-
నెట్టింట.. ప్రభుత్వ బడులు!
సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది. ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది. 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్నెట్, బీఎస్ఎన్ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది. -
పాడ్కాస్ట్కు మరింతగా పెరుగుతున్న ఆదరణ!
వీడియోలను విరివిగా చూడటం అనేది కోవిడ్ కాలం తర్వాత వేగంగా పెరిగింది. ఇంట్లోనే ఉండాల్సిన నాటి సమయంలో వినోదం కోసం వీడియోలను చూస్తూ టైమ్పాస్ చేశారు. వీడియోలపై ప్రేక్షకులకు పెరుగుతున్న క్రేజ్ను గమనించిన బడా టెలివిజన్ నెట్వర్క్లు ఓటీటీ ప్లాట్ఫారమ్లోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఓటీటీలకు ప్రత్యామ్నాయంగా పాడ్కాస్ట్ల ట్రెండ్ మరింతగా పెరుగుతోంది. పాడ్కాస్ట్..అంటే మోడ్రన్ రేడియో.. విద్య, వినోదం, వార్తలు, మత ప్రసంగాలు, నవలలు, మతపరమైన పుస్తకాలు, సాహిత్యం... ఇలా సమస్తం ఇప్పుడు ఆడియో రూపంలో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులలో పాడ్కాస్ట్పై విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. భారీ కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు చదువును ఎలా సులభతరం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయి. కోవిడ్ కాలంలో ఆన్లైన్ తరగతులు విరివిగా నిర్వహించేవారు. అయితే ఇప్పుడు పెద్దపెద్ద విద్యా కేంద్రాలు సిలబస్ను ఆడియో రూపంలో మార్చడానికి, విద్యార్థులకు సరళమైన భాషలో పాఠాలను బోధించేందుకు కృషి చేస్తున్నాయి. ఆడియో బుక్కు సంబంధించిన మెటీరియల్ను వివిధ సబ్జెక్టుల నిపుణులు సరళమైన భాషలో సిద్ధం చేస్తున్నారు. వాటిని నిపుణుల సహకారంతో ఆడియో బుక్గా మార్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. మొబైల్లోని విద్యాసంబంధిత పాడ్కాస్ట్ను ఆన్ చేసి, చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టుకుని విద్యార్థులు సులభంగా వాటిని వినవచ్చు. అర్థం కాని సందర్భంలో మరోమారు వినేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. వినోదం కోసం ఇప్పుడు స్టోరీ పాడ్కాస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వివిధ రకాల కథలను వినేందుకు అవకాశం ఏర్పడుతోంది. క్రైమ్, హర్రర్, కామెడీ ఇలా విభిన్న తరహాలలోని కథలు మనం వినవచ్చు. సెలబ్రిటీ వాయిస్లలో రికార్డ్ చేసిన పాడ్కాస్ట్లు, ఆడియో పుస్తకాలు ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రేరణాత్మక ప్రసంగాలు మొదలుకొని మతపరమైన ప్రసంగాల వరకు సమస్తం పాడ్కాస్ట్ రూపంలో మన ముందుకు వచ్చాయి. వివిధ పాడ్కాస్ట్ యాప్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పలువురు మోటివేషనల్ స్పీకర్లు తమ పాడ్కాస్ట్లను విడుదల చేస్తున్నారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం, స్థానిక వార్తలను అందించే పలు పాడ్కాస్ట్లు ఆదరణ పొందుతున్నాయి. న్యూస్ యాప్లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రత్యేక పాడ్కాస్ట్ బులెటిన్లను చాలామంది క్రమం తప్పక వింటున్నారు. ఇప్పుడు పాడ్కాస్ట్లలో షేర్ ట్రేడింగ్ మొదలుకొని ఉద్యోగంలో విజయం వరకు అనేక రకాల సమాచారం విశేష ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
ఇంటర్న్షిప్స్ తో విద్యార్థులకు పెద్ద కంపెనీలో ఉద్యోగ అవకాశాలు
-
మరిన్ని స్కూళ్లు ‘డిజిటల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ అత్యున్నత స్థాయి విద్య అందించాలని, వారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు తెచ్చారు. పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్కూళ్లలో మాదిరిగా అత్యాధునిక పద్ధతుల్లో బోధన, వసతులు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. ఇందుకోసం గత నాలుగున్నరేళ్లలో రూ. 66 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణంతోపాటు అత్యాధునిక బోధన పద్ధతులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీలు) ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి అన్ని ఉన్నత పాఠశాలల్లో మరో 32 వేల ఐఎఫ్పీ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 23 వేల స్మార్ట్ టీవీలు అందించనున్నారు. సామాన్యుల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన బోధనను ఈ (2023–24) విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో పాఠశాల విద్యను దేశంలోనే అతి పెద్ద డిజిటల్ ప్లాట్ఫారంగా మారుస్తోంది. తొలివిడత నాడు–నేడులో ఆధునీకరించిన పాఠశాలల్లో నూతన తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలతో పాటు కార్పొరేట్ పిల్లలకు మాత్రమే సాధ్యమైన బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా అందించింది. అనంతరం అమెరికా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే విద్యా బోధనకు వినియోగించే అత్యాధునిక టెక్నాలజీ గల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ను, స్మార్ట్ టీవీలను 11,315 పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ నెలలోనే అందుబాటులోకి తెచ్చింది. 4,800 ఉన్నత పాఠశాలల్లో 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను ఏర్పాటు చేయగా, 6,515 ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఈ డిసెంబరు మొదటి వారానికి మరో 32 వేల ఐఎఫ్పీలను హైస్కూళ్లకు అందించనుంది. గతంలో పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పీలనే ఇప్పుడూ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు అధికారులు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసే 23 వేల స్మార్ట్ టీవీల టెండర్ల జ్యుడిíÙయల్ ప్రివ్యూ పూర్తయింది. ఈ టెండర్లను ఖరారు చేసి వచ్చే నెలలోనే స్మార్ట్ టీవీల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలో పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఈ ఏడాది టోఫెల్ కూడా ప్రవేశపెట్టడం, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీల ద్వారా బోధన వల్ల కలిగే మంచి ఫలితాలు ఇటీవల ముగిసిన ఫార్మాటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షల్లో కనపడటంతో అన్ని పాఠశాలల్లో కొత్త ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎఫ్పీలతో అత్యాధునిక పద్ధతిలో బోధన ఐఎఫ్పీలు అత్యాధునిక బోధనకు ప్రతీకగా నిలుస్తాయి. 165 సెంటీమీటర్ల వైశాల్యం ఉండే ఈ స్క్రీన్లపై ఓ పక్క వీడియోలో బోధన చేస్తూనే.., మరోపక్క విద్యారి్థకి అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులు బోర్డు మీద రాసి చూపించవచ్చు. అవసరమనుకుంటే అదే అంశాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. మొత్తం పాఠాన్ని లింక్ రూపంలో ఆన్లైన్లో పెట్టొచ్చు. అంటే ఒకే బోర్డుపై అనేక విధాలుగా బోధన (మల్టీ టాస్కింగ్) చేయొచ్చు. ఈ ఐఎఫ్పీ ప్యానెళ్లలో పాఠ్యాంశాలు, బైజూస్ కంటెంట్ను తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో అందిస్తారు. గూగుల్ అసిస్టెంట్తో వచ్చే ఈ ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లు 6 నుంచి 10వ తరగతి వరకు సెక్షన్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడత ఐఎఫ్పీ స్క్రీన్లు ఏర్పాటుచేసిన పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్టు గుర్తించారు. -
దోస్త్ ద్వారా 6,843 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఖాళీ సీట్ల భర్తీకి చేపట్టిన ప్రత్యేక దశ కేటాయింపులో 6,843 మంది సీట్లు పొందినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో మొదటి ప్రాధాన్యత ద్వారా 6,061 మందికి, రెండో ప్రాధాన్యత ద్వారా 782 సీట్లు వచి్చనట్టు తెలిపారు. ఆర్ట్స్లో 1,026, కామర్స్లో 2,131, లైఫ్ సైన్స్లో 2,240, ఫిజికల్ సైన్స్లో 618, డేటాసైన్స్లో 61, బీఎస్సీ ఆనర్స్ (కంప్యూటర్ సైన్స్)లో 43, బీఎస్సీ (బయో–టెక్నాలజీ)లో 20, అప్రెంటిస్íÙప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్లో 104, ఇతర బ్రాంచీల్లో 600 సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సీట్టు పొందిన వారు శనివారంలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇదే రోజు నుంచి అక్టోబర్ 3 వరకూ అన్ని కాలేజీల్లో ఇంట్రా–కాలేజ్ ఫేజ్–2కి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కలి్పస్తున్నట్లు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement