breaking news
Employee service
-
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: పదేళ్లకు పైగా సర్వీస్ ఉన్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని అక్టోబర్ 23న తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల సేవలను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఈ తీర్పును న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వర్ రావు వెలువరించారు. ఈ కేసు వి.ప్రదీప్, ఎం.రాములు దాఖలు చేసిన రిట్ పిటిషన్లకు సంబంధించినది. వీరిద్దరూ 13 సంవత్సరాలుగా జూనియర్ ఇంజనీర్/మ్యానేజర్గా, మ్యానేజర్ (ప్రొడక్షన్ అండ్ ప్రోక్యూర్మెంట్)గా 16.5 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ సేవలందిస్తున్నారు.జస్టిస్ రాజేశ్వర్ రావు తన తీర్పులో పేర్కొంటూ, పిటిషనర్లు తాత్కాలిక లేదా విరామాలతో కూడిన పనుల్లో కాకుండా, సాంక్షన్ చేసిన పోస్టులపైనే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ అంశం “వివాదాస్పదం కాదని” కూడా న్యాయస్థానం గమనించింది.అలాగే, కోర్టు స్పష్టమైన గడువును విధించింది. తీర్పు ప్రతిని అందుకున్న తేదీ నుండి మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
మేం జోక్యం చేసుకోలేం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు వారికి ఇతర ఉద్యోగుల్లాగే చట్ట ప్రకారం సమాన జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయం పొందేందుకు బాధితులకు ప్రత్యామ్నాయం ఉందని, అందువల్ల వారు సంబంధిత ఫోరాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. ఇది ఉద్యోగుల సర్వీసు వివాదమని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దీనిని విచారించడం సాధ్యం కాదంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


