-
ఈఐఏ–2020తో మానవాళికి ముప్పు
సినిమా: ఈఐఏతో మానవాళికి ముప్పు తప్పదని సూర్య, కార్తీ అభిప్రాయపడ్డారు. వివరాలు.. కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్–2020 డ్రాప్ట్ (ఈఐఏ) విధి విధానాన్ని తీసుకురానున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది భవిష్యత్లో మానవాళికి తీవ్ర ప్రమాదకరంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే విషయాన్ని యువ నటుడు కార్తీ తెలిపారు. నటుడు ఉళవన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి రైతులకు, వ్యవసాయానికి పలు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈఐఏ–2020 డ్రాప్ట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం తన ఉళవన్ ఫౌండేషన్ తరఫున ప్రకటన విడుదల చేశారు. ఈఐఏ–2020 మన దేశ పర్యావరణానికి ముప్పు కలిగించేలా ఉందన్నారు. ప్రకృతి వనరులను తొలగిస్తూ, వాటిని అభివృద్ధిగా భావించడం భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మార్చే ప్రయత్నమే అవుతుందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా చట్టాన్ని అమలు పరచాలనుకోవడమే భయానికి గురి చేస్తోందన్నారు. మనకు ఏర్పడే ముప్పు గురించి మనమే మాట్లాడక పోవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ అంశంపై అనుభవజ్ఞులు, మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కార్తీ కోరారు. కార్తీ సోదరుడు, హీరో సూర్య సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన బుధవారం తన ట్విట్టర్లో పేర్కొంటూ అభిప్రాయాలను వ్యక్తం చేయడం కంటే అసలు మౌనంగా ఉండటం చాలా ప్రమాదకరమన్నారు. అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మౌనాన్ని వీడుదామని సూర్య పేర్కొన్నారు. నటుడు సూర్య, కార్తీలకు వారి అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. పలువురు స్వాగతిస్తున్నారు. -
'ప్రాణహిత’పై పర్యావరణ కమిటీకి ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత’ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యా వరణ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఎదుట రాష్ట్ర అధికారులు గురువారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాణ హిత నీటిని తమ్మిడిహెట్టి ద్వారా మళ్లించే ప్రక్రియ పర్యావరణ, ఆర్థిక, నిర్వహణ పరంగా అనుసరణీయంగా ఉంటుందని వివరించారు. పర్యావరణ మదింపు చేసుకునేందుకు విధి విధానాలను (టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్–టీఓఆర్)ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత రూ.1,919 కోట్ల అంచనా, 56 వేల ఎకరాలకు నీరందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే తర్వాత రూ.4,231 కోట్ల అంచనాతో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొం దించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి.. 14.4 టీఎంసీల నీటిని తరలి స్తారు. ఈ అన్ని అంశాలపై ఈఏసీ కమిటీ ముందు ప్రాజెక్టు సీఈ భగవంతరావు వివరణ ఇచ్చారు. -
కాళేశ్వరానికి ‘పర్యావరణ’ బ్రేక్!
కేంద్ర జల సంఘం ఓకే చెప్పేంత వరకు అనుమతులివ్వలేం l స్పష్టం చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ l నేడు ఢిల్లీకి విద్యాసాగర్రావు, సీఈ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)నకు బ్రేక్ పడింది! ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు ఇచ్చేవరకు తాము ఈఐఏకు అనుమతులు ఇవ్వబోమని కేంద్ర పర్యావర ణ, అటవీ శాఖ తేల్చిచెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసా ధ్యాలపై చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) రెండో సమావేశపు మినిట్స్ను పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా వెబ్సైట్లో ఉంచింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాకే ఈఐఏకు అనుమతిస్తామనడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై తేల్చుకునేందుకు నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. పర్యావరణ అనుమతులకు ఆగాల్సిందే సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.80,499.71 కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. గోదావరి నుంచి మొత్తం 180 టీఎంసీలను మళ్లించేలా 26 రిజర్వాయ ర్లను నిర్మించేందుకు ప్రణా ళిక వేశారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. 2,866 హెక్టార్లు (13,706 ఎకరాల)మేర అటవీ భూమి అవసరం ఉంది. ఈ మొత్తం భూమిలో 13,706 హెక్టార్లు (34,265 ఎకరాలు) పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉంది. ఈ అంశాలన్నీ పర్యావరణా న్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేవే. వీటన్నింటికీ పరిష్కారాలు చూపుతూ ప్రభుత్వం పర్యావరణ ప్రభావ మదింపు చేపట్టాలి. ఇక దీనికి తోడు ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించాలంటే మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తప్పనిసరి. ఇందులో కొన్ని అనుమతులు సులభమైనవే అయినా.. పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు కాస్త క్లిష్టతరమైనవి. ప్రస్తుతం కోర్టు కేసులు, ట్రిబ్యునళ్ల తీర్పుల నేపథ్యంలో నీటి పారుదల శాఖ.. కాళేశ్వరం ప్రాజెక్టులో పర్యావరణ అంశానికే ప్రాధాన్యం ఇచ్చి పర్యావరణ మదింపు కోసం ఈఏసీకి గత నెలలోనే వివరణ ఇచ్చింది. ఈ వివరణలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు డిజైన్కు అనుగుణంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీఓఆర్)ను ఖరారు చేసినట్లు సమాచా రం సైతం అందించింది. ఈ టీఓఆర్ విధివిధానా లకు అనుగుణంగా పర్యావరణ మదింపు నివేదికను తిరిగి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తే అక్కడ ఆమోదం దక్కనుంది. ఈ ఆమోదం ఉంటేనే ప్రాజెక్టుకు జాతీ య హోదా అంశంతో పాటు రుణాలు తీసుకునేం దుకు రాష్ట్రానికి వెసులుబాటు ఉంటుంది. అ యితే ఈఏసీ ఇటీవల వెలువరించిన తన మినిట్స్ కాపీలో మాత్రం పర్యావరణ అనుమతులకు అంగీకరించలే మని పేర్కొంది. ‘‘ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలు తదితర అంశా లపై చర్చలు జరిపాం. అయితే ఈ ప్రాజెక్టును అనుమతించకూడదని నిర్ణయిం చాం. కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టుకు ఆమోదిం చలేం’’ అని కమిటీ తన మినిట్స్ లో స్పష్టం చేసింది. కమిటీకి చైర్మన్గా ఉన్న శరద్కుమార్ జైన్ సహా మరో 11 మంది సభ్యులు ఓకే చెప్పినా హైడ్రాలజీ విభాగానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ దీనికి అడ్డు తగలడంతోనే ఈఐఏకు బ్రేకులు పడ్డాయని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై తేల్చుకునేందుకు సోమవారం ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్రావు, సీఈ హరిరాం ఢిల్లీ వెళ్లనున్నారు. కొత్త మార్గదర్శకాలే అడ్డు? కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఆగడం వెనుక ఇటీవల కేంద్ర జల సంఘం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలే కారణమని తెలుస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అనుమతులు తొందరగా రావాలంటే సీడబ్ల్యూసీతో సంప్రదించి రూపొందించిన డీపీఆర్ కచ్చితంగా ఉండాలి. మొదట రాష్ట్ర ప్రభుత్వాలు ఒక డీపీఆర్ను రూపొందించాలి. ఆ డీపీఆర్తో సీడబ్ల్యూసీని సంప్రదిస్తే.. వారు అవసరమైన మార్పుచేర్పులు సూచిస్తారు. ఆ మార్పులను పొందుపరిచి రాష్ట్రాలు తుది డీపీఆర్ని సీడబ్ల్యూసీకి ఇవ్వాలి. దీనిపై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకి ప్రజెంటేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకారం తెలుపుతుంది. ఆ తర్వాత నిర్ణయించిన గడువులోగా అను మతులు జారీ చేస్తారు. వాస్తవానికి ఏ రాష్ట్రమైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన అనంతరం అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగినా ఏళ్లకు ఏళ్లుగా పర్యావరణ, అటవీ వంటి అనుమతులు రాక ప్రాజెక్టు నిర్మాణాల్లో విపరీత జాప్యం జరిగి, వాటి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది మొత్తంగా ప్రాజె క్టు వ్యయ, ప్రయోజనాల మధ్య భారీ అంతరాన్ని పెంచుతోంది. దీన్ని దృష్టి లో పెట్టుకొనే ఇటీవల సీడబ్ల్యూసీ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. ఈ మార్గదర్శకాలే ప్రస్తుతం కాళేశ్వరానికి అడ్డుగా మారాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement