నిరాశ పరిచిన ఎల్డోజ్‌ పాల్‌.. తొమ్మిదో స్థానంలో నిలిచి.. | Sakshi
Sakshi News home page

World Championships 2022: నిరాశ పరిచిన ఎల్డోజ్‌ పాల్‌.. తొమ్మిదో స్థానంలో నిలిచి..

Published Mon, Jul 25 2022 12:39 PM

World Championships 2022: Eldhose Paul finishes ninth in triple jump - Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆదివారమే జరిగిన పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఫైనల్లో భారత ప్లేయర్‌ ఎల్డోజ్‌ పాల్‌ నిరాశపరిచాడు. కేరళకు చెందిన పాల్‌ 16.79 మీటర్ల దూరం గెంతి తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

పురుషుల 400 మీటర్ల రిలే హీట్స్‌ను మొహమ్మద్‌ అనస్‌ యాహియా, మొహమ్మద్‌ అజ్మల్, నాగనాథన్‌ పాండి, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన భారత బృందం 3ని:07.29 సెకన్లలో పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందలేకపోయింది.
చదవండి: వచ్చేసారి మరింత మెరుగ్గా రాణిస్తా.. బంగారు పతకమే నా టార్గెట్‌: నీరజ్ చోప్రా

Advertisement
Advertisement