-
నిరాశ పరిచిన ఎల్డోజ్ పాల్.. తొమ్మిదో స్థానంలో నిలిచి..
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ ఎల్డోజ్ పాల్ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల రిలే హీట్స్ను మొహమ్మద్ అనస్ యాహియా, మొహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేశ్ రమేశ్లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది. చదవండి: వచ్చేసారి మరింత మెరుగ్గా రాణిస్తా.. బంగారు పతకమే నా టార్గెట్: నీరజ్ చోప్రా -
World Athletics Championship: పతకంపై ఆశలు!
యుజీన్ (అమెరికా): 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్కు ఇప్పటివరకు ఒక్క పతకమే వచ్చింది. 2003లో మహిళల లాంగ్జంప్లో అంజూ జార్జి కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరిగినా భారత్ ఖాతాలో మాత్రం మరో పతకం చేరలేదు. అంతా సవ్యంగా సాగితే ఆదివారం ఉదయం భారత్ ఖాతాలో ఈ మెగా ఈవెంట్ నుంచి మరో పతకం చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత ఆశాకిరణం, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఆశలను రేకెత్తిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశాన్ని ఊపేసిన నీరజ్ చోప్రా ప్రస్తుత ప్రపంచ చాంపియన్షిప్లోనూ మెరుగైన ప్రదర్శనతో తొలి అడ్డంకి దాటాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ఫైనల్కు అర్హత సాధించాలంటే జావెలిన్ను 83.50 మీటర్ల దూరం విసరాలి లేదంటే ఓవరాల్గా టాప్–12లో నిలవాలి. అయితే నీరజ్ తొలి త్రోలోనే 83.50 మీటర్ల లక్ష్య దూరాన్ని అధిగమించాడు. 24 ఏళ్ల నీరజ్ ఈటెను 88.39 మీటర్ల దూరం విసిరి తన కెరీర్లో తొలిసారి ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్కు అర్హత పొందాడు. ఓవరాల్గా అతని కెరీర్లో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 13 మంది పాల్గొన్న గ్రూప్ ‘ఎ’లో నీరజ్ అగ్రస్థానాన్ని... ఓవరాల్గా రెండో స్థానాన్ని అందుకున్నాడు. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 89.91 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి టాప్ ర్యాంక్లో నిలిచాడు. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్కే చెందిన రోహిత్ యాదవ్ జావెలిన్ను 80.42 మీటర్ల దూరం విసిరి ఓవరాల్గా 11వ స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది పోటీపడే జావెలిన్ త్రో ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. ట్రిపుల్ జంపర్ పాల్ సంచలనం శుక్రవారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్లో 25 ఏళ్ల ఎల్డోజ్ పాల్ 16.68 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్ ‘ఎ’లో ఆరో స్థానంలో, ఓవరాల్గా 12వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ట్రిపుల్ జంపర్గా గుర్తింపు పొందాడు. భారత్కే చెందిన ప్రవీణ్ చిత్రావెల్ 17వ స్థానంలో, అబ్దుల్లా అబూబాకర్ 19వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందలేకపోయారు. ట్రిపుల్ జంప్ ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు మొదలవుతుంది. సోనీ టెన్–2 చానెల్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. ఫైనల్లో నా 100 శాతం ప్రదర్శన ఇస్తా. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి రోజు వేరుగా ఉంటుంది. ఏ రోజు ఎవరు ఎంత దూరం విసురుతారో చెప్పలేం. ఫైనల్కు చేరిన 12 మందిలో ఐదారుగురు ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నారు. – నీరజ్ చోప్రా -
ట్రిపుల్ జంప్ ఫైనల్లోకి ఎల్డోజ్ పౌల్.. తొలి భారత అథ్లెట్గా..!
అమెరికాలోని యుజీన్ వేదికగా జరగుతోన్న అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2022లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ట్రిపుల్ జంప్ ఈవెంట్లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ ఫైనల్కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో 16.68 మీటర్ల దూకి ఎల్డోస్ పాల్ ఫైనల్లో అడుగు పెట్టాడు. తద్వారా ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ట్రిపుల్ జంప్ విబాగంలో ఫైనల్కు చేరిన తొలి భారత అథ్లెట్గా ఎల్డోస్ పాల్ చరిత్ర సృష్టించాడు. ఇక ఇదే ఈవెంట్లో పాల్గొన్న భారత అథ్లెట్లు ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్ ఫైనల్కు చేరడంలో విఫలమయ్యారు. ఇక ఆదివారం జరగనున్న అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్లో ఎల్డోస్ పాల్ తలపడనున్నాడు. మరో వైపు శుక్రవారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా,రోహిత్ యాదవ్ ఫైనల్కు చేరుకున్నారు. చదవండి:World Athletics Championships 2022:. ఫైనల్స్కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
Advertisement