జీవన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వెనుక సీట్లో కుడి పక్కన కూర్చున్న ప్రశాంత్కు తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో ఉన్న స్నేహ, సుప్రజలకు కూడా గాయాలు అవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. కోలుకుంటున్న విద్యార్థినులు.. కాగా, కారులో ఉన్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులు కానూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ట్రాక్టర్, కారును కుడిపక్క ఢీకొట్టడంతో కారులో ఆ వైపుగా కూర్చున్న ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. కారులో ఎడమ వైపున కూర్చున్న యువతులు ప్రాణాలతో బయటపడ్డారు. రాత్రి సమయంలో వీరు కరకట్టపై కారులో షికారు చేయటం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. అందులోనూ కారు వేగంగా వెళ్లటం వలన ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. సరదాగా షికారుకు వెళ్లిన వీరిలో యువకులు ప్రాణాలు వదటం విషాదం మిగిల్చింది. -
యువతి ర్యాష్ డ్రైవింగ్, ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
నెల్లూరు : నిర్లక్ష్య డ్రైవింగ్ తో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న షారోన్ ప్రియాంక అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో ప్రియాంక మద్యం సేవించి కారు నడిపిందా అనే అనుమానంతో పరీక్షల న నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా తన డ్రైవింగ్ ప్రతిభను స్నేహితులకు చూపాలనే అత్యుత్సాహంతో ఆమె ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కారును వేగంగా నడిపి మూడు బైక్లను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రే పోలిరెడ్డి వెంకటేష్(21) మృతిచెందగా సోమవారం తెల్లవారుజామున కార్తీక్రెడ్డి(17), విజయకుమార్(22) కన్నుమూశారు. కాగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని ప్రియాంక బంధువులు చెప్పటం గమనార్హం. ఇక నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు..తోటపల్లి గూడూరుకు చెందిన పోలిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వెంకటేష్ సమీపంలోని జెన్ కో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతసాగరం మండలం ఇనగలూరుకు చెందిన పోలిరెడ్డి కార్తీక్రెడ్డి పెదనాన్న వెంకట సుబ్బారెడ్డి ఇంట్లోనే ఉంటూ నెల్లూరులోని శ్రీచైతన్యకళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం టెక్కోలుకు చెందిన గంగనపల్లి వెంకటరమణయ్య కుమారుడు విజయకుమార్(22) నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విజయకుమార్ హరనాథపురంలోనే స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. విజయకుమార్ తన స్నేహితులతో కలిసి కొత్తకోడూరు బీచ్ కు రెండు బైక్ల్లో బయలుదేరారు. అదే సమయంలో వరుసకు సోదరులైన వెంకటేష్, కార్తీక్ జాతీయ రహదారిపై బైక్పై వస్తున్నారు. విజయకుమార్ స్నేహితులకు వెంకటేష్, కార్తీక్కు ఎలాంటి పరిచయం లేదు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని క్రాస్రోడ్డు వద్ద యాదృచ్ఛికంగా వీరు బైక్లపై పక్కపక్కనే వెళుతున్నారు. ఈ సమయంలో నగరానికి చెందిన షారోన్ ప్రియాంక కారును వేగంగా నడుపుతూ డివైడర్ను దాటుకొచ్చి వీరి బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురూ మృతి చెందగా విజయకుమార్ స్నేహితులు సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రియాంకతో పాటు కారులో ఉన్న ఆమె స్నేహితురాళ్లు వినీల, వినీత క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. వెంకటేష్, కార్తీక్రెడ్డి, విజయకుమార్ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరి మృతితో స్వగ్రామాలతో పాటు చదివే కళాశాలల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. నెల్లూరు రూరల్ ఎస్సై గిరిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకులు ఆయా కుటుంబాల్లో ఏకైక మగసంతానం కావడంతో రోదనలు మిన్నంటాయి. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement