-
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్మార్టం
-
తప్పుదోవ పట్టించి.. తరలింపు!
పోలీసులను విశాఖకు.. మావోలను మల్కన్గిరికి సంఘటన ఒడిశాలో జరిగిందంటూ మావోలు అక్కడికే తరలింపు అదే సంఘటనలో గాయపడిన గ్రేహౌండ్స్ సిబ్బందిని మాత్రం విశాఖకు పోలీసుల ద్వంద్వ వైఖరితో అనుమానాలకు మరింత బలం మల్కన్గిరి నుంచి సాక్షి ప్రతినిధి:రెండు రాష్ట్రాలను కుదిపేసి.. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన భారీ ఎన్కౌంటర్.. అదే స్థాయిలో అనుమానాలను రేపుతోంది. పోలీసుల తీరు వాటిని మరింత బలపరుస్తోంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎన్నడు లేని విధంగా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాగా ఈ ఎన్కౌంటర్ బూటకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై తర్జనభర్జన పడ్డ విశాఖ, మల్కన్గిరి ఎస్పీలు ఒడిశా రాష్ట్రంలో సంఘటన జరిగిందనే కారణం చూపుతూ మల్కన్గిరి ఎస్పీ కార్యాలయానికి మృతదేహాలను తరలించారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం కూడా నిర్వహించారు. మరో పక్క ఏపీ హైకోర్టు ఈ నెల 27వరకు మృతదేహాలను విశాఖ కేజీహెచ్లో భద్రపరచాలని తీర్పు ఇచ్చింది. ఇరు రాష్ట్రాల పోలీసులు దాన్ని బుట్టదాఖలు చేసేశారు. అదే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గ్రేహౌండ్స్ కమెండోలు అబూబాకర్, సతీష్లను విశాఖపట్నం ఆస్పత్రులకు తరలించారు. వీరిలో బాకర్ మరణించారు. పోలీసులను మాత్రం విశాఖకు తరలించి.. మావోల మృతదే హాలను ఒడిశాకు తరలించడంలో అంత్యర్యం ఏమిటి?.. పోలీసులకు ఈ నిబంధనలు వర్తించవా..? అని పౌర హక్కుల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన అనంతరం మృతదేహాలను ఎక్కడకు తరలిస్తారన్న దానిపై స్పష్టత కోసం మీడియా ప్రతినిధులు, ప్రజలు, పౌర హక్కులు నేతలు ఉత్కంఠంగా ఎదురు చూడగా పోలీసులు వారిని తప్పుదోవ పట్టించారు. మృతదేహాలను విశాఖపట్నం తరలిస్తే వారి బంధువులు, పౌరహక్కుల నేతలు ఎన్ కౌంటర్పై అనుమానాలు వ్యక్తం చేస్తారన్న భయంతోనే ఒడిశాకు తరలించారని తెలుస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది పోలీసులు పాల్గొన్నారన్న ప్రశ్నను సాక్షి ప్రతినిధి ఎస్పీలను మీడియా సమావేశంలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ ఎన్కౌంటర్లో ఏడు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పినప్పటికి స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మావోయిస్టు మృతుల్లో ఎక్కువమంది యుక్త వయస్సు వారే ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement